మాకు మాత్రమే నిజాయితీ ఉంది అంటున్న వార్మ

మాకు మాత్రమే నిజాయితీ ఉంది అంటున్న వార్మ
x
Highlights

వివాదానికి మరోపేరు రామ్ గోపాల్ వర్మ అని చెప్పుకోవచ్చు. అందరికంటే భిన్నంగా ఆలోచించడం, మాట్లాడే ప్రతి మాటలో వ్యంగ్యం ఉండడం, ప్రతి పనిలో వివాదాలకు...

వివాదానికి మరోపేరు రామ్ గోపాల్ వర్మ అని చెప్పుకోవచ్చు. అందరికంటే భిన్నంగా ఆలోచించడం, మాట్లాడే ప్రతి మాటలో వ్యంగ్యం ఉండడం, ప్రతి పనిలో వివాదాలకు తెరతీయడం వర్మ కి వెన్నతో పెట్టిన విద్య అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో అన్నిటికంటే పెద్ద వివాదానికి రెడి అవుతున్నారు వర్మ. ఈ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ సినిమాల గురించి, సెలెబ్రెటీల గురించి ట్వీట్ చేసే వర్మ ఇప్పుడు 90ల కాలంలోని ఓ ఫొటోని పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో వర్మ చాలా సన్నిహితంగా ఉండేవాడట. ఒక పార్టీలో వారితో కలిసి వర్మ మందు పార్టీలో పాల్గొన్నాడు. ఆ పార్టీలో వర్మ అందరికంటే ఎక్కువగా అభిమానించే శ్రీదేవి కూడా ఉండడం విశేషం. ఆ ఫోటో ని వర్మ ఇప్పుడు సోషల్ మీడియా లో షేర్ చేసాడు. చిరంజీవి, వెంకటేష్ తమ చేతుల్లో వున్న మందు గ్లాస్ లని కనిపించకుండా దాచేస్తే వర్మ,నాగార్జున మాత్రం అందరికీ కనిపించేలా పట్టుకున్నారు. "చివరి లెఫ్ట్ లో వున్న మహా లఫూట్ వెధవని నేనే. మధ్యలో వున్న వాళ్ళు హ్యాండ్స్ దాస్తున్నారు. శ్రీదేవిగారి రెండు హ్యండ్ ఫ్రీగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిజాయితీ నాలోనూ, శ్రీదేవిలోనూ, నాగార్జున లో మాత్రమే వుంది కాబట్టి" అని ఆసక్తికరంగా కాప్షన్ పెట్టాడు వర్మ.



Show Full Article
Print Article
Next Story
More Stories