ట్రూ లీడర్.. సీఎం కేసీఆర్కు సోనూ సూద్ సెల్యూట్
పొరుగు రాష్ట్రాలకు చెందిన కూలీలు 3.35 లక్షల మంది రాష్ట్రంలో పనిచేస్తున్నారని నిన్న మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కుకుపోయిన పొరుగు రాష్ట్రాల కూలీలు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూస్తామని తెలిపారు. తెలంగాణలో పని చేస్తున్న పొరుగు రాష్ట్రాల కూలీలందరికీ బియ్యం, పిండి పంపిణీతో పాటు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున నగదు కూడా అందజేస్తామని కేసీఆర్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందిస్తూ, కేసీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. 'ట్రూ లీడర్.. శాల్యూట్' అంటూ సోనూ సూద్ ఓ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ తో పాటు మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ ప్రకటన చేసిన వీడియోను జతపరిచాడు.
True leader👏👏👏👏 salute 🇮🇳 @TelanganaCMO @KTRTRS pic.twitter.com/5HQ2ZJ8iPW
— sonu sood (@SonuSood) March 30, 2020
Next Story




