Prathipadu: ప్రత్తిపాడులో ఒంగోలు జాతి పశువుల బలప్రదర్శన పోటీలు!

Prathipadu: గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఎన్టీఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఒంగోలు జాతి పశువుల బలప్రదర్శన పోటీలు ఘనంగా నిర్వహణ.

ANANDBABU,	PRATTIPADU
Published on: 17 Sept 2026 7:16 AM IST
Prathipadu
X

Prathipadu: ప్రత్తిపాడులో ఒంగోలు జాతి పశువుల బలప్రదర్శన పోటీలు!

Prathipadu: ఒంగోలు జాతి పశు బలప్రదర్శన పోటీల్లో పాల్గొన్న గుంటూరు టు శాసన సభ్యురాలు గల్లా మాధవి ప్రత్తిపాడు శాసనసభ్యులు రామాంజనేయులు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు లో వినాయక చవితి సందర్భంగా నందమూరి తారకరామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతి పశువుల బల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు టు ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.

ఒంగోలు జాతి పశువుల బల ప్రదర్శన లో పాల్గొన్న జతకి బహుమతి ప్రధానం చేశారు.

గల్లా మాధవి మాట్లాడుతూ పది సంవత్సరాలుగా వేయ ప్రయాసలకు వచ్చి యువత ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. రైతులు పశుపోషకులు ఈ కార్యక్రమం చాలా ఆరాధికారంగా ఉందన్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేట్ గింజుపల్లి వెంకటేశ్వరరావు రూరల్ మండలం జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు కల్లూరి శ్రీనివాసరావు ప్రత్తిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గింజపల్లి శివరాం ప్రసాద్ పాత మల్లయ్యపాలెం సొసైటీ అధ్యక్షుడు కుర్రి సుబ్బారెడ్డి.

తెలుగు యువత చిన్నం శ్రీకాంత్ కాకాని సురేష్ పామిడి అంజయ్య తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు గోరిజవోలు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU