Bigg Boss 3 Telugu Episode 49: అందరూ దోషి అన్నారు.. కానీ, సేఫ్ జోన్ లో అతనే!

Bigg Boss 3 Telugu Episode 49: అందరూ దోషి అన్నారు.. కానీ, సేఫ్ జోన్ లో అతనే!
x
Highlights

బిగ్ బాస్ 3 తెలుగు ఎపిసోడ్ 49 నాగార్జున హోస్ట్ గా సరదాగా సాగింది. మామూలుగానే శనివారం క్లాస్ హౌస్ మేట్స్ కి నాగార్జున తొ క్లాస్పో అయి పోయింది. ఇక ఎలిమినేషన్ లో ఉన్న రాహుల్, మహేష్, శ్రీముఖి, రవికృష్ణ, అలీ లలో రాహుల్ సేఫ్ సైడ్ లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించారు.

శనివారం మామూలుగానే నాగార్జున వచ్చారు.. హౌస్ మేట్స్ తప్పొప్పుల్ని వెలికి తీసి క్లాస్ పీకే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేపు ఎవరు బయటకు వెళ్ళిపోతారో హింట్ ఇచ్చినట్టు ఎపిసోడ్ అనిపించింది. అందరూ రాహుల్ ని దోషిగా నిలబెట్టేశారు.

దోషా..నిర్దోషా..?

పోయిన వారం బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం స్పెయిన్ వెళ్ళిన నాగార్జున ఈవారం బిగ్ బాస్ కి వచ్చేశారు. వస్తూనే తన పని మొదలెట్టేశారు. హౌస్ మేట్స్ తొ కొద్దిసేపు ముచ్చట్లు పెట్టిన నాగ్ వారితో ఓ ఆట ఆడించారు. అందరికీ దోషి, నిర్దోషి అని రాసున్న బోర్డులు ఇచ్చి.. ఒక్కోరు తమకు దోషి అని అనిపించిన వారి పేరు చెప్పి ఎందుకు దోషి అయ్యారో చెప్పాలన్నారు. ఆ వివరణ తరువాత వారు దోషో కాదో హౌస్ మేట్స్ బోర్డుల ద్వారా చెప్పాలి. దీనిలో బాబా భాస్కర్ స్టేషన్ ఆఫీసర్ గా.. శివజ్యోతి అయన అసిస్టెంట్ కానిస్టేబుల్ గా వ్యవహరించారు. బాబా భాస్కర్ ఫైనల్ తీర్పు చెప్పాలని చెప్పారు.

టార్గెట్ రాహుల్..

దాదాపుగా హౌస్ మేట్స్ అందరూ రాహుల్ ని దోషిగా చెప్పారు. ఇక అందరి వివరణలూ విన్న నాగార్జున అందరికీ ఎలా ఉండాలనే విషయంలో క్లాస్ పీకారు. బాబా భాస్కర్ ని కూడా అందరూ దోషి అని చెప్పారు. అదీ ఎక్కువ కామెడీ చేస్తున్నారనేది కంప్లైంట్.

రాహులే సేఫ్..

హౌస్ మేట్స్ అందరూ రాహుల్ ని టార్గెట్ చేస్తే బిగ్ బాస్ మాత్రం రాహుల్ ని సేఫ్ జోన్ లో పెట్టేశారు. ఇక రాహుల్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించారు.

ఈవారం ఇప్పటికే రాహుల్ సేఫ్ సైడ్ లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించారు. మిగిలిన నలుగురిలో ఎవరు బిగ్ బాస్ నుంచి రేపు బయటకు వెళతారని అనుకుంటున్నారు?



Show Full Article
Print Article
More On
Next Story
More Stories