Mancherial: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు: కలెక్టర్

Mancherial: మంచిర్యాల జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 18 Sept 2026 7:24 PM IST
Mancherial
X

Mancherial: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు: కలెక్టర్

మంచిర్యాల: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.

నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములుతో కలిసి పౌరసరఫరాలు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, సహకార, కార్మిక శాఖల అధికారులు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్నీ సంచులు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు, హమాలీలు, రవాణా, ఇతర మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. ధాన్యం నాణ్యత, తేమ శాతం, ప్రభుత్వ నిబంధనలపై రైతులకు ముందుగానే అవగాహన కల్పించాలని తెలిపారు.

కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేసి, రైతులకు చెల్లింపులు నిర్ణీత సమయంలో జరిగేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ, నిల్వలు, మిల్లులకు తరలింపు ప్రక్రియను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లో లోడింగ్, అన్‌లోడింగ్, బస్తాల తరలింపునకు అవసరమైన హమాలీలు, కార్మికుల లభ్యతను కార్మిక శాఖ నిర్ధారించాలని తెలిపారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. બેઠકలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.