మాజీ ఎమెల్సీ జగదీశ్వర్‌రెడ్డి మృతి

Arun Chilukuri
Published on: 5 Sept 2020 12:50 PM IST
మాజీ ఎమెల్సీ జగదీశ్వర్‌రెడ్డి మృతి
X

Jagadeeswar Reddy: శాసనమండలి మాజీ సభ్యుడు, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత సుంకిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి (72) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. కాగా జగదీశ్వర్ రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో జగదీశ్వర్‌రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున్‌ లకు అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యమ సమయంలో జైలుకు కూడా వెళ్లారు. వివాద రహితుడిగా పేరున్న జగదీశ్వర్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. మరోవైపు ఆయన మృతిప‌ట్ల ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆకాంక్షిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story