TOP 6 NEWS @ 6 PM: ఎస్ఎల్‌బీసీ సొరంగంలో మెషిన్‌లో కూరుకుపోయిన కార్మికుడు

TOP 6 NEWS @ 6 PM: ఎస్ఎల్‌బీసీ సొరంగంలో మెషిన్‌లో కూరుకుపోయిన కార్మికుడు
x
Highlights

1) ఎస్ఎల్‌బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ తాజా పరిస్థితి ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిన ఘటనలో కేరళ క్యాడవార్ డాగ్స్ గుర్తించిన చోట తవ్వకాలు జరిపే క్రమంలో...

1) ఎస్ఎల్‌బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ తాజా పరిస్థితి

ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిన ఘటనలో కేరళ క్యాడవార్ డాగ్స్ గుర్తించిన చోట తవ్వకాలు జరిపే క్రమంలో మనిషి ఆనవాళ్లు బయటపడ్డాయి. మెషిన్‌లో కూరుకుపోయిన కార్మికుడి చేయి కనిపించిందని తెలుస్తోంది. చేయి మాత్రమే మెషిన్ లోంచి బయటికి కనిపిస్తుండటంతో రెస్క్యూ టీమ్ మెషిన్ ను కట్ చేసే పనిలో నిమగ్నమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు కార్మికులు మెషిన్ ఆపరేట్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఇవాళ బయటికి కనిపించిన చేయి కూడా వారిలో ఒకరిదై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫిబ్రవరి 22న జరిగిన ఈ ఘటనలో 8 మంది ఆచూకీ గల్లంతయ్యింది. గత 16 రోజులుగా కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్ గాలింపు కొనసాగుతూనే ఉంది. తాజా పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెస్క్యూ ఆపరేషన్ లో వేగం పెంచడం కోసం రోబోటిక్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనను జాతీయ విపత్తుగా పేర్కొన్న మంత్రి ఉత్తమ్... బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని అన్నారు.

2) చేనేత కార్మికుల రుణాల మాఫీకి ఓకె చెప్పిన తెలంగాణ సర్కారు

తెలంగాణలో చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.2017 ఏప్రిల్ 1 నుండి 24 మార్చి 31 వరకు ఉన్న రుణాలలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో లక్ష వరకు రుణం ఉన్న చేనేత కార్మికులకు ఆ రుణ భారం తగ్గనుంది.

తెలంగాణలో ప్రభుత్వం రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో నేతన్నలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అఖిల భారత పద్మశాలీల మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నేతన్నలను ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో పద్మశాలీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. కేసీఆర్ పద్మశాలీలను ఎదగనివ్వలేదని ఆరోపించారు. పద్మశాలీలకు కనీసం బతుకమ్మ చీరల బిల్లులు కూడా ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారని గుర్తుచేశారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) Weather Update: సముద్రంలో అలజడి..ఐవోన్ తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ బిగ్ అలర్ట్

Weather Update: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ కీలక సమాచారం అందించింది. భారత వాతావరణ శాఖ అంచనాలకు మించి హిందూ మహా సముద్రంలో అలజడి నెలకొంది. దానికి ఐవోన్ అనే పేరు పెట్టారు. మొన్న ఆవర్తనంగా ఉన్న ఆ తుపాన్ నిన్న అల్పపీడనంగా మారి నేడు తుపాన్ గా మారింది. ప్రస్తుతం దాని సుడి వేగం గంటకు 75కిలోమీటర్లు గా ఉంది. మధ్య స్థాయి తుపాన్ అని అంచనా వేశారు. ఈ తుపాన్ భూమధ్య రేఖావైపు వెళ్తుందనే అంచనా వేసింది ఐఎండీ. ఒకవేళ దిశ మార్చుకున్నట్లయితే అప్పుడు భారత్ వైపు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) Rajamouli Mahesh: షూటింగ్‌ మొదలై నెలైనా ఒక్క అప్డేట్‌ లేదేంటి.? ఇంతకీ ఏం జరుగుతోంది?

బాహుబలితో యావత్‌ దేశాన్ని తనవైపు తిప్పుకున్న రాజమౌళి ట్రిపులార్‌ సినిమాతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్‌ స్థాయికి ఎదిగారు. దీంతో రాజమౌళి నుంచి వస్తున్న తదుపరి చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. రాజమౌళి ప్రస్తుతం మహేష్‌ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఎలాంటి అధికారిక ప్రకటనలు మాత్రం చేయడం లేదు. చిత్రీకరణ మొదలై సుమారు నెల రోజులు గడుస్తోన్నా.. ఎక్కడ జరుగుతోంది? ఏం చిత్రీకరిస్తున్నారు? అనే వివరాలు బయటకు రాకుండా జక్కన్న బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు షూటింగ్‌ లోకేషన్‌కు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. స్పందించిన భారత్

క్యాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్న చినో హిల్స్ ప్రాంతంలోని హిందూ దేవాలయంపై కొంతమంది గుర్తుతెలియని దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇటీవల కాలంలో అమెరికాలో ఈ తరహా ఘటనల్లో ఇది మూడోది.

గతేడాది సెప్టెంబర్ నెలలో క్యాలిఫోర్నియాలోని సాక్రామెంటోలో బాప్స్ (బొచ్చసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ) దేవాలయంపై దాడి జరిగింది. అంతకంటే కొద్దిరోజుల ముందే న్యూయార్క్ లోని మెల్విలెలోని మరో బాప్స్ దేవాలయంపై కూడా దాడి జరిగింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) టీమిండియా లక్ష్యం 252 పరుగులు

దుబాయ్ లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. మిచెల్ డెరీల్ (63 పరుగులు), మిచెల్ బ్రేస్‌వెల్ (53 పరుగులు) మాత్రమే హాఫ్ సెంచరీ మార్క్ దాటారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీసుకోగా రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ చెరో వికెట్ తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories