Guntur: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేయాలి: నాగరాజు

Guntur: విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను సంస్థలో విలీనం చేసి రూ.48 వేల కనీస వేతనం ఇవ్వాలని యునైటెడ్ యూనియన్ నేత నాగరాజు డిమాండ్ చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 19 Sept 2026 6:27 PM IST
Guntur
X

Guntur: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేయాలి: నాగరాజు

Guntur: విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు.

శనివారం గుంటూరు బ్రాడీపేటలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను సంస్థలో విలీనం చేసి రూ.48 వేల రూపాయలు వేతనం ఇవ్వాలన్నారు.

సమస్యల పరిష్కారానికై 21 న విజయవాడ నుండి తిరుపతి వరకు బైక్ జాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. సమస్యలు పరిష్కారం కానిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN