Raviteja as producer: నిర్మాతగా మారనున్న మాస్ మహారాజా?

Raviteja as producer: నిర్మాతగా మారనున్న మాస్ మహారాజా?
x
Highlights

Raviteja as producer: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా ఎదిగిన హీరో లలో మాస్ మహారాజా రవితేజ ఒకడు.. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కెరీర్ ను మొదలుపెట్టిన రవితేజ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి చాలా రకాల పాత్రలు పోషించాడు.. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన నీకోసం సినిమాతో హీరోగా మారాడు. అక్కడి నుంచి చాలా సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగాడు.. అయితే ఇలా ఎదిగే క్రమంలో యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొత్త కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు రవితేజ..

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా ఎదిగిన హీరో లలో మాస్ మహారాజా రవితేజ ఒకడు.. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కెరీర్ ను మొదలుపెట్టిన రవితేజ(Raviteja as producer) ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి చాలా రకాల పాత్రలు పోషించాడు.. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన నీకోసం సినిమాతో హీరోగా మారాడు. అక్కడి నుంచి చాలా సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగాడు.. అయితే ఇలా ఎదిగే క్రమంలో యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొత్త కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు రవితేజ..

అయితే ఇప్పుడు ఏకంగా రవితేజ నిర్మాతగా మరానున్నడని ఫిల్మ్ నగర్ లో ఓ టాక్ నడుస్తోంది... తానో బ్యానర్ ను స్థాపించి వేరే హీరోలతో సినిమాలు చేస్తూ కొత్త కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.. కానీ దీని పైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.. ఇక ఇప్పటికే యంగ్ హీరోస్ అంతా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టేశారు.. తమ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం మాత్రమే కాకుండా వేరే హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు..

పవన్ కళ్యాణ్ నిర్మాతగా పీకే ఎంటర్టైన్మెంట్స్, కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్, మహేష్ బాబు నిర్మాతగా జి ఎం బి ఎంటర్టైన్మెంట్, రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్, విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ది హిల్స్ , నాని నిర్మాతగా వాల్ పోస్టర్ అనే నిర్మాణ సంస్థ లను ఏర్పాటు చేసి సినిమాలను తెరకెక్కిస్తున్నారు.. ఇప్పుడు వీరి బాటలోనే రవితేజ కూడా ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది..

ఇక ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే ఓ సినిమా చేస్తున్నాడు.. డాన్ శీను, బలుపు సినిమాల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. ఈ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది . ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories