'మన్మధుడు' సీక్వెల్ అధికారిక లాంచ్ కోసం ముహూర్తం ఫిక్స్

మన్మధుడు సీక్వెల్ అధికారిక  లాంచ్ కోసం ముహూర్తం ఫిక్స్
x
Highlights

ఇప్పటిదాకా హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ మధ్యనే సుశాంత్ హీరోగా నటించిన 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారాడు. గత కొంతకాలంగా రాహుల్...

ఇప్పటిదాకా హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ మధ్యనే సుశాంత్ హీరోగా నటించిన 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారాడు. గత కొంతకాలంగా రాహుల్ రవీంద్రన్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తో ఒక సినిమా చేయనున్నారని, ఈ సినిమా నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమా అయిన 'మన్మధుడు' కి సీక్వెల్ గా తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. ఈ వార్తలో నిజం లేక పోలేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అధికారికంగా త్వరలో లాంచ్ చేయనున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

మార్చ్ 12 న సినిమా అధికారికంగా లాంచ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారట. సినిమా షూటింగ్ మొత్తం యూరోప్లో జరగనుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ కూడా అక్కడే జరుగుతుందట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగార్జున విజయ భాస్కర్ దర్శకత్వంలో నటించిన 'మన్మధుడు' సినిమా తెలుగులో క్లాసిక్గా నిలిచిన సినిమా. రాహుల్ ఈ సినిమా సీక్వెల్ తో ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తాడో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories