Bhadrachalam: భద్రాచలం బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్గా ధనసరి నాగమణి!
Bhadrachalam: భద్రాచలం బీఈడీ కళాశాల నూతన ప్రిన్సిపాల్గా ధనసరి నాగమణి బాధ్యతల స్వీకరణ. ఐటీడీఏ పీవో రాహుల్, సర్పంచ్ పూణేం కృష్ణ ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Bhadrachalam: భద్రాచలం బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్గా ధనసరి నాగమణి!
భద్రాచలం సెప్టెంబర్ 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లోని బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ గా శ్రీమతి ధనసరి నాగమణి శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. బీఈడీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీమతి భవాని బాధ్యతలు అప్పగించారు.
బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన ధనసరి నాగమణి ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తమ ఛాంబర్లలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పిఓ అభినందించారు. అంతకుముందు బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ గా దానసరి నాగమణి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె ఛాంబర్ లో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూణేమ్ కృష్ణ కలిసి అభినందనలు తెలిపారు.




