Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 23 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి: రా.1-49 తదుపరి అష్టమి | జ్యేష్ఠ నక్షత్రం రా.12-29 తదుపరి మూల | వర్జ్యం: ఉ.7-00 నుంచి 8-31 వరకు | అమృత ఘడియలు: సా.4-07 నుంచి 5-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-29 నుంచి 12-17 వరకు | రాహుకాలం: ఉ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-55

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Vijayawada updates: ప్రజలదృష్టి మళ్లించడానికే వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు: నక్కా ఆనందబాబు..
    23 Sep 2020 6:38 AM GMT

    Vijayawada updates: ప్రజలదృష్టి మళ్లించడానికే వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు: నక్కా ఆనందబాబు..

    విజయవాడ..

    నక్కా ఆనందబాబు మాజీ మంత్రి...

    -16 నెలల నుంచీ నిరాధార ఆరోపణలు తప్ప, వైసీపీప్రభుత్వం టీడీపీపై వేసిన నిందలను నిరూపించలేకపోయింది.

    -ఇన్ సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్, క్విడ్ ప్రోకో వంటి పదాలు ఉమ్మడి రాష్ట్రానికి పరిచయం చేసిందే జగన్, విజయసాయి రెడ్డి.

    -కేంద్రం అడక్కుండానే అన్ని బిల్లులకు వైసీపీఎంపీలు గుడ్డిగా మద్థతు ఇస్తున్నారు.

    -ఆఖరికి కేంద్రం ఇచ్చే అప్పుకోసం, రైతుల మోటార్లకు మీటర్లు బిగించడానికి కూడా సిద్ధమయ్యారు.

    -ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో అమలైనప్పుడు లోకేశ్ మంత్రిగానే లేడు.

    -ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.700కోట్లయితే, రూ.2వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది..?

    -అవినీతిపరుల కేసుల విచారణను సుప్రీం వేగవంతం చేస్తుండటంతో, జగన్ ఆయన బృందానికి వణుకు మొదలైంది.

  • 23 Sep 2020 6:35 AM GMT

    Andhra Pradesh updates: ఇందిరా భవన్ లో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం..

    ఆంధ్ర ప్రదేశ్..

    -కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజనాథ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీ ఇంచార్జ్ ఉమెన్ చాందీ,మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కనుమూరి బాపిరాజు,   తులసి రెడ్డి ,పల్లం రాజు ముఖ్యమైన నాయకులు హాజరయ్యారు.

    -ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ..

  • Rajahmundry updates: అభివృద్ధికి జగన్ ప్రభుత్వం ఆమడ దూరంలో ఉంది: గోరంట్ల బుచ్చియ్యచౌదరి..
    23 Sep 2020 6:31 AM GMT

    Rajahmundry updates: అభివృద్ధికి జగన్ ప్రభుత్వం ఆమడ దూరంలో ఉంది: గోరంట్ల బుచ్చియ్యచౌదరి..

    తూర్పుగోదావరి-రాజమండ్రి..

    గోరంట్ల బుచ్చియ్యచౌదరి కామెంట్స్..

    -అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు

    -రోడ్లు ధ్వంసమైతే కనీస మరమ్మతులు లేవు

    -ప్రభుత్వ దోపిడీపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి..

    -ఇళ్ళ పాత బకాయిలు వెంటనే చెల్లించాలి, టిట్ కో హౌస్ లుగా కేటాయించిన ఇళ్లను పేదలకు ఇవ్వాలి లేని పక్షం లో ఉద్యమిస్తాం...

    -న్యాయ వ్యవస్థపై కూడా ఈ ప్రభుత్వం లో ఉన్న వారు దాడి చేస్తున్నారు

    -బూతుల మంత్రులు, బూతుల స్పీకర్లు ఉండటం ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం ....

    -అమరవతిపై, హిందు దేవతలపై బూతులు మాట్లాడ్తున్న కొడాలి నాని లాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారు...

    -హిందు దేవాలయాలపై జరుగుతున్న దాడులలో కనీసం ఒక్కరినైన అరెస్ట్ చేశారా

    -అసెంబ్లీ లో ఐదుగురం వున్నా ప్రభుత్వాన్ని నిలదీస్తాం

    -ఏ మతసంస్థల మీద దాడులు జరిగినా తప్పే... ఆలయాలు మీద, మాత సంస్థలు మీద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

  • 23 Sep 2020 6:25 AM GMT

    Visakha updates: మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు దుర్మార్గం: వెలగపూడి రామకృష్ణబాబు..

    విశాఖ..

    -టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కామెంట్స్..

    -రాష్ట్రంలో హిందూ దేవాలయాలు పై వరుస దాడులను నిరసిస్తూ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి అద్వర్యంలో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద   నిరసన.

    -హిందు దేవాలయాలపై దాడులకు వ్యతిరేకంగా కొబ్బరికాయలు కొట్టి ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు పంపిన టీడీపీ నాయకులు.

    -వందరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.

    -జగన్ మోహన్ రెడ్డికి,మంత్రి కొడాల నానికి బుధ్ధి మారాలని ఆంజనేయస్వామిని ప్రార్థించాము.

    -రాష్ట్రంలో మూడు మతాల వారు భయబ్రాంతులకు గూరౌతున్నారు.

    -జగన్ మోహన్ రెడ్డి అనుమతి లేకుండా మంత్రి కొడాలి అలా మాట్లాడుతారా?

    -కొడాలి నానా తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

    -తిరుపతి వెలుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి హిందువుల మనోభావాలు కాపాడాలి.

  • Vijayawada updates: జర్నలిస్టులకు మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ: దేవిరెడ్డి శ్రీనాధ్..
    23 Sep 2020 6:21 AM GMT

    Vijayawada updates: జర్నలిస్టులకు మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ: దేవిరెడ్డి శ్రీనాధ్..

    విజయవాడ..

    -ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్..

    -గ్రామీణ జర్నలిస్టులకు, డెస్కులలో పనిచేసే వారికి శిక్షణ

    -సమగ్ర సమాచారంతో అకాడమీ వెబ్ సైట్ ఉంటుంది

    -జర్నలిస్టులకు కోవిడ్ రిలీఫ్ కు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

    -26వ తేదీ నుంచీ విశాఖ నుంచీ శిక్షణ ప్రారంభం అవుతుంది

    -ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను సంపూర్ణ జర్నలిస్టులుగా తీర్చి దిద్దుతాం

    -ఏ ఏ జిల్లాలలో శిక్షణ ఎప్పుడు అనే వివరాలు త్వరలో ఇస్తాం

    -జృనలిస్టుల‌ సంక్షేమం ప్రెస్ అకాడమీ విస్మరించదు

    -అన్ని యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాం

    -నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీతో మొదటి ఒప్పందం..

  • Amaravati updates: కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం..
    23 Sep 2020 6:17 AM GMT

    Amaravati updates: కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం..

    జాతీయం..

    -సీఎం వెంట వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి

    -పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని వినతి

    -పోలవరం ప్రాజెక్టును గడువులోపల పూర్తి చేసేందుకు సహకరించాలని వినతి

    -2021 చివరి నాటి కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం వైఎస్ జగన్

    -రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు అందించాలన్న సీఎం

    -పోలవరం పర్యటనకు రావాలని జలశక్తి మంత్రి కోరిన ముఖ్యమంత్రి

    -త్వరలోనే పోలవరం పర్యటన కు వస్తానన్న జలశక్తీ మంత్రి

    -గోదావరి - కావేరి నదుల అనుసంధానంపైనా చర్చ

    -నదుల అనుసంధానం అంశంపై రాష్ట్ర పర్యటన కు వెళ్లాలని టాస్క్ ఫోర్స్ చైర్మన్ వేదిరే శ్రీరామ్ కు సూచించిన కేంద్ర మంత్రి

  • 23 Sep 2020 6:14 AM GMT

    Tirumala updates: జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే శ్రీవారిని దర్శించుకోవాలి... బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి

    తిరుపతి...

    -బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి..

    -హౌస్ అరెస్టులో ఉన్న నేతలు ఇళ్ళలోనే నిరసన..

    -కొడాలి నానిని బర్తరఫ్ చేసిన తరువాతే తిరుపతికి రావాలి..

  • National updates: అధికారుల నిర్లక్ష్యం....అర్థరాత్రి ఢిల్లీలో మకాం మార్చిన సీఎం జగన్..
    23 Sep 2020 6:03 AM GMT

    National updates: అధికారుల నిర్లక్ష్యం....అర్థరాత్రి ఢిల్లీలో మకాం మార్చిన సీఎం జగన్..

    జాతీయం..

    -అధికార నివాసం 1 జన్‌పథ్ నుంచి ఏపీ భవన్ సీఎం కాటేజికి మకాం మార్పు

    -1 జన్‌పథ్‌లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కారణంగా అసౌకర్యం

    -అందుకే సీఎం కాటేజికి మార్చిన అధికారులు..

  • Amaravati updates: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ముగిసిన జగన్ సమావేశం..
    23 Sep 2020 5:57 AM GMT

    Amaravati updates: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ముగిసిన జగన్ సమావేశం..

    అమరావతి..

    -40 నిమిషాల పాటు సాగిన భేటీ..

    -రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై హోంమంత్రితో చర్చించిన ఏపీ సీఎం..

  • Tirumala updates: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ వెల్ఫేర్ మంత్రి  వేణుగోపాల కృష్ణ..
    23 Sep 2020 5:54 AM GMT

    Tirumala updates: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ వెల్ఫేర్ మంత్రి వేణుగోపాల కృష్ణ..

    తిరుమల..

    రాజకీయ లబ్ది కోసం అనవసర విషయాన్ని వివాదాన్ని రేపి మతానికి రాజకీయరంగు పులుముతున్నారు

    ముడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం ప్రయత్నిస్తుంటే..దాన్ని కోర్టుల ద్వారా చంద్రబాబు అడ్డుకోవాలని చూస్తున్నారు

    ఈ వివాదాలన్నీ తాత్కాలికమే

    స్వామివారి మీద అచంచలమైన భక్తి ఉండడం వల్ల పాదయాత్ర కు ముందు,తరువాత కాలినడకన తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు

Print Article
Next Story
More Stories