Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 23 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి: రా.1-49 తదుపరి అష్టమి | జ్యేష్ఠ నక్షత్రం రా.12-29 తదుపరి మూల | వర్జ్యం: ఉ.7-00 నుంచి 8-31 వరకు | అమృత ఘడియలు: సా.4-07 నుంచి 5-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-29 నుంచి 12-17 వరకు | రాహుకాలం: ఉ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-55
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Sep 2020 10:07 AM GMT
West Godavari updates: ఇసుక అక్రమ రవాణా కేసులో సీఐ నాయక్, ఎస్సై గంగాధర్ సస్పెండ్..
పశ్చిమ గోదావరి..
▪️ఇసుక అక్రమ రవాణా కేసు విషయంలో అవినీతికి పాల్పడిన సీఐ నాయక్,ఎస్సై గంగాధర్ పై వేటు పడింది.
▪️ఇటీవల జంగారెడ్డిగూడెంలో విచారణ చేస్తున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను అడ్డుకున్నందుకు, స్టేషన్ లో కంప్యూటర్ డేటాను తొలగించిన విషయంలో ఉన్నతాధికారులు దృష్టి
▪️ఈ నేపథ్యంలోనే జంగారెడ్డిగూడెం సీఐ బి. నాగేశ్వర్ నాయక్, ఎస్.ఐ ఎస్.ఎస్.ఆర్ గంగాధర్ ను ఏలూరు రేంజ్ డి. ఐ.జి శ్రీ కె.వి.మోహన్ రావు సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు.
- 23 Sep 2020 9:58 AM GMT
Seshachalam forest: శేషాచలం అడవులలో వన్యప్రాణుల ను వేటాడుతున్న ఇద్దరి అరెస్ట్..
శేషాచలం అడవులు..
-నాటు తుపాకీ స్వాధీనం
-ఎర్ర చందనం స్మగ్లర్లు కోసం కూంబింగ్ చేస్తున్న టాస్క్ ఫోర్స్ కు అడవి జంతువుల వేటగాళ్ళు
-వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకుని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలింపు
- 23 Sep 2020 9:47 AM GMT
Oommen Chandy Comments: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోయిందనుకుంటా..ఉమెన్ చాంది..
ఉమెన్ చాంది..ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్..
-ప్రజా ప్రతినిధిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఉమెన్ చాంది ని సన్మానించిన ఏపీ కాంగ్రెస్ నేతలు..
-కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లు కు వ్యతిరేకంగా ఏపీ లో నిరసన కార్యక్రమాలు చేపడతాం..
-పార్లమెంట్ లో చర్చ లేకుండా... రాష్ర్టాల అభిప్రాయం తీసుకోకుండా.. రైతులకు నష్టం చేసే బిల్లు ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది...
-ఏపీ కి ప్రత్యేక హోదా ను యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది..టెక్నకల్ గా అన్ని ప్రోసిడర్స్ పూర్తి చేసింది..
-ఉత్తరాఖండ్ కు ఎలా అయితే ప్రత్యేక హోదా ఉందో అలాగే మాకు ఇవ్వమని కోరుతున్నాం..
-ప్రభుత్వాలు మారినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మారవు...
-ఏంధుకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి..
-న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది.. ఆ వ్యవస్థ ను ఎవరు శాసించలేరు..
- 23 Sep 2020 9:39 AM GMT
Sailajanath Comments: బీజేపీ ,జనసేన ,వైసీపీ అన్ని కూడా ఓకేరకమైన పార్టీ లు..శైలజానాథ్..
ఇందిరా భవన్..
-ప్రజా ప్రతినిధిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఉమెన్ చాంది ని సన్మానించిన ఏపీ కాంగ్రెస్ నేతలు..
శైలజానాథ్ ..ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు..
- ఏపీ లో అనేక సమస్యల విషయం లో పార్టీ ఏలాంటి వైఖరి అవలంబించాలనే అంశంపై చర్చించాము..
- దేవాలయాల జరుగుతున్న దాడుల విషయం ప్రధానంగా చర్చించాం..
- ప్రశ్నించేవారి పై ఏపీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.
- అన్ని విషయాలలో భాదితుల పక్షాన నిలబడాలని నిర్ణయించాం..
- ఈ నెల 24 నుంచి నవంబర్ 6 వరకు రైతు ల పక్షాన పోరాడుతాం..
- మూడు రాజధానులకు మేము వ్యతిరేకం..
- అప్పుడు చంద్రబాబు ,ఇప్పుడు జగన్ రాజధాని విషయంలో ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకోకుండా పోవడం వల్లే ఈ సమస్యలు..
- 23 Sep 2020 9:32 AM GMT
Vijayawada-Durgamma updates: రోజుకో మలుపు తిరుగుతున్న దుర్గగుడి వెండి సింహల మాయం ఎపిసోడ్..
విజయవాడ..
- జూన్ 27వరకు వెండి రథానికి ఉన్న వెండి సింహాలు
- వెండి సింహల కేసు దర్యాప్తు వేగవంతం చేసిన 4 పోలీస్ బృందాలు
- బీహార్ కి చెందిన కార్మికులపై అనుమానాలు
- 25మంది పనిచేసిన బీహార్ కు చెందిన కార్మికులు. వారిలో 8మందిని గుర్తించి విచారించిన పోలీసులు
- వెండి వ్యాపారులపై దృష్టి పెట్టిన పోలీస్ లు
- 23 Sep 2020 9:28 AM GMT
Nellore updates: దమ్ము ధైర్యం, ఏమాత్రం నీతి , నిజాయితీలు, నైతిక విలువ ఉంటే ఈ ఎస్ ఐ పై ఏసీబీ దర్యాప్తు ఆదేశించాలి --టిడిపి నేత కోటంరెడ్డి సవాల్..
నెల్లూరు..
-రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈఎస్ఐ కుంభకోణం లో దోషులను తేల్చాలని నెల్లూరు ఏసీబీ డీఎస్పీ కార్యాలయంలో డి.ఎస్.పి దేవానంద్ శాంత్రో కి వినతిపత్రం ఇచ్చి టిడిపి నేతలు
-ఈఎస్ఐ కుంభకోణం లో మంత్రి జయరాం పీకల్లోతు ఇరుక్కున్నారు
-ఆయన కుమారుడు ఈశ్వర్ బెంజ్ కారును బహుమతిగా తీసుకున్నట్లు బయటపడింది
-ఈఎస్ఐ కుంభకోణం లో ఏ 14 గా కార్తీక్ నుంచి బెంజ్ కార్ తీసుకున్న ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది
-వైసీపీ ప్రభుత్వం అవినీతికి పెద్ద పీట వేస్తూ ప్రజల సొమ్మును కొల్లగొడుతోంది
-టిడిపి నేత అచ్చం నాయుడు పై ఈఎస్ఐ కుంభకోణం లో అనవసరంగా ఇరికించి కేసులు నమోదు చేశా రు.
- 23 Sep 2020 9:09 AM GMT
Guntur updates: తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి..యరపతినేని శ్రీనివాసరావు..
గుంటూరు ః
టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు..
-4 వేలకోట్ల కు ఆశపడి విద్యుత్ మీటర్ల తో రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారు.
-రైతుల విషయం లో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
-సంక్షేమ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు.
-సొంత లిక్కర్ పాలసీ తెచ్చి పిచ్చి బ్రాండ్లను ప్రజలకు అంటగట్టారు.
-సొంత మద్యం బ్రాండ్ లతో వేల కోట్లు దోచుకుంటున్నారు.
-భవన నిర్మాణ కార్మికులు 400 కోట్లు ప్రభుత్వం వాడుకోవడం దుర్మార్గం.
-ఏడాది కాలంలో లక్ష కోట్లు తెచ్చిన అప్పు ను ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి.
- 23 Sep 2020 9:04 AM GMT
Sri Padmavathi Ammavaru: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న శ్రీనివాస వేణుగోపాల కృష్ణ..
చిత్తూరు..
- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మాత్యులు చెల్లుబొయినా శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
- శ్రీవారి ఆశీస్సులతోనే సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సుభిక్ష పాలన అందిస్తున్నారు
- మహిళలను ఆర్థికకంగా మరీంత బలోపేతం చేసేందుకు సంక్షేమ పథకాలు ఎంతో దోహదపడుతున్నాయి....
- 23 Sep 2020 8:43 AM GMT
Vizianagaram updates: 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన గరుగుబిల్లి మండలం నాగూరు వీఆర్వో నాగేశ్వరరావు..
విజయనగరం..
-నాగూరుకు చెందిన రైతు అప్పలనాయుడు నుంచి 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో
-1.80సెంట్ల భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాల సబ్ డివిజన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన వీఆర్వో నాగేశ్వరరావు.
- 23 Sep 2020 8:36 AM GMT
Anantapur updates: లౌకిక వాదాన్ని పాటిస్తున్న పార్టీ టీడీపీ: కాలవ శ్రీనివాసులు..
అనంతపురం:
కాలవ శ్రీనివాసులు ప్రెస్మీట్.
-రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
-మెజారిటీ వర్గం మనోభావాలు దెబ్బతింటున్నాయి. హిందూ మతం, దేవలయాలపై దాడులు కొనసాగుతున్నాయి.
-ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదానికి విరుద్ధంగా జరుగుతోంది.
-ఇన్ని జరిగితే జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది చేయడం లేదు
-కొడాలి నాని ఉన్మాదం తో అగ్నికి ఆజ్యం పోసినట్లు మాట్లాడుతున్నాడు. విజయసాయిరెడ్డి చంద్రబాబు ను తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై కేసు పెడతామంటారు.
-టీటీడీ చైర్మన్ జగన్ బంధువు డిక్లరేషన్ అవసరం లేదు అంటాడు. నాని జగన్ మనసులో మాట చెప్పారు.
-టీటీడీ ఈఓ కు డిక్లరేషన్ పై సంతకం చేయించుకోవాల్సిన బాధ్యత ను గుర్తు చేస్తూ లేఖ రాస్తున్నాం. చేయాల్సిన ధర్మం సీఎం పై ఉంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire