సాహో విడుదలపై చిత్రసీమకు ప్రభాస్ కృతజ్ఞతలు

సాహో విడుదలపై చిత్రసీమకు ప్రభాస్ కృతజ్ఞతలు
x
Highlights

తెలుగు తెరపై మరో భారీ బడ్జెట్ చిత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర...

తెలుగు తెరపై మరో భారీ బడ్జెట్ చిత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది. సాహో ఈనెల 30న థియేటర్లలోకి రానుంది. ఈ నేపధ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం విడుదలకు తగినన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేలా ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో విడుదల కావలసిన నాలుగు చిత్రాల నిర్మాణ బృందాలతో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఆ నిర్మాతలు ఆగస్ట్ 30న తమ సినిమాలను విడుదల చేయకూడదని నిర్ణయించారు. దీంతో హీరో ప్రభాస్ వారందరికీ తన కృతజ్ఞతలు తెలిపారు.

"ఆగస్టు 30న సాహో విడుదలకు మార్గం సుగమం చేసిన నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీపై ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు ఉంటాయి, ఆల్ ది బెస్ట్" అంటూ ట్వీట్ చేశారు.

ఇక మరోవైపు సాహో చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా సోషల్ మీడియాలో అందరికీ తమ ధన్యవాదాలు తెలిపింది. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించిన సాహో సినిమాకు కావలసినన్ని స్క్రీన్స్ అందించే వెసులుబాటు కల్పించి చిత్రసీమ తమకు అండగా నిలిచిందంటూ యూవీ క్రియేషన్స్ తమ పోస్టులో పేర్కొంది.

బాహుబలి తరువాత విడుదలవుతున్న ప్రభాస్ చిత్రం ఇదే. బాహుబలితో అంతర్జాతీయ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. ఇప్పుడు సాహో తో మరోసారి అంతర్జాతీయ స్థాయి విలువలతో నిర్మితమైన చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు వస్తుండడంతో ఈ సినిమా పై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సుజిత్ దర్శకుడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories