Hyderabad: కుషాయి గూడలో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం

Hyderabad: కట్టెల మండీలో చెలరేగిన మంటలు

Dhatripriya
Updated on: 16 April 2023 7:23 AM IST
Three People Died In Fire Accident At Kushaiguda In Hyderabad
X

Hyderabad: కుషాయి గూడలో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం

Hyderabad: కుషాయిగూడ అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. కట్టెల మండీలో చెలరేగిన మంటలతో కలపపూర్తిగా దహనమైంది. కట్టెలమండీ పక్కనే ఉన్న ఇంట్లోకి మంటలు వ్యాపించడంతో ముగ్గురు కాలిపోయారు. ముగ్గరూ వరంగల్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. కట్టెల మండీలోని కలప సామగ్రి కాలిపోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను అర్పేప్రయత్నంచేశారు. మృతులు నరేష్, సుమ, బాబు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు.

Dhatripriya

Dhatripriya

Next Story