Prabhas 22 Update: ప్రభాస్ 22వ మూవీకి ముహూర్తం ఖరారైందా?

Prabhas 22 Update: ప్రభాస్ 22వ మూవీకి ముహూర్తం ఖరారైందా?
x
Prabhas (File Photo)
Highlights

Prabhas 22 Update: బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ సినిమాతో ప్రభాస్ కు ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడింది.

Prabhas 22 Update: బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ సినిమాతో ప్రభాస్ కు ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడింది. తరువాత యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్సకత్వంలో 'సాహో' అనే చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయింది. ఈ సినిమా తోలి రోజు ఆట నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఓవరాల్ గా సుమారు రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాదించింది. కేవలం బాలీవుడ్ లోనే ఈ చిత్రం సుమారు రూ. 200 కోట్ల భరీ వసూళ్లను సాధించి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది.

'సాహో' తరువాత ప్రభాస్ 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ''రాధే శ్యామ్'' అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. తరువాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. అది అలా ఉంటే ప్రభాస్ తన తర్వాత సినిమా గురించి మరో వార్త హల్ చల్ చేస్తోంది. 'కేజీఎఫ్'తో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

ప్రభాస్ కి ఇది 22వ చిత్రం. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసాడని సమాచారం. ఆ చిత్రం పూర్తి అయిన తరువాత ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే చిత్రం పట్టాలెక్కనుంది. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్, 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ, 'మహానటి' ఫేమ్ అశ్విన్ సినిమాలు పూర్తి అయిన తరువాత ఈ చిత్తాన్నిమొదలుపెట్టనున్నారు అని తెలుస్తుంది.

మరోవైపు ప్రభాస్.. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాణంలో డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మరో హీరోగా హృతిక్ రోషన్ నటించబోతున్నట్టు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమా కంటే ముందు ప్రభాస్.. కేజీఎఫ్'తో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ, నాగ్ అశ్విన్ సినిమాలు కంప్లీటైన తర్వాత ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా 2022లో పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories