రాష్ట్రాలకు ఐసోలేషన్ కోచ్ లు.. సిద్ధం చేసిన రైల్వేశాఖ

రాష్ట్రాలకు ఐసోలేషన్ కోచ్ లు.. సిద్ధం చేసిన రైల్వేశాఖ
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తిని వీలైనంత వరకు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లోని అన్ని శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. వీలైనంతవరకు మాస్క్ ధరించడం,...

కరోనా వైరస్ వ్యాప్తిని వీలైనంత వరకు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లోని అన్ని శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. వీలైనంతవరకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు ఐసోలేషన్ తో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే రైల్వే శాఖ ఐసోలేషన్ బోగీలను సిద్ధం చేసి, అవసరమైన రాష్ట్రాలకు పంపింది. వీటిని అవసరమైన సమయాల్లో వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటోంది.

క‌రోనాపై పోరాటంలో ఇండియ‌న్ రైల్వే కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇందులో భాగంగా ఇప్ప‌కే చాలా చోట్ల రైలు బోగీల్లో ఐసోలేషన్ సెంట‌ర్ల‌ను ఆయా ప్రాంతాల్లో బాధితుల‌కు అందుబాటులో ఉంచారు. ప్ర‌స్తుతం ప‌లు రాష్ట్రాల్లో వైర‌స్ తీవ్ర‌త కొన‌సాగుతోంది. ఇటువంటి త‌రుణంలో ఆయా రాష్ట్రాల‌కు మ‌రోమారు రైలు ఐసోలేషన్ బోగీల‌ను త‌ర‌లించింది రైల్వే శాఖ‌. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో 204 ఐసోలేష‌న్ బోగీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు రైల్వే శాఖ ప్ర‌క‌టించింది.

కరోనాను కట్టడి చేసేందుకు రైల్వే నాలుగు రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ కోచ్​లను ఏర్పాటు చేసింది. అందులో సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లలో 20 చొప్పున రాష్ట్రంలో మొత్తం 60 కోచ్​లను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 20 కోచ్‌లు అందుబాటులో ఉంచింది. ఢిల్లీలోని శకుర్‌బస్తి రైల్వే స్టేషన్ మెయింటెనెన్స్ డిపోలో 54, యూపీలో 70 కోచ్ లు ఏర్పాటు చేసింది. ఢిల్లీలో విపరీతంగా కేసులు పెరుగుతున్న మేరకు మరో 500 ఐసోలేషన్ కోచ్​లను అందుబాటులోకి తేనున్నట్లు రైల్వేశాఖ‌ వెల్లడించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories