Nalgonda: మిర్యాలగూడ నందిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!
Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ నందిపాడు వద్ద లారీ బీభత్సం. అంబులెన్స్, 5 కార్లను ఢీకొట్టిన లారీ. పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావు మృతి, పలువురికి గాయాలు.
Nalgonda: మిర్యాలగూడ నందిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!
Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ నందిపాడు కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అంబులెన్స్లోకి ఎక్కిస్తుండగా, వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఐదు కార్లు, అంబులెన్స్ను తీవ్రంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పొన్నూరుకు చెందిన పోలినేని శ్రీనివాసరావు(36) అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన అంబులెన్స్ సిబ్బందిని హైదరాబాద్కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.




