మాదాపూర్‌లో బీభత్సం సృష్టించిన కారు

మాదాపూర్‌లో బీభత్సం సృష్టించిన కారు
x
Highlights

హైదరాబాద్లోని మాదాపూర్‌లో అత్యంత ఖరీదైన ఓ కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. అతి వేగంగా ప్రయాణిస్తున్న పెర్రారీ కారు ఒక్కసారిగా బీభత్సం రేపింది....

హైదరాబాద్లోని మాదాపూర్‌లో అత్యంత ఖరీదైన ఓ కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. అతి వేగంగా ప్రయాణిస్తున్న పెర్రారీ కారు ఒక్కసారిగా బీభత్సం రేపింది. జూబ్లీహిల్స్‌ నుంచి అతి వేగంగా వస్తున్న కారు మాదాపుర్‌ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి పుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఫుట్‌పాత్‌పై నడుసున్న ఇద్దరు వ్యక్తులను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. చనిపోయిన వ్యక్తిని వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న యేసుబాబుగా గుర్తించారు. ఆయన ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్ మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా. సమాచారం అందుకున్న పోలీసులు కారు వేగంగా నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారు వేగంగా నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఈ ప్రమాదం తరువాత మాదాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుడు యేసుబాబు బంధువులు ఆటోలో తరలిస్తున్న మృతదేహాన్ని అడ్డుకున్నారు. యేసుబాబు మృతికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.


Show Full Article
Print Article
Next Story
More Stories