Kothagudem: కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాటుకు గురై రెండు ఆవులు మృతి!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఊర్లదాసుపల్లిలో పిడుగుపడి రెండు ఆవులు మృతి చెందాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Kothagudem: కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాటుకు గురై రెండు ఆవులు మృతి!
Kothagudem: కృష్ణసాగర్ పంచాయతీ పరిధిలోని ఊర్లదాసుపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిన్న అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం కురుస్తుండగా పిడుగు పడటంతో రెండు ఆవులు మృతి చెందాయి.
భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పిడుగుపాటుతో పశువులను కోల్పోయిన బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.




