అమ్మ ఆశీర్వాదంతో మరో షెడ్యూల్ పూర్తి : కంగనా!

అమ్మ ఆశీర్వాదంతో మరో షెడ్యూల్ పూర్తి : కంగనా!
x
Highlights

Jayalalithaa Biopic : ఇండియన్ సినిమాల్లో ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. సినీ, రాజకీయ, క్రీడాకారుల జీవితాల ఆధారంగా ఈ బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

Jayalalithaa Biopic : ఇండియన్ సినిమాల్లో ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. సినీ, రాజకీయ, క్రీడాకారుల జీవితాల ఆధారంగా ఈ బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. వారి జీవిత చరిత్రను చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని బయోపిక్ లు వచ్చి మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి తలైవి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్.. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాపైన చాలా అంచనాలు ఉన్నాయి.

అయితే కరోనా వలన వాయిదా పడిన సినిమా మరో షెడ్యుల్ మొదలై పూర్తి చేసుకుంది.. ఈ విషయాన్నీ కంగ‌నా త‌న ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. "విప్లవాత్మకమైన నాయకురాలి సినిమా మరో షెడ్యూల్ పూర్తి చేశాం. కరోనా తర్వాత చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి కానీ యాక్షన్‌కు, కట్‌కు మధ్య చేసే నటన మాత్రం మారలేదు. తలైవి చిత్ర బృందానికి కృతజ్ఞతలు" అని పేర్కొంది కంగనా..

ఇక ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, కరుణానిధిగా ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తుండగా, విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని తమిళ్ తో పాటు హిందీ, తెలుగు భాషలలో రిలీజ్ చేయనున్నారు. త్వరలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories