ఇండియా పేరు మార్చాలని సుప్రీం కోర్టులో పిటిషన్.. ఇవాళ విచారణ

ఇండియా పేరు మార్చాలని సుప్రీం కోర్టులో పిటిషన్.. ఇవాళ విచారణ
x
Supreme Court (file Photo)
Highlights

దేశానికి ఉన్న పేరును మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 'ఇండియా' పేరును భారత్‌ లేదా హిందుస్తాన్‌గా మార్చాలంటూ దాఖలైన సర్వోన్నత...

దేశానికి ఉన్న పేరును మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 'ఇండియా' పేరును భారత్‌ లేదా హిందుస్తాన్‌గా మార్చాలంటూ దాఖలైన సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీనిపై సుప్రీం కోర్టు నేడు విచారణ జరపనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. భారత్‌ లేదా హిందుస్తాన్‌గా మార్చడం వల్ల దేశ ప్రజల్లో ఆత్మగౌరవం, జాతీయత భావం పెరుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ మే 29నే సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ బాబ్డే అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత లిస్ట్ నుంచి డిలీట్ చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో అందుబాటులో ఉన్న నోటీసు ప్రకారం ఈ పిల్ నేడు విచారణకు రానుంది.

1948 సంవత్సరంలో రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న సమయంలోనే ఇండియా అనే పేరు స్థానంలో భారత్ లేదా హిందుస్తాన్ అనే పేరు పెట్టాలని బలంగా వాదన వినిపించిన అంశాన్ని పిటిషన్‌లో గుర్తు చేశారు. ఇండియా పేరును భారత్ అనే పేరును హిందుస్తాన్‌గా మార్చాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి పిటిషన్‌ను దాఖలు చేశారు.

ఇలా దేశం మార్చడం వల్ల దేశ ప్రజలు గతంలో తాము మరొకరి పాలనలో ఉన్నామనే భావన నుంచి బయటపడతారని పిటిషనర్ పేర్కొన్నారు. 'ఇంగ్లీష్ పేరును తొలగించి ఆ స్థానంలో ప్రతీకగా.. భావించే మరో పదం చేర్చడం వల్ల దేశ ప్రజల్లో ఆత్మగౌరవం, జాతీయతా భావం పెరుగుతుందని, భారత్ అనే పేరు చేర్చడం వల్ల స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని గుర్తు చేసుకున్నట్టుగా కూడా ఉంటుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories