Khanapur: ఖానాపూర్‌లో వినాయక నిమజ్జన పాయింట్‌ను పరిశీలించిన అధికారులు!

Khanapur: ఖానాపూర్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, సీఐ. గంగ తీరాన భద్రత, ప్రత్యేక విద్యుత్ దీపాల ఏర్పాటుకు ఆదేశాలు.

RAKESH N, KHANAPUR
Published on: 17 Sept 2026 7:19 PM IST
Khanapur
X

Khanapur: ఖానాపూర్‌లో వినాయక నిమజ్జన పాయింట్‌ను పరిశీలించిన అధికారులు!

ఖానాపూర్‌: ఖానాపూర్‌లో వినాయక నిమజ్జన వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్‌, సీఐ కలిసి స్థానిక గంగ (నది) నిమజ్జన పాయింట్‌ను స్వయంగా సందర్శించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గంగ తీరాన చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు మరియు విద్యుత్ దీపాల (లైటింగ్) పనులపై అధికారులు క్షేత్రస్థాయిలో చర్చించారు.

రాత్రి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జన ప్రాంతమంతా కాంతులీనేలా ప్రత్యేక లైటింగ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR