Indo - China Border: మరోసారి రెచ్చిపోయిన కంత్రీ డ్రాగన్

China Trying to Push Territorial Claim With India | Today National News
x

మరోసారి రెచ్చిపోయిన కంత్రీ డ్రాగన్

Highlights

*సరిహద్దు ప్రాంతంలో గ్రామం నిర్మాణం *4.5 కి.మీ మేర చొచ్చుకొచ్చిన చైనా *101 ఇళ్లతో గ్రామం నిర్మాణం చేసిన డ్రాగన్

Indo - China Border: సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న వేళ కంత్రీ డ్రాగన్ మరోసారి తన చర్యలతో భారత్‌ను రెచ్చగొడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంట భారత భూభాగంలో ఏకంగా ఓ చిన్నపాటి విలేజ్‌నే నిర్మించేసింది. మన భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చినట్లు శాటిలైట్ ఇమేజ్‌లు స్పష్టం చేస్తున్నాయి. డ్రాగన్ సృష్టించిన గ్రామంలో 101 ఇళ్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇదే తరహాలో మరికొంత దూరంలో మరో గ్రామాన్ని నిర్మించింది. అయితే, ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతం భౌగిళికంగా భారత భూభాగంలో ఉన్నప్పటికీ 1959 నుంచి చైనా ఆధీనంలో ఉంది. గతంలో అక్కడ చైనా ఆర్మీ మాత్రమే ఉండగా తాజాగా గ్రామన్ని ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories