Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 23 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి: రా.1-49 తదుపరి అష్టమి | జ్యేష్ఠ నక్షత్రం రా.12-29 తదుపరి మూల | వర్జ్యం: ఉ.7-00 నుంచి 8-31 వరకు | అమృత ఘడియలు: సా.4-07 నుంచి 5-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-29 నుంచి 12-17 వరకు | రాహుకాలం: ఉ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-55
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Sep 2020 8:30 AM GMT
Vijayawada updates: గుడివాడ విశ్వ భారతి ప్రైవేట్ పాఠశాల వద్ద, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన..
కృష్ణాజిల్లా..
-ఆన్లైన్ పాఠాలకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణతో తల్లిదండ్రుల ధర్నా.
-ఆన్లైన్ క్లాసులకు ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులను, పాఠశాల నుండి తొలగిస్తున్నారని తల్లిదండ్రుల ఆరోపణ.
- 23 Sep 2020 8:26 AM GMT
Rajahmundry updates: కేంద్రప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకవిధానాలను నిరసిస్తూ కోటగుమ్మం సెంటర్లో ధర్నా..
తూర్పుగోదావరి..రాజమండ్రి-
-- ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు నల్లా రామావు..
-కేంద్రప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకవిధానాలను నిరసిస్తూ అఖిలపక్షం కార్మిక సంఘాల
-ఆధ్వర్యంలో రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ధర్నా
-దేశవ్యాప్త పిలుపులో భాగం గా కార్మికసంఘాలు నిరసన
-42 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేవిధంగా ప్రధాని మోఢీ చట్టాలలో మార్పులు తెచ్చారని కార్మికులు నినాదాలు
-కార్మికులందరికీ ద్రోహం చేసే విధంగా కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసేలా కార్మిక చట్టాలలో మార్పులు తెచ్చారంటూ కార్మికులు నిరసన
- 23 Sep 2020 8:21 AM GMT
Paripoornananda Swami Comments: నాని వెంకటేశ్వర స్వామితో ఢీకొంటున్నాడు: పరిపూర్ణానంద స్వామి..
పరిపూర్ణానంద స్వామి @ సోమాజిగూడ ప్రెస్ క్లబ్
-కేబినెట్ లో ఉన్న వ్యక్తి నాని
-రాజ్యాంగం తెలియకుండా ఎమ్మెల్యే అయ్యాడు
-రాజ్యాంగంలోని అధికరణ ప్రకారం ఎవరైనా నమ్మిన మతంపై వక్రభాష్యం చెప్తే శిక్ష పడాల్సిందే
-ఆంజనేయస్వామి వేంకటేశ్వరుడు హిందువుల సొత్తు
-నాని..ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
-హిందువులు ఓట్లేస్తేనే ఇన్ని స్థానాలు జగన్ గెలిచారు
-బ్రిటీషర్లు 42 పాయింట్స్ తో డిక్లరేషన్ ఏర్పాటు చేశారు
-హిందువులు కాని వారు దేవుడిని దర్శించుకోవాలంటే సంతకం పెట్టాలనేది డిక్లరేషన్లో ముఖ్యమైనది
-నాని నీ స్థాయి ఆంజనేయస్వామి.. వెంకటేశ్వర స్వామి స్థాయా?
-తిరుమలకొండ తో పెట్టుకున్న వారి సంగతి ఏమైందో అందరికి తెలుసు
-నాని..నీకు అహంకారం వద్దు..నాని..దేవుళ్ళ జోలికి వెళ్లకు.
-జయలలిత ఇందిరా గాంధీ లాంటి వాళ్ళు ఎలా చనిపోయ్యారో అందరికి తెలుసు
-మసీదు చర్చిలకు ఉన్న స్వయం ప్రతిపత్తి దేవాలయాలకు ఎందుకు ఇవ్వరు
-సిగ్గు లజ్జ ఉంటే ప్రభుత్వాలు దేవాలయాలను ఇచ్చెయ్యాలి
-జగన్ క్రైస్తవుడే అయినా..డిక్లరేషన్ ఇవ్వాల్సిందే
-అబ్దులు కలాం ను ఆదర్శంగా తీసుకుని జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి.
-జగన్ హిందువును అని..క్రైస్తవుడిని అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..
- 23 Sep 2020 8:13 AM GMT
Andhra Pradesh High Court: గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై జవాబు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
అమరావతి..
-గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని దాఖలైన పిటీషన్ విచారించిన హైకోర్టు
-పరిహారం చెల్లించకుండానే నిర్వాసితుల భూములు స్వాధీనం చేసుకున్నారని పిటిషన్ దాఖలు
-పరిహారం చెల్లించామని కోర్టుకు తెలిపిన ప్రభుత్వ తరపు న్యాయవాది
-తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు
- 23 Sep 2020 8:08 AM GMT
Visakha updates: రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల తిరుపతికి వెళ్లి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ: వంగలపూడి అనిత..
విశాఖ..
తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కామెంట్స్
-ఆ పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్లే సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి.
-టిటిడి ఆచారం ప్రకారం డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి అనే పద్ధతి 1860 నుంచి ఉంది .
-2009లో ఎం పి గా ఉన్న జగన్ తిరుమల తిరుపతి కి డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి?
-మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు దారుణం, టిటిడి డిక్లరేషన్ పై అసెంబ్లీ లో చర్చిస్తాం అని అనడం ఘోరం.
-అంతర్వేదిలో రథానికి ఇన్సూరెన్స్ ఉందా? లేదా? అని అడుగుతున్నారు అధికార పార్టీ ఎమ్యెల్యే.
-మంత్రి జయరాం బెంజి కార్ వ్యవహారం పక్కకు వెళ్ళడానికి మంత్రులు విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు.
-హిందువునైనా నన్ను కూడా హిందువు అని చూపించుకునే పరిస్థితి తెచ్చారు.
-టిటిడి సభ్యురాలిగా నేనే స్వయంగా రాజీనామా చేసాను .
-హిందు ధర్మాలు పై గౌరవం లేని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు తన పేరు మార్చుకోవాలి.
- 23 Sep 2020 7:19 AM GMT
Amaravati updates: గుంటూరు లో గుర్రం జాషువా కళాప్రాంగణం నిర్మాణం పై సమీక్షిస్తున్న విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్...
అమరావతి..
-సచివాలయం లోని మంత్రి ఛాంబర్ లో జరుగుతున్న సమీక్ష.
-హాజరైన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మిపార్వతి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, అధికారులు.
-28న గుర్రం జాషువా జయంతి రోజు ఏర్పాట్లు పై సమీక్ష.
- 23 Sep 2020 7:18 AM GMT
Visakha updates: వైసిపి ప్రభుత్వం లో చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు: వాసు పల్లి గణేష్ కుమార్..
విశాఖ..
-ఎమ్మెల్యే వాసు పల్లి గణేష్ కుమార్ కామెంట్స్
-మా ప్రభుత్వం లో చేయాలని అనుకున్న పథకాలన్ని కిందిస్ధాయి వరకు వైసిపి ప్రభుత్వం లో అందుతున్నాయి
-పేదల అదృష్టం వల్లనే వైసిపి ప్రభుత్వం వచ్చింది
-ప్రతిపక్ష పార్టీ సమర్ధవంతంగా పని చేయటం లేదు
-వైఎస్ జగన్ ప్రతిపక్షానికి పని లేకుండా చేశారు
-సాంకేతిక పరంగా వైసిపి కండువా వేసుకోలేను మా కుమారుడు పార్టిలో చేరాడు
- 23 Sep 2020 7:07 AM GMT
Kurnool District updates: పత్తికొండలో కాంగ్రెస్ ఇంచార్జ్ క్రాంతినాయుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు..
కర్నూల్ జిల్లా..
-అధికార పార్టీ నాయకుల అవినీతి పై ఫేస్ బుక్ లో లో లైవ్ పెట్టిన క్రాంతి నాయుడు
-క్రాంతి నాయుడు ని ఇంటి వద్ద వెళ్లి బెదిరించిన అధికార పార్టీ కార్యకర్తలు
-దాడికి నిరసనగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపిన క్రాంతి నాయుడు
-కర్నూల్ జిల్లా పత్తికొండలో కాంగ్రెస్ ఇంచార్జ్ క్రాంతినాయుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు.
-అధికారపార్టీ నాయకుల అవినీతిని బట్టబయలు చేస్తే ఇంటిమీద దాడికి పాల్పడుతారా....క్రాంతి నాయుడు.
-దాడికి నిరసనగా పత్తికొండ సెంటర్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన ..
-అరెస్ట్ చేసిన పత్తికొండ పోలీసులు...నా పైన దాడికి పాల్పడిన వ్యక్తులను వదిలి ..నన్ను అరెస్ట్ చేయటం ఎంత వరకు సబబు ..
-క్రాంతి నాయుడుని అరెస్ట్ చేసి పత్తికొండ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీస్ లు..
- 23 Sep 2020 7:04 AM GMT
Visakha updates: రావికమతం మండలం గుమ్మల్ల పాడు గ్రామంలో దారుణం..
విశాఖ..
-దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన గ్రామస్థులు..
-దళితుల అమ్మాయి అగ్రవర్ణాల అబ్బాయిని పెళ్ళి చేసుకోవడం తో సహించలేని అగ్రవర్ణాలు
-కిరాణా గానీ పాలుగాని ఎవరైనా దళితుల అమ్మిన మాట్లాడిన ఐదు వేల రూపాయలు జరిమానా విధించిన గ్రామ పెద్దలు
-అగ్రకులాలు పెద్దలపై కేసు పెట్టిన దళిత కుటుంబాలు
- 23 Sep 2020 6:43 AM GMT
Visakha updates: కూర్మన్నపాలేం బస్టాప్ వద్ద అర్దరాత్రి ఆటోలో బలవంతంగా ఇద్దరు అమ్మాయిలను ఆటోలో ఎక్కించిన ముగ్గురు వ్యక్తులు..
విశాఖ..
-మార్గమద్యలో ఇద్దరు అమ్మాయిలు ఆటో నుండి దూకేయటంతో స్వల్ప గాయాలు
-గాజువాక నైట్ బిట్ కు దొరిన ఆటో ముగ్గురు వ్యక్తులు
-గాజువాక పోలీస్టేషనుకు తరిలింపు..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire