Train Accident: పట్టాలు తప్పిన మంగళూరు - ముంబై ఎక్స్ ప్రెస్

Mangaluru to Mumbai Train Derails Near Dudhsagar WaterFalls
x
గోవాలోని దూద్ సాగర్ వద్ద రైలు ప్రమాదం (ఫైల్ ఇమేజ్)
Highlights

Train Accident: ఈరైలులో మొత్తం 345 మంది ప్రయాణికులు * భారీ వర్షాల కారణంగా పట్టాలపై విరిగిపడ్డ కొండచరియలు

Train Accident: గోవాలోని ప్రఖ్యాత దూద్ సాగర్ జలపాతం వద్ద మంగళూరు- ముంబై ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలపై కొండచరియలు విరిగిపడడంతో దుష్ సాగర్- సోనౌలిమ్ స్టేషన్‌ మధ్య ఈ ప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్‌, ఒక జనరల్ బోగి పట్టాలు తప్పాయి. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలులో ఉన్న మొత్తం 345 మంది ప్రయాణికులను హజరత్ నిజాముద్దీన్ -వాస్కోడిగామా స్పెషల్ ట్రైన్‌లో మడ్గావ్ కు తరలించారు.

మరోవైపు.. దూద్ సాగర్ - కరన్ జోల్ రైల్వే స్టేషన్ల మధ్య కూడా పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మంగళూరు -ముంబై రైలుని రూట్ మార్చి తిరిగి కులెమ్ రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్లారు.

Show Full Article
Print Article
Next Story
More Stories