Kukatpally: తన నివాసంపై జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ సీనియర్ నేత!
Kukatpally: కూకట్పల్లి బీజేపీ సీనియర్ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Kukatpally: తన నివాసంపై జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ సీనియర్ నేత!
కూకట్ పల్లి, మారుతి సాగర్, రిపోర్టర్: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
Next Story




