డేంజర్ జోన్ లోకి భార్యాభర్తలు.. బిగ్ బాస్ 3 హైలైట్స్!

డేంజర్ జోన్ లోకి భార్యాభర్తలు.. బిగ్ బాస్ 3 హైలైట్స్!
x
Highlights

శనివారం.. బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులను కూడా ఉత్కంతలో ముంచే రోజు. ఈ వారం కూడా అదే ఉత్సాహంతో నాగార్జున హౌస్ మేట్స్ ని ప్రేక్షకుల్ని...

శనివారం.. బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులను కూడా ఉత్కంతలో ముంచే రోజు. ఈ వారం కూడా అదే ఉత్సాహంతో నాగార్జున హౌస్ మేట్స్ ని ప్రేక్షకుల్ని పలకరించడానికి వచ్చేసారు. వచ్చీ రాగానే హౌస్ మేట్స్ తో ముచ్చట్లు మొదలు పెట్టారు. ప్రేక్షకుల మదిలో ఏముందో నాగార్జున బయట పెట్టారు. భార్యాభార్తలకు వార్నింగ్ పడింది.. అందరి మదినీ ఆకట్టుకున్న అలీకి పొగడ్తల వర్షం కురిసింది.. అనవసరంగా నోరుపారేసుకున్న తమన్నాకి హెచ్చరికలు వచ్చాయి. హౌస్ లో మొదట్నుంచీ చక్కని ప్రదర్శన కనపరుస్తున్న బాబా భాస్కర్ కు బిగ్ బాస్ టాటూ గౌరవం దక్కింది.. ఇవీ బిగ్ బాస్ సీజన్ 3 ఎపిసోడ్ 14 విశేషాలు.

భార్యాభర్తల ఓవర్ యాక్షన్ కి కళ్లెం!

బిగ్ బాస్ లో తొలిసారిగా భార్యాభర్తలు వితిక షేరు, వరుణ్ సందేశ్ ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళిద్దరి ప్రవర్తనా కొంచెం శృతి మించుతోంది. తొలి వారంలోనే మహేష్ తో అనవరపు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న ఈ జోడీ.. ఈ వారం హిమజ, పునర్నవిలతోనూ అదే విధంగా పెట్టుకున్నారు. అంతే కాకుండా, వరుణ్ కెప్టెన్ అయిన తరువాత ఇద్దరి ప్రవర్తనలోనూ ఎంతో తేడా కనిపించింది. ఇదంతా ఎనలైజ్ చేసిన నాగార్జున ఇద్దరికీ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.

అలీకి పొగడ్తల పురస్కారం..

తమన్నా తో జరిగిన వ్యవహారంలో హుందా గా ప్రవర్తించి అందరి మన్ననలు పొందిన అలీకి..హౌస్ మేట్స్ అందరూ అండగా నిలిచారు. ఇటు వీక్షకులు కూడా అలీ వ్యవహార శైలిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక నాగార్జున కూడా అలీ అతితుడే కి పొగడ్తల వర్షం కురిపించారు.

తమన్నాకు హెచ్చరికా సందేశం..

అసలు అనవసరంగా ఎందుకు నోరు పారేసుకున్నారంటూ తమన్నాకి నాగార్జున సూటి ప్రశ్న సంధించారు. దానికి తమన్నా దగ్గర సరైన సమాధానం లేకుండా పోయింది. హౌస్ లో ఎవరి పద్ధతిలో వారుంటారు. దానిని బట్టి మన ఆట కూడా ఉండాలి అంతే కానీ, నోరు పారేసుకోవడం అనేది అంత బాగాలేదు అంటూ తమన్నకి సునిశితంగా హెచ్చరికలు పంపించారు నాగార్జున.

బాబా భాస్కర్ హ్యాట్రిక్ బహుమానం..

టీం మేట్స్ అందరూ బాబా భాస్కర్ నే హీరోగా పేర్కొంటూ వరుసగా మూడు కిరీటాలు పెట్టారు. దాంతో, బాబాకి బిగ్ బాస్ టాటూ వేసుకోవాలని సూచించారు నాగార్జున. అందరి మనసుల్ని గెలుచుకున్నావ్ అంటూ ప్రశంసించారు.

ఎవరు విలన్.. ఎవరు హీరో?

ఇదీ ఈవారం నాగార్జున హౌస్ మేట్స్ తో ఆడించిన ఎలిమినేషన్ కర్టెన్ రైజర్ గేమ్. దీని ప్రకారం హౌస్ మేట్స్ ఇంట్లో తాము హీరో అని ఎవర్ని అనుకుంటున్నారో వారికి గోల్డ్ కిరీటం పెట్టాలి. విలన్ అనుకుంటున్న వారికి బ్లాక్ కిరీటం పెట్టాలి. దీన్లో మొదటి మూడు బంగారు కిరీటాలు వరుసగా బాబా భాస్కర్ కి వచ్చాయి. దాంతో తరువాత ఆయనకు ఎవరూ కిరీటం పెట్టకూడదని షరతు పెట్టారు. ఇందులో భాగంగా బాబా భాస్కర్‌ హీరో.. తమన్నా, వరుణ్‌ సందేశ్‌లు విలన్స్‌ అని ఇంటిసభ్యులు తేల్చేశారు.

ఎలిమినేషన్ సందడి.. సేఫ్ ఎవరంటే..

మహేష్, శ్రీముఖి, రాహుల్, జాఫర్, వితిక, వరుణ్, పునర్నవి, హిమజ మొత్తం ఎనిమిది మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సంగతి తెల్సిందే. అయితే, వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆదివారం తేలుతుంది. ఈలోపు శనివారం నలుగురు సేఫ్ అయినట్టు ప్రకటించారు నాగార్జున. మొదట మహేష్ విట్ట సేఫ్ అయినట్టు ప్రకటించారు. తరువాత హిమజ రాహుల్ సేఫ్ అన్నారు. ఇక చివరి నిమిషంలో శీముఖి సేఫ్ అని ప్రకటించారు. చివరి ఐదుగురిలో ఎవరిని మీరు హౌస్ లో కొనసాగాలని కోరుకుంటున్నారు అని నాగార్జున మిగిలిన వారిని ప్రశ్నించగా ఎక్కువ మంది (5గురు) జాఫర్ ను సూచించారు. అయినా, శ్రీముఖికి ప్రేక్షకుల ఓట్లు ఎక్కువ వచ్చాయి అంటూ ఆమెను సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు నాగ్. ఇక పునర్నవి, జాఫర్, వరుణ్, వితిక లు ఎలిమినేషన్ కి సిద్ధంగా ఉన్నారు. వీరిలో ఎవరు బయటకు వెళతారో చూడాలంటే.. ఆదివారం రాత్రి వరకూ ఆగాల్సిందే!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories