Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బుధవారం, 17జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ఏకాదశి ( ఉ.07:45 వరకు), అశ్వనీ నక్షత్రం (ఉ.06:04 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:51 pm

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 17 Jun 2020 1:53 PM GMT

    » Hmtv తో రఘు రామ కృష్ణమరాజు

    - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో నాకు విభేదాల్లేవ్

    - జగన్ మోహన్ రెడ్డి చరిష్మా తో పాటు రఘురామ కృష్ణమ రాజు బొమ్మ కూడా నరసాపురం ఎన్నికలలో పనిచేసింది

    - తెలుగుదేశం కంచుకోట అయిన నరసాపురం లో జగన్ హవా 90 శాతం ఉంటే 10 శాతం నా అభ్యర్థిత్వానిది కూడా క్రెడిట్ ఉంది

    - ఇసుక వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది

    - ఇళ్ల స్థలాల కొనుగోళ్లు లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి

    - జగన్ మోహన్ రెడ్డి సమయం ఇస్తే చెప్పాల్సినవి చెప్పి వస్తాను

    - నేనేమీ డ్యూయెట్ కోసం జగన్ మోహన్ రెడ్డి ని కలుస్తానని అనడం లేదు

    - ప్రజాసమస్యల పైనే కలవాలనుకుంటున్నాను

    - ఎమ్మెల్యే, ఎంపీలకే అందుబాటులో లేకుంటే ఎలా?

    - రాజీనామా చేసి వాళ్ళు జగన్ ఫోటో తో పోటీ చేస్తే రఘురాముడి ఫొటో తో నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను

  • 17 Jun 2020 1:51 PM GMT

    » తూర్పుగోదావరి.. అన్నవరం.

    - జూన్ 21 వ తేదీ సూర్యగ్రహణం సందర్భంగా సత్యదేవుని ఆలయం మూసివేత...

    - గ్రహణం అనంతరం సంప్రోక్షణ కార్యక్రమాల జరిపిన తరువాత ఆదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఆలయం తెరువబడును..

    - ఈ సందర్భంగా స్వామి వారి నిత్యఆర్జిత సేవలు, వ్రతాలు, నిత్యకళ్యాణం రద్దు..

    - ఆలయం తెరిచిన తరువాత 5 గంటల నుంచి తిరిగి వ్రతాలు, నిత్యకళ్యాణం నిర్వహణ..

  • 17 Jun 2020 1:50 PM GMT

    »ప్రధాని విడియో కాన్ఫరెన్స్ తో సిఎం కేసీఆర్


    - కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది.

    - కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉన్నది. మరణాల రేటు కూడా తక్కువగానే నమోదు అవుతున్నది.

    - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరు వల్ల కరోనా విషయంలో తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం మాకుంది.

    - తెలంగాణలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి.

    - ఇక్కడ కూడా వ్యాప్తి నివారణకు గట్టిగా పనిచేస్తున్నాం.

    - కొద్ది రోజుల్లోనే వ్యాప్తి అదుపులోకి వస్తుందనే విశ్వాసం నాకున్నది.

    - మళ్లీ మామూలు జీవితం ప్రారంభమవుతున్నది.

    - వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు, హమాలీలు మళ్లీ పని చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలకు వెల్లడానికి సిద్ధమవుతున్నారు. వారికి అవకాశం కల్పించాలి.

    - దేశమంతా ఒక్కటే, ఎక్కడి వారు ఎక్కడికి పోయైనా పనిచేసుకునే అవకాశం ఉండాలి.

    - బీహార్ నుంచి హామాలీలు తెలంగాణకు రావడానికి సిద్ధమవుతున్నారు

    - బీహార్ నుంచి వచ్చే హమాలీలను అక్కడి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వారిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి సరదాగా విడియో కాన్ఫరేన్స్ తో సంభాషణ

    - సిఎం కేసీఆర్

    - నితీష్ గారు, మేము తెలంగాణలో మీ హమాలీలను బాగా చూసుకుంటాం.

    - మా సిఎస్ కూడా మీ బీహార్ వారే.

    - దయచేసి పంపించండన్నా సిఎం కేసీఆర్.

  • 17 Jun 2020 1:44 PM GMT

    »» తెలంగాణ లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదల కు టైం ఖరారు

    - రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

  • 17 Jun 2020 1:43 PM GMT

    అసెంబ్లీ

    »ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండలి చీఫ్ విప్..

    - పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాలపై సీఎం నివేదిక తెప్పించుకున్నారు..

    - ఒకరిపై మరొకరు నేతలు చేసుకుంటున్న విమర్శలపై పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది..

    - ఇటు వంటి వాటిని సీఎం జగన్ సహించరు..

    - ఎవరికైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళాలి..

    - క్రమశిక్షణ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు..

    - గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి..

    - ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలి..

    - హద్దు మీరితే ఎలాంటి చర్యలకైన వెంకడమని సీఎం చెప్పారు..

    - నాయకులు ఒకరిపై మరొకరు చెలెంజ్ లు మానుకోవాలి..

    - నరసాపురంలో సంఘటనపై సీఎం జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు..

    - ఎవరిది తప్పు అనేదానిపై అధిష్టానం నివేదిక తెప్పించుకుంటున్నారు..

    - పార్టీ అనుమతి లేనిదే ఎవరు మీడియా సమావేశాలు నిర్వహించరాదు..

    - నేతలకు ఇబ్బంది ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలి..

    - ఎమ్మెల్యేలు ఎంపీలకే కాదు అందరికి ఇదే సూత్రం వర్తిస్తుంది..

    - సీఎం జగన్ సమయం ఇవ్వడం లేదనేది అవాస్తవం..

    -»» ప్రసాద్ రాజు నరసాపురం ఎమ్మెల్యే

    - ఎమ్మెల్యేలను పందులు గుంపుగా ఎంపీ రఘురామ్ కృష్ణ రాజు పోల్చడం సరికాదు..

    - ఇబ్బంది ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని చూచించము..

    - పరుష పదజాలంతో పార్టీకి నష్టం జరిగేలా ప్రవర్తించారు..

    - ఆయన వ్యవహారాన్ని అందరూ చూసారు..

    - మేము అందరం జగన్మోహన్ రెడ్డి బొమ్మపెట్టుకొని గెలిసాము..

    - మీకు ధైర్యం ఉంటే ఆయనే రాజీనామా చేసి గెలవాలి..

    - పార్టీ లేకపోతే రఘురామ కృష్ణమారాజు గడ్డి పరకతో సమానం..

  • 17 Jun 2020 12:59 PM GMT

    షేక్ పెట్ ఎమ్మార్వో సుజాత కు బెయిల్ మంజూరు

    - ఆదాయానికి మించిన కేసులో సుజాత అరెస్ట్.

    - కేసులో సుజాత భర్తను విచారణ చేసిన ఏసీబీ అధికారులు.

    - తనను సైతం అరెస్ట్ చేస్తారేమో అణా అనుమానంతో భర్త విజయ్ ఆత్మహత్య.

    - భర్త అజయ్ అంతక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి.

  • 17 Jun 2020 12:58 PM GMT

    మరికాసేపట్లో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి చేరుకోనున్న కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం..

    - హకీమ్ పేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి చేరుకున్న మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, సీపీ సజ్జనార్...

  • 17 Jun 2020 11:11 AM GMT

    ప.గో. పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్ లో వైస్సార్సీపీ పార్టీ శ్రేణులు ఎంపీ రఘురామ కృష్ణoరాజు పై నిరసన జ్వాలలు

    - వైస్సార్సీపీ పార్టీ ఎమ్ ఎల్ లు ,మంత్రుల పై ఎంపీ రఘురామ కృష్ణoరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం..

    - రఘురామకృష్ణoరాజు డౌన్ డౌన్ నినాదాలతో దిష్టి బొమ్మ దగ్ధం చేసిన ఆచంట నియోజకవర్గ నాయకులు ,కార్యకర్తలు..

    - మా నాయకుని పై లేని పోని మాటలు బురద జల్లే కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకోం..

    - నాలుక కోస్తాం అంటూ హెచ్చరించిన వైసీపీ శ్రేణులు

  • 17 Jun 2020 11:10 AM GMT

    కృష్ణాజిల్లాలో జిరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా మధిర వాసులు దుర్మరణం చెందడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

    -ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

    -గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షా.

    -మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా అధికారులను సిఎం ఆదేశం

  • 17 Jun 2020 11:05 AM GMT

    ఈ నెల 19 ఆర్టీసీ కార్గో బస్సుల ప్రారంభం

    - ఈ నెల 19 రవాణా శాఖ ఖైరతాబాద్ కార్యాలయంలో ఆర్టీసీ కార్గో బస్సులు ప్రారంభించనున్న రవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ్.

    - ఇప్పటికే కార్గో కోసం 80 బస్సులు సిద్ధం చేసిన ఆర్టీసీ.

    - లాక్ డౌన్ సమయం లో కార్గో బస్సులను పలు సేవలకు ఉపయోగించిన ఆర్టీసీ.

    - కార్గో బస్సులతో పాటు & ఆర్టీసీ పార్శిల్ సర్వీసుల ను ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ అజయ్.

    - ఇప్పటి వరకు ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నడిచే పార్శిల్ సెంటర్లు ఇక నుండి ఆర్టీసీ అన్ని బస్ స్టాండ్ లలో నడిపిస్తుంది.

Print Article
More On
Next Story
More Stories