Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బుధవారం, 17జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ఏకాదశి ( ఉ.07:45 వరకు), అశ్వనీ నక్షత్రం (ఉ.06:04 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:51 pm

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 17 Jun 2020 10:26 AM GMT

    కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    - జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‍ను ఢీకొన్న లారీ

    - ఏడుగురు మృతి

    - 10 మందికి తీవ్ర గాయాలు

    - ముగ్గురు పరిస్థితి విషమం

    - మృతులు ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తింపు

  • 17 Jun 2020 10:26 AM GMT

    శ్రీకాకుళం జిల్లాలో తొలి కరోనా మరణం

    - జిల్లాలో 400 దాటిన కరోనా కేసులు

    - ఒక్క శ్రీకాకుళం పట్టణంలొనే 10 కంటైన్మెంట్ జోన్లు 

    - 271 ఆక్టీవ్ కేసులు

    - మందస మండల కేంద్రం లో కరోనా తో 37 ఏళ్ల యువకుడు మృతి.

    - మృతుడు ఎటువంటి ట్రావెలింగ్ చేయలేదు.

    - కేవలం సంక్రమణం వలనే వచ్చిందంటున్న అధికారులు.

    - నేడు మందస మండల కేంద్రంకు వెల్లనున్న జిల్లా కలెక్టర్ నివాస్.

    - మందస పట్టణాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు.

  • 17 Jun 2020 10:24 AM GMT

    తూర్పు గోదావరి: రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ పై నుండి గోదావరి నదిలోకి దూకి తండ్రీకొడుకులు ఆత్మహత్యా యత్నం.

    - తండ్రి అధికారి రాజబాబును రక్షించిన మత్స్యకారులు.

    - కొడుకు అధికార సత్తిబాబు గోదావరి లో గల్లంతు.

    - కడియం మండలం మురమండ గ్రామం - దొరగారి తోట కు చెందిన తండ్రీకొడుకులు.

    - కొడుకు అధికారి సత్తిబాబు కు క్యాన్సర్ వ్యాధి అని తెలియడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు అనుమానం.

  • 17 Jun 2020 10:23 AM GMT

    సంగారెడ్డి జిల్లా మొగుడం పల్లి మండలం.

    కాశింపుర్ గ్రామంలో దారుణ హత్య కుటుంబ కలహాలతో భార్యను కత్తి తో గొంతు కోసి హత్య చేసిన భర్త.

  • 17 Jun 2020 5:29 AM GMT

    సంతోష్ అంత్యక్రియలు వారి వ్యవసాయ క్షేత్రంలో నిర్వయించాలని నిర్ణయం

    - కర్నల్ సంతోష్ ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు

    - ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ సంతోష్ తల్లిదండ్రులు ను పరామర్శిస్తున్న బందువులు, సన్నిహితులు , రాజకీయ నేతలు

    - ఒక్కక్కరిని మాత్రమే టెంపరేచర్ చెక్ చేసి లోపలకి అనుమతిస్తూన్న పోలీసులు

    - ఇంటి వద్ద కు భారీ గా చేరుకున్న సూర్యపేట్ వాసులు

  • 17 Jun 2020 5:15 AM GMT

    అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సుజాత భర్త అజయ్ కుమార్...

    - ఇటీవల అజయ్ కుమార్ ను విచారించిన ఏసీబీ..

    - అజయ్ కుమార్ స్టెస్ట్మెంట్ నమోదు చేసుకున్న ఏసీబీ...

    - తన భార్య ను అరెస్ట్ చేసిన ఏసీబీ తనను కూడా అరెస్ట్ చేస్తారని భావించిన అజయ్ కుమార్...

    - తన భార్య అరెస్ట్ తో అవమానం చెందిన భర్త అజయ్ కుమార్...

  • 17 Jun 2020 5:14 AM GMT

    అమరావతి: బుద్దా వెంకన్న ,టిడిపి ఎమ్మెల్సీ

    - కోర్టు పరిధిలో ఉన్న బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి పాస్ చేశారు.

    - మూడు రాజధానులు ఒప్పుకునే ప్రసక్తే లేదు.

    - అమరావతి రాజధానిగా కొనసాగించాలి.

    - ఈరోజు మండలిలో బిల్లులు అడ్డుకుంటాము.

    - ఎమ్మెల్సీలకు విప్ జారీ చేసాము.

    -పార్టీ నిర్ణయం మేరకు ఓటు వేయాలి.

    - విప్ దిక్కరిస్తే చర్యలు తప్పవు.

  • 17 Jun 2020 5:13 AM GMT

    అమరావతి: యనమల రామకృష్ణుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత.

    - ప్రభుత్వం మొదటి నుంచీ రాజధాని మార్పుపై దురుద్దేశంతో ఉంది.

    - సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్ లో ఉండగా మళ్లీ crda చట్టం రద్దు, వికేంద్రీకరణ బిల్లులు తీసుకురావటాన్ని వ్యతిరేకిస్తున్నాం.

    - ప్రజాభీష్టానికి ఇది వ్యతిరేకం.

    - రెండోసారి బిల్లులు పాస్ చేసి మళ్లీ మండలికి పంపటం సరికాదు.

    - ఎలాంటి సవరణలు లేకుండా మళ్లీ పాతబిల్లులు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం.

    - సెలెక్ట్ కమిటీ వద్ద బిల్లు ఉందని ఏజీ కోర్టుకు చెప్పారు.

    - కౌన్సిల్ లో బిల్లును ఎలా అడ్డుకుంటామో మీరే చూస్తారు.

  • 17 Jun 2020 5:12 AM GMT

    షేక్ పెట్ ఎమ్మార్వో భర్త ఆత్మహత్య

    - గాంధీనగర్లో ఆత్మహత్యకు పాల్పడిన సుజాత భర్త అజయ్.

    - భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న అజయ్.

    - ఇటీవలకాలంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో షేక్పేట ఎమ్మార్వో సుజాత అరెస్ట్.

    - సుజాత పై కేసు పెట్టిన ఏసీబీ..

    - సుజాత భర్త అజయ్ న్ను సైతం గతంలో విచారించిన ఏసీబీ

  • 17 Jun 2020 5:11 AM GMT

    అర్డినెన్స్ పై ఉపాద్యాయసంఘల స్పందన

    -ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, పెన్షన్లలో కోతలపై కోర్టులో సమాధానం చెప్పుకోలేక రాత్రికిరాత్రే ఆర్డినెన్స్ ను తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. TSUTF

    -ఇప్పటికే మూడు నెలలుగా వేతనాల్లో కోత వలన తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు.

    -కొతను ఇంకా కొనసాగించే ఉద్దేశ్యంతోనే ఆర్డినెన్స్.

    -ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకుని జూన్ నెలనుండి పూర్తి వేతనాలు చెల్లించాలి - టిఎస్ యుటిఎఫ్

Print Article
More On
Next Story
More Stories