పంత్.. ఏమిటిది? టీమిండియా కీపర్ పై అభిమానుల ఆగ్రహం

పంత్.. ఏమిటిది? టీమిండియా కీపర్ పై అభిమానుల ఆగ్రహం
x
Highlights

మహేంద్ర సింగ్ ధోనీ.. భారత వికెట్ కీపర్ గా.. కెప్టెన్ గా తన ముద్రను చెరపడానికి వీలు లేకుండా వేసిన ఆటగాడు. వరల్డ్ కప్ తరువాత అతను రిటైర్ అయిపోతే మంచిదని...

మహేంద్ర సింగ్ ధోనీ.. భారత వికెట్ కీపర్ గా.. కెప్టెన్ గా తన ముద్రను చెరపడానికి వీలు లేకుండా వేసిన ఆటగాడు. వరల్డ్ కప్ తరువాత అతను రిటైర్ అయిపోతే మంచిదని చాలా మంది క్రికెట్ దిగ్గజాలు పోరు పెట్టారు. కానీ, తన మనసులో ఏముందో చెప్పని ధోనీ.. వెస్టిండీస్ పర్యటనకు జట్టు ఎంపిక సమయంలో కొంతకాలం పాటు ఆర్మీలో పనిచేయాలనుందంటూ తన రిటైర్మెంట్ వార్తలకు తానే చెక్ పెట్టాడు.

ఇదిలా వుంటే.. టీమిండియా లో ధోనీ స్థానంలో ఆడదగ్గ వారెవరన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకటం లేదు. రిషబ్ పంత్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడంటూ విండీస్ టూర్ కి సెలక్ట్ చేశారు. కానీ, విండీస్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో కీపింగ్ లో ఫర్వాలేదనిపించిన పంత్.. బ్యాటింగ్ లో మాత్రం మొదటి బంతికే చేతులెత్తేశాడు. దీంతో అభిమానులు పంత్ ను నేట్టింట్లో ఓ ఆట ఆడుకుంటున్నారు. విపరీతంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క అవుట్ చాలు ధోనీ ఇంకా ఎందుకు టీమిండియా లో ఉండాలని కోరుకుంటున్నామో చెప్పడానికి అంటూ ధోనీని రిటైర్ కావాలంటూ గోల చేసిన వారికి పంచ్ లు వేస్తున్నారు. మొత్తమ్మీద పంత్ ఐపీఎల్ లో ఆడటానికి మాత్రమె సరిపోతాదంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

వాటిలో కొన్ని మీరూ చూడండి..







Show Full Article
Print Article
More On
Next Story
More Stories