బయోపిక్ ఇక లేనట్టేనా.

బయోపిక్ ఇక లేనట్టేనా.
x
Highlights

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల వర్షం కురుస్తోంది అంటే అతిశయోక్తి కాదు. అలనాటి తార సావిత్రి జీవిత చరిత్ర గా తెరకెక్కిన 'మహానటి' సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత చాలా మంది దర్శకులు బయోపిక్ ల వైపు మొగ్గు చూపారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల వర్షం కురుస్తోంది అంటే అతిశయోక్తి కాదు. అలనాటి తార సావిత్రి జీవిత చరిత్ర గా తెరకెక్కిన 'మహానటి' సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత చాలా మంది దర్శకులు బయోపిక్ ల వైపు మొగ్గు చూపారు. ఈ మధ్యనే కృష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో నందమూరి తారకరామారావు బయోపిక్ లోని మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' విడుదలైంది. అయితే ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో రెస్పాన్స్ ఏమి రాలేదు.

సావిత్రి జీవితంలో బోలెడు ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి సినిమాకు కావాల్సిన ఎమోషన్లు దొరికాయి. అందుకే ఆ సినిమా హిట్ అయింది. కానీ ఎన్టీఆర్ సినిమా సాఫీగా సాగిపోతుంది. అందులో చెప్పుకోదగ్గ ట్విస్టులు ఏమీ ఉండవు. సినిమా ఆడకపోవడానికి అది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. దీని వల్ల నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏ ఎన్నార్ జీవితం కూడా దాదాపు ఒడిదుడుకులు లేని జీవితం. కాబట్టి సినిమాకు మంచి ఆదరణ లభించక పోవచ్చు. ఇక ఇప్పటికే ఘంటసాల, కాంతారావు ఇలాంటి వారి బయోపిక్ షూటింగ్ సగం సగం పూర్తి అయిపోయింది. మరి ఆ సినిమాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories