విండీస్ వైట్ వాష్! భారత్ విజయ యాత్ర!!

విండీస్ వైట్ వాష్! భారత్ విజయ యాత్ర!!
x
Highlights

భారత జట్టు వెస్టిండీస్ పర్యటనను పరిపూర్ణం చేసింది. టీ20 సిరీస్, వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్ అన్ని ఫార్మేట్లలోనూ విండీస్ ను పూర్తిగా చిత్తు చేసింది. సిరీస్ మొత్తం మీద ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా జైత్రయాత్ర సాగించింది టీమిండియా.

సుదీర్ఘ విండీస్ పర్యటనను విజయం తో ముగించింది భారత జట్టు. టీ20 సిరీస్, వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్ అన్నిటినీ క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. తన నెల రోజుల పర్యటనలో ఒక్క మ్యాచ్ కూడా గెలిచే అవకాశం ప్రత్యర్థికి ఇవ్వలేదు సరికదా.. టెస్టు లలో భారీ విజయాలు నమోదు చేసింది.

చివరి టెస్ట్ లో భారీ విజయం..

జమైకాలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ ను నాలుగు రోజుల్లోనే ముగించేసింది టీమిండియా. నాలుగోరోజైన సోమవారం 468 పరుగుల విజయలక్ష్యాన్ని చేదించేందుకు ప్రయత్నిస్తున్న విండీస్ ను 210 పరుగులకే కుప్పకూల్చి విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది భారత జట్టు. దీంతో 257 పరుగుల తేడాతో ఘన విజయం టీమిండియా సొంతం అయింది.

మ్యాచ్ సాగిందిలా..

రెండో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం ప్రారంభం అయింది. టాస్ గెలిచిన విండీస్ భారత్ బ్యాటింగ్ అప్పచెప్పింది. మొదటి ఇన్నింగ్స్లో భారత్ జట్టు 416 పరుగులకి ఆలౌటైంది. జట్టులో హనుమ విహారి (111: 225 బంతుల్లో 16x4) శతకం సాధించగా.. మయాంక్ అగర్వాల్ (55), విరాట్ కోహ్లి (76), ఇషాంత్ శర్మ (57) హాఫ్ సెంచరీలు సాధించారు.

బుమ్రా (6/27) బౌలింగ్ మాయతో వెస్టిండీస్ జట్టు.. ఫాస్ట్ బౌలర్ 117 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో సిమ్రాన్ హెట్‌మెయర్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బుమ్రా తన టెస్టు కెరీర్‌లో తొలిసారి హ్యాట్రిక్ వికెట్లు నమోదు చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ని 168/4 వద్ద ఆదివారం డిక్లేర్ చేసింది. అజింక్య రహానె (64 నాటౌట్: 109 బంతుల్లో 8x4, 1x6), హనుమ విహారి (53 నాటౌట్: 76 బంతుల్లో 8x4) అజేయ హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో.. వెస్టిండీస్ ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిలిపింది.

486 పరుగుల భారీ లక్ష్యఛేదనలో విండీస్ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. భారత బౌలర్లు రవీంద్ర జడేజా (3/58), మహ్మద్ షమీ (3/65), ఇషాంత్ శర్మ (2/37) దెబ్బకి వరుసగా వికెట్లు చేజార్చుకున్న విండీస్ టీమ్.. కేవలం 59.5 ఓవర్లలోనే 210 పరుగులకి ఆలౌటైంది. జట్టులో కెప్టెన్ జేసన్ హోల్డర్ (39: 35 బంతుల్లో 9x4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగుల, రెండో ఇన్నింగ్స్‌లో 53 (నాటౌట్) రన్స్ చేసిన హనుమ విహారికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories