Kothagudem: కాణిపాకం గణపతి అలంకారంలో విజయ విఘ్నేశ్వర స్వామి

Kothagudem: కొత్తగూడెం విజయ విఘ్నేశ్వర ఆలయంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు. కాణిపాకం గణపతి అలంకారంలో భక్తులను అలరిస్తున్న స్వామివారు. తరలివచ్చిన భక్తులు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 16 Sept 2026 10:28 PM IST
Kothagudem
X

Kothagudem: కాణిపాకం గణపతి అలంకారంలో విజయ విఘ్నేశ్వర స్వామి

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 16న స్వామివారు శ్రీ కాణిపాకం గణపతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

విఘ్నేశ్వరుని ప్రధాన క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి అవతారాన్ని ప్రతిబింబించేలా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. కాణిపాకం గణపతిని దర్శించుకుంటే భక్తుల మనోరథాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన విజయ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ స్వామివారికి వివిధ రూపాల్లో అలంకరణలు నిర్వహిస్తుండటంతో ఆలయానికి భక్తుల రాక పెరుగుతోంది. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM