Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 23 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి: రా.1-49 తదుపరి అష్టమి | జ్యేష్ఠ నక్షత్రం రా.12-29 తదుపరి మూల | వర్జ్యం: ఉ.7-00 నుంచి 8-31 వరకు | అమృత ఘడియలు: సా.4-07 నుంచి 5-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-29 నుంచి 12-17 వరకు | రాహుకాలం: ఉ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-55

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 23 Sep 2020 10:07 AM GMT

    West Godavari updates: ఇసుక అక్రమ రవాణా కేసులో సీఐ నాయక్, ఎస్సై గంగాధర్ సస్పెండ్..

    పశ్చిమ గోదావరి..

    ▪️ఇసుక అక్రమ రవాణా కేసు విషయంలో అవినీతికి పాల్పడిన సీఐ నాయక్,ఎస్సై గంగాధర్ పై వేటు పడింది.

    ▪️ఇటీవల జంగారెడ్డిగూడెంలో విచారణ చేస్తున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను అడ్డుకున్నందుకు, స్టేషన్ లో కంప్యూటర్ డేటాను తొలగించిన విషయంలో ఉన్నతాధికారులు దృష్టి

    ▪️ఈ నేపథ్యంలోనే జంగారెడ్డిగూడెం సీఐ బి. నాగేశ్వర్ నాయక్, ఎస్.ఐ ఎస్.ఎస్.ఆర్ గంగాధర్ ను ఏలూరు రేంజ్ డి. ఐ.జి శ్రీ కె.వి.మోహన్ రావు సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు.

  • 23 Sep 2020 9:58 AM GMT

    Seshachalam forest: శేషాచలం అడవులలో వన్యప్రాణుల ను వేటాడుతున్న ఇద్దరి అరెస్ట్..

    శేషాచలం అడవులు..

    -నాటు తుపాకీ స్వాధీనం

    -ఎర్ర చందనం స్మగ్లర్లు కోసం కూంబింగ్ చేస్తున్న టాస్క్ ఫోర్స్ కు అడవి జంతువుల వేటగాళ్ళు

    -వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకుని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలింపు

  • 23 Sep 2020 9:47 AM GMT

    Oommen Chandy Comments: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోయిందనుకుంటా..ఉమెన్ చాంది..

    ఉమెన్ చాంది..ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్..

    -ప్రజా ప్రతినిధిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఉమెన్ చాంది ని సన్మానించిన ఏపీ కాంగ్రెస్ నేతలు..

    -కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లు కు వ్యతిరేకంగా ఏపీ లో నిరసన కార్యక్రమాలు చేపడతాం..

    -పార్లమెంట్ లో చర్చ లేకుండా... రాష్ర్టాల అభిప్రాయం తీసుకోకుండా.. రైతులకు నష్టం చేసే బిల్లు ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది...

    -ఏపీ కి ప్రత్యేక హోదా ను యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది..టెక్నకల్ గా అన్ని ప్రోసిడర్స్ పూర్తి చేసింది..

    -ఉత్తరాఖండ్ కు ఎలా అయితే ప్రత్యేక హోదా ఉందో అలాగే మాకు ఇవ్వమని కోరుతున్నాం..

    -ప్రభుత్వాలు మారినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మారవు...

    -ఏంధుకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి..

    -న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది.. ఆ వ్యవస్థ ను ఎవరు శాసించలేరు..

  • 23 Sep 2020 9:39 AM GMT

    Sailajanath Comments: బీజేపీ ,జనసేన ,వైసీపీ అన్ని కూడా ఓకేరకమైన పార్టీ లు..శైలజానాథ్..

    ఇందిరా భవన్..

    -ప్రజా ప్రతినిధిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఉమెన్ చాంది ని సన్మానించిన ఏపీ కాంగ్రెస్ నేతలు..

    శైలజానాథ్ ..ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు..

