Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు బుధవారం, 17జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ఏకాదశి ( ఉ.07:45 వరకు), అశ్వనీ నక్షత్రం (ఉ.06:04 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:51 pm

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 17 Jun 2020 4:38 PM GMT

    » కుక్కల దాడిలో జింక మృతి.


    - కృష్ణాజిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామం లో పొలాలోకి దారితప్పి వచ్చిన జింక..

    - జింక పై దాడి చేసిన వీధి కుక్కలు..

    - కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన జింక..

  • 17 Jun 2020 4:35 PM GMT

    »» మళ్ళీ ఎలాంటి లాక్ డౌన్ లు ఉండవు..

    ◆ దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు..

    ♦ దేశంలో లాక్ డౌన్ ల దశ ముగిసి, అన్ లాక్ ల దశ ప్రారంభమయిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు..

    ◆ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

  • 17 Jun 2020 4:02 PM GMT

    » తెలంగాణ లో రికార్డ్ స్థాయిలో 269 కరోన పాజిటివ్ కేసులు నమోదు..

    - ఇప్పటి వరకు 5675 కి చేరిన కేసుల సంఖ్య ..

    - ఇవాళ మరో ఒక్కరు మృతి 192 కి చేరిన మరణాల సంఖ్య...

    - 2412 అక్టీవ్ కేసులు...

    - 3071 ఇప్పటి వరకు డిచార్జి అయిన వారు..

    - జిహెచ్ఎంసి లో రికార్డ్ స్థాయి లో 214 కేసులు నమోదు

  • 17 Jun 2020 3:33 PM GMT

    »» సూర్యాపేట 

    - హాకీంపేట నుంచి బయలుదేరిన కల్నల్ సంతోష్ బాబు పార్ధివదేహం.

    - పార్ధివదేహం ను తీసుకొస్తున్న అంబులెన్స్ తోనే మంత్రి జగదీష్ రెడ్డి రాక.

    -  రాత్రి పదిన్నర కల్లా సూర్యాపేట కు చేరిక.

    - రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు ప్రజల సందర్శనార్ధం విద్యానగర్ లో సంతోష్ బాబు పార్ధివదేహం.

    -  ఆతర్వాత అంతిమ యాత్ర ప్రారంభం.

    - ఆర్మీ అధికారుల సూచనతో కోవిడ్ 19 న ప్రకారం అంతిమయాత్ర.

    - కేసారం దగ్గర లోని అర ఎకరా వ్యవసాయ క్షేత్రం లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు.

    - అంత్యక్రియలు జరిగే దగ్గరలో నూట యాభై మంది ఆర్మీ అధికారులు.

    -  కుటుంభీకులు ,బంధువులు, వివిఐపి లకు మాత్రమే అనుమతి.

    -  ప్రజలను సహకరించాలని కోరినా సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ,ఎస్పీ భాస్కరన్

  • 17 Jun 2020 3:03 PM GMT



    - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలసిన రాజోలు జనసేన శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావు.

    - కరోన విపత్తు సహకరంగా సీఎం రిలీఫండ్ కు వచ్చిన చెక్కులను సీఎం జగన్ కు అందించిన రాపాక

  • 17 Jun 2020 2:23 PM GMT

    » అమరావతి-రాజ్ భవన్

    - రోడ్డు ప్రమాద సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్

    - మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపం తెలిపిన హరిచందన్

  • 17 Jun 2020 2:23 PM GMT

    ♦ అమరావతి 

    »  పవన్ కళ్యాణ్.....జనసేన అధినేత.....

    - వేదాద్రి దగ్గరి రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికరం

    - కృష్ణా జిల్లా వేదాద్రి దగ్గర చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 12 మంది చనిపోయారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను.

    - మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

    - క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.

    - తెలంగాణలోని పెద గోపవరం గ్రామస్తులు వేదాద్రి నరసింహ స్వామి దర్శనం చేసుకొని వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకొందని తెలిసింది.

    - ప్రమాద బాధితులకు అవసరమైన సహాయం, వైద్యం విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సేవలు అందించాలని కోరుతున్నాను.

    - లారీ ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోయారంటే ఎంత తీవ్రంగా ప్రమాదం చోటుచేసుకొందో అర్థం అవుతోంది.

    - గ్రామీణ ప్రాంతాల్లో సైతం మితిమీరిన వేగంతో లారీలు, ఇసుక టిప్పర్లు, ఇతర సరుకు రవాణా వాహనాలు తిరుగుతున్నాయని, భయమేస్తోందని ప్రజలు   వాపోతున్నారు.

    - రవాణా, పోలీసు శాఖలు ఈ వేగానికి కళ్ళెం వేసి, రహదారి భద్రత నియమాలు అమలు చేయాలి.

  • 17 Jun 2020 2:20 PM GMT

    అమరావతి

    - మండలిలో గంట నుంచి గందరగోళం

    - రూల్ నెంబర్ 90 ని ఎలా అవకాశం ఇస్తారు అని మంత్రులు అభ్యంతరం

    - ఛైర్మన్ పోడియం ముందుకు వెళ్లిన అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులు

    - గందరగోళం లో డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం

  • 17 Jun 2020 2:19 PM GMT

    » బ్రేకింగ్...

    - హకీంపేట్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై...

  • 17 Jun 2020 2:17 PM GMT

    » మరికొద్ది సేపట్లో హకీమ్ పేట్ కు చేరుకోనున్న సంతోష్ బాబు పార్థివదేహం...



    - హకీమ్ పేట్ కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్.

    - ఇప్పటికే చేరుకున్న సంతోష్ బాబు కుటుంబ సభ్యులు..

    - హకీమ్ పేట్ కు వచ్చిన పలువురు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి,మేయర్ బొంతు,డిజీపీ మహేందర్ రెడ్డి,

     హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు.

    - హక్కింపెట్ ఎయిర్ ఫోర్స్ కి చేరుకున్న ప్రార్థివ దేహం.

Print Article
More On
Next Story
More Stories