ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం: కేటీఆర్

Arun Chilukuri
Updated on: 31 Aug 2020 6:48 PM IST
ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం: కేటీఆర్
X

Basti Dawakhanas: హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానాలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బస్తీ దవాఖానాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ పరిధిలోని 197 బస్తీ దవాఖానాలు, ఇతర నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతీ రోజు 5000 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు కేటీఆర్.

ఇక, ప్రతీ రోజు 53 రకాల పాథాలజీ, మైక్రోబయాలకీ, బయో కెమిస్ర్టీ వంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలందడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. బస్తీ దవాఖానాల ద్వారా ప్రతిరోజు 25 వేల మందికి ఓపీ సేవలు అందుతున్నాయని, బస్తీ దవాఖానాలకు పేదల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మరో వంద బస్తీ దవాఖానాల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story