    - ఏపీ లో అనేక సమస్యల విషయం లో పార్టీ ఏలాంటి వైఖరి అవలంబించాలనే అంశంపై చర్చించాము..

    - దేవాలయాల జరుగుతున్న దాడుల విషయం ప్రధానంగా చర్చించాం..

    - ప్రశ్నించేవారి పై ఏపీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.

    - అన్ని విషయాలలో భాదితుల పక్షాన నిలబడాలని నిర్ణయించాం..

    - ఈ నెల 24 నుంచి నవంబర్ 6 వరకు రైతు ల పక్షాన పోరాడుతాం..

    - మూడు రాజధానులకు మేము వ్యతిరేకం..

    - అప్పుడు చంద్రబాబు ,ఇప్పుడు జగన్ రాజధాని విషయంలో ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకోకుండా పోవడం వల్లే ఈ సమస్యలు..

  • Vijayawada-Durgamma updates: రోజుకో మలుపు తిరుగుతున్న దుర్గగుడి వెండి సింహల మాయం ఎపిసోడ్..
    23 Sep 2020 9:32 AM GMT

    Vijayawada-Durgamma updates: రోజుకో మలుపు తిరుగుతున్న దుర్గగుడి వెండి సింహల మాయం ఎపిసోడ్..

    విజయవాడ..

    - జూన్ 27వరకు వెండి రథానికి ఉన్న వెండి సింహాలు

    - వెండి సింహల కేసు దర్యాప్తు వేగవంతం చేసిన 4 పోలీస్ బృందాలు

    - బీహార్ కి చెందిన కార్మికులపై అనుమానాలు

    - 25మంది పనిచేసిన బీహార్ కు చెందిన కార్మికులు. వారిలో 8మందిని గుర్తించి విచారించిన పోలీసులు

    - వెండి వ్యాపారులపై దృష్టి పెట్టిన పోలీస్ లు

  • Nellore updates: దమ్ము ధైర్యం, ఏమాత్రం నీతి , నిజాయితీలు, నైతిక విలువ ఉంటే ఈ ఎస్ ఐ పై ఏసీబీ దర్యాప్తు ఆదేశించాలి --టిడిపి నేత కోటంరెడ్డి సవాల్..
    23 Sep 2020 9:28 AM GMT

    Nellore updates: దమ్ము ధైర్యం, ఏమాత్రం నీతి , నిజాయితీలు, నైతిక విలువ ఉంటే ఈ ఎస్ ఐ పై ఏసీబీ దర్యాప్తు ఆదేశించాలి --టిడిపి నేత కోటంరెడ్డి సవాల్..

    నెల్లూరు..

    -రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈఎస్ఐ కుంభకోణం లో దోషులను తేల్చాలని నెల్లూరు ఏసీబీ డీఎస్పీ కార్యాలయంలో డి.ఎస్.పి దేవానంద్ శాంత్రో కి వినతిపత్రం     ఇచ్చి టిడిపి నేతలు

    -ఈఎస్ఐ కుంభకోణం లో మంత్రి జయరాం పీకల్లోతు ఇరుక్కున్నారు

    -ఆయన కుమారుడు ఈశ్వర్ బెంజ్ కారును బహుమతిగా తీసుకున్నట్లు బయటపడింది

    -ఈఎస్ఐ కుంభకోణం లో ఏ 14 గా కార్తీక్ నుంచి బెంజ్ కార్ తీసుకున్న ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు   చేస్తోంది

    -వైసీపీ ప్రభుత్వం అవినీతికి పెద్ద పీట వేస్తూ ప్రజల సొమ్మును కొల్లగొడుతోంది

    -టిడిపి నేత అచ్చం నాయుడు పై ఈఎస్ఐ కుంభకోణం లో అనవసరంగా ఇరికించి కేసులు నమోదు చేశా రు.

  • Guntur updates: తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి..యరపతినేని శ్రీనివాసరావు..
    23 Sep 2020 9:09 AM GMT

    Guntur updates: తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి..యరపతినేని శ్రీనివాసరావు..

    గుంటూరు ః

    టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు..

    -4 వేలకోట్ల కు ఆశపడి విద్యుత్ మీటర్ల తో రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారు.

    -రైతుల విషయం లో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

    -సంక్షేమ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు.

    -సొంత లిక్కర్ పాలసీ తెచ్చి పిచ్చి బ్రాండ్లను ప్రజలకు అంటగట్టారు.

    -సొంత మద్యం బ్రాండ్ లతో వేల కోట్లు దోచుకుంటున్నారు.

    -భవన నిర్మాణ కార్మికులు 400 కోట్లు ప్రభుత్వం వాడుకోవడం దుర్మార్గం.

    -ఏడాది కాలంలో లక్ష కోట్లు తెచ్చిన అప్పు ను ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి.

  • Sri Padmavathi Ammavaru: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న శ్రీనివాస వేణుగోపాల కృష్ణ..
    23 Sep 2020 9:04 AM GMT

    Sri Padmavathi Ammavaru: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న శ్రీనివాస వేణుగోపాల కృష్ణ..

    చిత్తూరు..

    - తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మాత్యులు చెల్లుబొయినా శ్రీనివాస వేణుగోపాల కృష్ణ

    - శ్రీవారి ఆశీస్సులతోనే సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సుభిక్ష పాలన అందిస్తున్నారు

    - మహిళలను ఆర్థికకంగా మరీంత బలోపేతం చేసేందుకు సంక్షేమ పథకాలు ఎంతో దోహదపడుతున్నాయి....

  • Vizianagaram updates: 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన గరుగుబిల్లి మండలం నాగూరు వీఆర్వో నాగేశ్వరరావు..
    23 Sep 2020 8:43 AM GMT

    Vizianagaram updates: 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన గరుగుబిల్లి మండలం నాగూరు వీఆర్వో నాగేశ్వరరావు..

    విజయనగరం..

    -నాగూరుకు చెందిన రైతు అప్పలనాయుడు నుంచి 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో

    -1.80సెంట్ల భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాల సబ్ డివిజన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన వీఆర్వో నాగేశ్వరరావు.

  • Anantapur updates: లౌకిక వాదాన్ని పాటిస్తున్న పార్టీ టీడీపీ: కాలవ శ్రీనివాసులు..
    23 Sep 2020 8:36 AM GMT

    Anantapur updates: లౌకిక వాదాన్ని పాటిస్తున్న పార్టీ టీడీపీ: కాలవ శ్రీనివాసులు..

    అనంతపురం:

    కాలవ శ్రీనివాసులు ప్రెస్మీట్.

    -రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

    -మెజారిటీ వర్గం మనోభావాలు దెబ్బతింటున్నాయి. హిందూ మతం, దేవలయాలపై దాడులు కొనసాగుతున్నాయి.

    -ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదానికి విరుద్ధంగా జరుగుతోంది.

    -ఇన్ని జరిగితే జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది చేయడం లేదు

    -కొడాలి నాని ఉన్మాదం తో అగ్నికి ఆజ్యం పోసినట్లు మాట్లాడుతున్నాడు. విజయసాయిరెడ్డి చంద్రబాబు ను తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై కేసు పెడతామంటారు.

    -టీటీడీ చైర్మన్ జగన్ బంధువు డిక్లరేషన్ అవసరం లేదు అంటాడు. నాని జగన్ మనసులో మాట చెప్పారు.

    -టీటీడీ ఈఓ కు డిక్లరేషన్ పై సంతకం చేయించుకోవాల్సిన బాధ్యత ను గుర్తు చేస్తూ లేఖ రాస్తున్నాం. చేయాల్సిన ధర్మం సీఎం పై ఉంది.

Print Article
Next Story
More Stories