Rayachoti: మతసామరస్యానికి ప్రతీకగా గణేష్ ఉత్సవాలు
Rayachoti: రాయచోటిలో మతసామరస్యానికి ప్రతీకగా వినాయక ఉత్సవాలు. రూ. 1.11 లక్షలకు వినాయక లడ్డూను దక్కించుకున్న బీసీ సంఘం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దుర్గం షబ్బీర్.
Rayachoti: మతసామరస్యానికి ప్రతీకగా గణేష్ ఉత్సవాలు
రాయచోటి: రాయచోటిలో మతసామరస్యాలకు ప్రతీకగా గణేష్ ఉత్సవాలను హిందూ ముస్లిం కలసి నిర్వహించారు. వినాయక చవితి పండుగను అందరూ కలసి చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని బీసీ సంఘం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దుర్గం షబ్బీర్ పేర్కొన్నారు.
ఆదివారం మాసాపేట వరిగ రోడ్లో పూలుకుంట రెడ్డెన్న ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద వినాయక లడ్డును షబ్బీర్ 1,11,116 రూపాయల కు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నా షబ్బీర్
మాట్లాడుతో వర్షాలు బాగా కురిసి రైతులందరూ సుభిక్షంగా ఉండాలని వినాయకున్ని ఆయన కోరుకున్నారు. లడ్డు వేలం అనంతరం డప్పు వాయిధ్యాలతో గ్రామస్థులందరూ ఊరేగింపుగా షబ్బీర్ ఇంటికి లడ్డును తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పూలుకుంట రెడ్డెన్న, షమీమ్ , రమణ రామయ్య,సత్తార్, తదితరులు పాల్గొన్నారు.




