'సత్యమేవ జయతే2' : రక్తం కూడా త్రివర్ణంలోనే ఉంటుంది!

సత్యమేవ జయతే2 : రక్తం కూడా త్రివర్ణంలోనే ఉంటుంది!
x

Satyameva Jayate 2 New look

Highlights

Satyameva Jayate 2 : విభిన్నమైన చిత్రాలను తీస్తూ తనకంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.. తాజాగా

Satyameva Jayate 2 : విభిన్నమైన చిత్రాలను తీస్తూ తనకంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.. తాజాగా తన కొత్త సినిమా 'సత్యమేవ జయతే2' కు సంబంధించిన కొత్త పోస్టర్ ను విడుదల చేశాడు.. ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇందులో అబ్రహం నాగలి చేతబట్టి.. ఒంటిపై జెండా రంగులు పూసుకుని చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు.'గంగా మాత ప్రవహించే ఈ దేశంలో రక్తం కూడా త్రివర్ణంలోనే ఉంటుంది' అని క్యాప్షన్ జోడించారు.

ఇందులో దివ్య ఖోస్లా కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది.. 2021 ఈద్ సందర్భంగా మే 12న సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ముందుగా 2020 అక్టోబర్ 2 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.. కానీ కరోనా ప్రభావంతో వాయిదా పడింది.. ఇక ఈ సినిమాని మధు భోజ్వానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పేయి, అమీరా దస్తూర్ తదితరులు నటిస్తున్నారు. మిలాప్ జావేరి దర్శకత్వం వహించాడు.. కాగా 2018లో వచ్చిన 'సత్యమేవ జయతే' సినిమాకు ఇది సీక్వెల్ కావడం విశేషం.. ఈ పోస్టర్ సినిమా పైన భారీ అంచనాలని క్రియేట్ చేసింది.



అయితే 2021 ఈద్ సందర్భంగా మే 12న సల్మాన్ ఖాన్ తన అప్ కమింగ్ మూవీ 'కబీ ఈద్ కబీ' అనే సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చేయాలనీ భావించారు. కానీ మళ్ళీ విడుదల తేదిని 2021 మే 12కి మార్చారు.. ఈ సినిమాకి ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించగా, సాజిద్ నాడియాద్వాలా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు, అయితే ఒకే తేదిన రెండు భారీ సినిమాలను రిలీజ్ చేస్తారా లేకా ఎవరైనా డ్రాప్ అవుతారా అన్నది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories