బాబా భాస్కర్ కు టికెట్ టు ఫినాలే!

బాబా భాస్కర్ కు టికెట్ టు ఫినాలే!
x
Highlights

బిగ్ బాస్ సీజన్ 3 క్లైమాక్స్ కి చేరిపోతోంది. చివరికి ఎవరు మిగులుతారో తెలీదు కానీ..చివర వరకూ ఎవరు మిగులుతారనేది ఒక్కోరిగా తేలుతోంది. హౌస్ మేట్స్...

బిగ్ బాస్ సీజన్ 3 క్లైమాక్స్ కి చేరిపోతోంది. చివరికి ఎవరు మిగులుతారో తెలీదు కానీ..చివర వరకూ ఎవరు మిగులుతారనేది ఒక్కోరిగా తేలుతోంది. హౌస్ మేట్స్ అందరినీ సరదా మూడ్ లో పెట్టి..నిద్రపుచ్చి.. తెల్లారకుండా లేపి.. అందర్నీ టెన్షన్ పెట్టాడు బిగ్ బాస్.

ట్విస్ట్ లు ఇవ్వడంలో బిగ్ బాస్ తర్వాతే కదా ఎవరైనా..

ఆరుగురు సభ్యులు ఉన్న బిగ్ బాస్ హౌస్ నుంచి ఈవారాంతంలో ఒకరు వెళ్లిపోతారు. వారిలో మిగిలిన ఐదుగురు వచ్చేవారం ఫైనల్స్ కోసం ఆటాడుతారు. ఈ చివరి వారంలోకి రాహుల్ మొన్న డైరెక్ట్ గా మొదటి ఫైనలిస్టు గా వెళ్లాడు. శనివారం..ఆదివారాల్లో నాగార్జున వచ్చి ఎవరు ఇంటి నుంచి వెళతారో చెప్పడం బిగ్ బాస్ పద్దతి. ఇప్పుడు అది బ్రేక్ అయింది.

శుక్రవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ రెండో ఫైనలిస్ట్ ఎవరో తేల్చేశారు. అందర్నీ రాత్రి 3.30 గంటలకు బట్టలు సర్దుకుని గార్డెన్ ఏరియాలోకి రమ్మన్నారు. అక్కడ బిగ్ బాస్ లో వారి జర్నీ గురించి చెప్పమన్నారు. తరువాత బాబా భాస్కర్ రెండో టికెట్ టు ఫినాలె గెల్చినట్టు చెప్పారు.

ఇక హౌస్ లో వరుణ్..శ్రీముఖి..శివజ్యోతి.. అలీ.. నలుగురు ఎలిమినేషన్ జోన్ లో వున్నారు. వీరిలో ఎవరు బయటకు వెళతారు? ఎవరు ఫైనల్స్ కి వెళతారు? ఇవన్నీ వీకెండ్ లో నాగార్జున తేలుస్తారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories