Rayachoti: రిమ్స్ ఆసుపత్రిలో పాము కాటు బాధితులను పరామర్శించిన లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

Rayachoti: కడప రిమ్స్ ఆసుపత్రిలో పాము కాటు బాధితులైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి. మెరుగైన వైద్యం అందించాలని సూచన.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 20 Sept 2026 5:39 PM IST
Rayachoti
X

Rayachoti: రిమ్స్ ఆసుపత్రిలో పాము కాటు బాధితులను పరామర్శించిన లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

రాయచోటి: రాయచోటి నియోజకవర్గం, రామాపురం మండలం,కసిరెడ్డి గారిపల్లి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు పాము కాటుకు గురై అనారోగ్యంతో బాధపడుతూ కడప రిమ్స్ హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకొని వారిని పరామర్శించిన రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ ఆసుపత్రి వైద్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI