19 రాజ్యసభ స్థానాల్లో ఎన్డీఏకు ఊరట.. యూపీఏకు స్వల్ప నష్టం..

19 రాజ్యసభ స్థానాల్లో ఎన్డీఏకు ఊరట.. యూపీఏకు స్వల్ప నష్టం..
x
Highlights

శుక్రవారం 19 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తుది ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీజేపీ కి 8, కాంగ్రెస్‌కు 4 సీట్లు వచ్చాయి.

శుక్రవారం 19 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తుది ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీజేపీ కి 8, కాంగ్రెస్‌కు 4 సీట్లు వచ్చాయి. గతంలో ఈ 19 స్థానాల్లో బిజెపికి 9, కాంగ్రెస్‌కు 6 సీట్లు వచ్చాయి. అంటే, ఈసారి బిజెపి 1, కాంగ్రెస్ 2 సీట్లను కోల్పోయింది. రాజ్యసభలో బిజెపి ఒక సీటును కోల్పోయినప్పటికీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఎ ఈ ఎన్నిక నుండి ఎటువంటి నష్టాన్ని చవిచూడలేదు. రాజ్యసభలో ఈ 19 సీట్లలో ఎన్‌డిఎ గత 10 స్థానాలను గెలుచుకుంది. ఈసారి కూడా బిజెపికి 8, మిత్రపక్షాలకు రెండు రావడంతో 10 సీట్లలో ఎన్డీఏ సంఖ్య చెక్కుచెదరకుండా ఉంది. ఇది బీజేపీకి ఊరట కలిగించే విషయం అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు యుపిఎ 2 సీట్లను కోల్పోయింది. గతంలో యుపిఎ ఈ 19 సీట్లలో 7 గెలిచింది. కాంగ్రెస్‌కు 6 సీట్లు, ఆర్జేడీ కి 1 సీట్లు ఉన్నాయి. ఈసారి కాంగ్రెస్ 4 సీట్లు, జెఎంఎం 1 సీటు గెలుచుకుంది. ఈ విధంగా యుపిఎకు ఈసారి 5 సీట్లు మాత్రమే వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో బిజెపికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ గెలిచి పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. దిగ్విజయ్ సింగ్ గతంలోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఇద్దరు నాయకులు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కూడా రాజస్థాన్ నుంచి గెలుపొందారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories