Live Updates: ఈరోజు (ఆగస్ట్-31) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 31 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం త్రయోదశి (ఉ. 8-35 వరకు) తదుపరి చతుర్దశి. శ్రవణ నక్షత్రం (మ. 3-53 వరకు) తదుపరి ధనిష్ఠ, అమృత ఘడియలు (ఉ. 6-57 వరకు) వర్జ్యం (రా. 8-02 నుంచి 9-42 వరకు) దుర్ముహూర్తం (మ. 12-25 నుంచి 1-15 వరకు తిరిగి మ.2-54 నుంచి 3-44 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-13

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • East Godavari updates: లంపకలోవ సహకార పరపతి సంఘం జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి..
    31 Aug 2020 6:21 AM GMT

    East Godavari updates: లంపకలోవ సహకార పరపతి సంఘం జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి..

    తూర్పుగోదావరి... ప్రత్తిపాడు..

    -లంపకలోవ సహకార పరపతి సంఘం జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి

    -మోసపోయిన రైతులను ఆదుకోవాలి..

    -మోసానికి కారణమైన డిసిసిబి చైర్మన్ వరుపుల రాజాని అరెస్టు చేయాలంటూ మోసపోయిన రైతులు ఆందోళన.

  • East Godavari district updates: ప్రత్తిపాడు మం లంపకలోవ సొసైటీ అవినీతిలో..
    31 Aug 2020 6:11 AM GMT

    East Godavari district updates: ప్రత్తిపాడు మం లంపకలోవ సొసైటీ అవినీతిలో..

    తూర్పుగోదావరి జిల్లా..

    -ప్రత్తిపాడు మం లంపకలోవ సొసైటీ అవినీతిలో..

    -బాద్యులను వెంటనే అరెస్టు చేయాలన్న డిమాండ్తో రిలే నిరాహార దీక్ష చేపట్టిన ఆ సంఘం అధ్యక్షుడు గొంతిన సురేష్ , రైతులు

    -సంఘంలో జరిగిన ఆర్దిక లావాదేవీల్లో సొసొటీ మాజీ అధ్యక్షుడు రైతుల సొమ్ములు రూ.16 కోట్ల 50 లక్షలను స్వాహా చేశారు -

    -ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ నేత, డిసిసిబి మాజీ చైర్మన్ వరుపుల రాజాపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైంది

    -నేపధ్యంలో దోషులను త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వారిని చట్ట ప్రకారం శిక్షించాలని ధర్నా చేపట్టిన గొంతిన సురేష్

    -సొసైటీలో నష్టపోయిన, రైతులకు సకాలంలో తగు న్యాయం చేయాలి - సొసైటీ అధ్యక్షులు సురేష్

  • Krishna district updates: ముసునూరు మండలం వలసపల్లిలో దారుణం..
    31 Aug 2020 5:53 AM GMT

    Krishna district updates: ముసునూరు మండలం వలసపల్లిలో దారుణం..

    కృష్ణాజిల్లా..

    -ముసునూరు మండలం వలసపల్లిలో దారుణం

    -వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారని భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త నవీన్ బాబు.

    -తనకు తెలియకుండా 1లక్షా 50 వేలకు పాపను అమ్మాడని భర్త నవీన్ బాబు పై స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య రజనీ

    -బిడ్డ ఎక్కడని నిలదీసిన భార్య రజనీ పై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డ భర్త ,అత్త మామలు

    -బిడ్డ అమ్మకంపై ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన రజనీ తల్లిదండ్రులు.

    -తన బిడ్డను తనకు ఇప్పించాలని నూజివీడు ఎమ్మెల్యే ని ఆశ్రయించిన తల్లి రజినీ

    -నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో పిల్లను పెంచుకుంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఐసిడిఎస్ అధికారులు సమక్షంలో పాపను స్వాధీనం   చేసుకున్న ముసునూరు పోలీసులు

    -పాపను స్వాధీనం చేసుకున్న సమయంలో విచారించిన పోలీసులు

    -మూడు రోజుల పాపను దూరపు బంధువులు అవడంతో పెంచుకోవటానికి తమకు ఇచ్చారని చెబుతోన్న పెంపుడు తల్లి దండ్రులు

    -జరిగి ఏడాది అయిందనీ, తాము ఎలాంటి డబ్బులు ఇచ్చి కొనలేదని చెప్తున్న పెంపుడు తల్లిదండ్రులు

    -రజనీ, నవీన్ దంపతులకు నలుగురు ఆడ పిల్లలు

  • East Godavari updates: రాజోలు (మం) వేగివారి పాలెంలో కోడి పందాలపై పోలీసులు దాడి..
    31 Aug 2020 5:47 AM GMT

    East Godavari updates: రాజోలు (మం) వేగివారి పాలెంలో కోడి పందాలపై పోలీసులు దాడి..

    తూ.గో.జిల్లా....

    -రాజోలు (మం) వేగివారి పాలెంలో కోడి పందాలపై పోలీసులు దాడి.

    -ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    -రెండు కోళ్లు, 6300 నగదు స్వాధీనం.

  • Vijayawada updates: దళితులకు చంద్రబాబు మోసం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు..
    31 Aug 2020 5:41 AM GMT

    Vijayawada updates: దళితులకు చంద్రబాబు మోసం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు..

    విజయవాడ..

    -దళితులకు చంద్రబాబు మోసం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు..

    -అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం, వినతి పత్రాలు సమర్పించిన వైస్సార్సీపీ నేతలు..

    -14 ఏళ్ళు అధికారంలో ఉండగా ఏనాడు దళితులను చంద్రబాబు పట్టించుకోలేదు.. వైస్సార్సీపీ దళిత నేతలు..

    -దళితులకు దక్కాల్సిన సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారు..

    -అధికారం పోయాక దళితులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారు..

    -అమరావతిలో దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు అడ్డుకున్నారు..

    -దళితులు ఇంగ్లీషు మీడియం చదవకుండా అడ్డుపడ్డారు..

    -తన హయాంలో దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు నోరు మెడపలేదు..

    -దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని అవమానించారు.... వైస్సార్సీపీ దళిత నేతలు..

  • Visakhapatnam updates: చోడవరం వైసిపి శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ కామెంట్స్
    31 Aug 2020 5:36 AM GMT

    Visakhapatnam updates: చోడవరం వైసిపి శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ కామెంట్స్

    విశాఖ..

    -చోడవరం వైసిపి శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ కామెంట్స్

    -శిరోముండనం కేసులో ప్రభుత్వం నిజాయితీగా దర్యాప్తు చేస్తుంది.

    -ఎవ్వరినైనా వదిలి పెట్టేదిలేదు.

    -చంద్రబాబు నాయుడు దళితులపై కపటప్రేమ చూపిస్తున్నాడు.

    -చంద్రబాబు నాయుడుని ప్రజలు తిరస్కరించడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారు.

    -టిడిపి హయాంలో దళితులపై జరిగిన అరాచకాలు ప్రజలు మర్చిపోలేదు.

    -విశాఖను తెలుగుదేశం పార్టీ,వారినాయకులు నాశనం చేశారు.

    -దళితులు గర్వపడేలా అనేక కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వం చేస్తుంది.

    -విశాఖలో శిరోముండనం కేసులో 12 గంటలలో దోషులు లను అరెస్ట్ చేసాం.

    -నూతననాయుడుకి, వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధంలేదు.

    -దోషులను మా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది.

    -వైసీపీ ప్రభుత్వo చేస్తున్న అభివృద్ధిని చూడలేకే చంద్రబాబు మా పార్టీ పై బురదజల్లుతున్నారు.

  • East Godavari updates: ఎయిర్‌లైన్‌ సంస్థలో ఉద్యోగం పేరిట మోసం..
    31 Aug 2020 5:30 AM GMT

    East Godavari updates: ఎయిర్‌లైన్‌ సంస్థలో ఉద్యోగం పేరిట మోసం..

    తూర్పుగోదావరి..

    -ఎయిర్‌లైన్‌ సంస్థలో ఉద్యోగం పేరిట ఆన్‌లైన్‌లో ప్రకటనను చూసిన రాజమహేంద్రవరం శ్యామలానగర్‌ ప్రాంతానికి చెందిన గృహిణి కె.విశాలాక్షి మోసపోయింది

    -ఆ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌

    -పలు దఫాలుగా రూ.76 వేల నగదును ఆన్‌లైను ద్వారా ఆమె నుంచి అతడి ఖాతాకు జమ చేయించుకున్నాడు.

    -అనంతరం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు రావాలని ఒక ఈమెయిల్‌ పంపించాడు.

    -ఆమె రాజమండ్రి- ఎయిర్ పోర్టుకు వెళ్లి ఆరాతీయగా అటువంటి ఉద్యోగం లేదని తేల్చిచెప్పారు

    -దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన ప్రకాశ్‌నగర్‌ కు చెందిన ఆ గృహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది..

  • Vijayawada updates:  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్..
    31 Aug 2020 5:25 AM GMT

    Vijayawada updates: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్..

    విజయవాడ..

    -గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

    -భారత్‌కు తొలి స్వర్ణం అందించిన చదరంగ క్రీడాకారులకు అభినందనలు

    -రష్యాలో జరిగిన ఫైడ్‌ ఆన్‌లైన్‌ చెస్‌ ఒలంపియాడ్‌లో తొలిసారి స్వర్ణం సాధించి కొత్త రికార్డు సృష్టించటం ముదావహం

    -అనితర సాధ్యమైన

    -వ్యూహాలతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విశ్వనాథన్ ఆనంద్, కొనేరు హంపి, ద్రోణవల్లి హారిక, హరికృష్ణ తదితరులు అభినందనీయులు

    -చదరంగ క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలి

  • East Godavari updates: రాజమండ్రి లో పోలీసుల పేరుతో కొందరు దుండగుల మోసాలు..
    31 Aug 2020 5:19 AM GMT

    East Godavari updates: రాజమండ్రి లో పోలీసుల పేరుతో కొందరు దుండగుల మోసాలు..

    తూర్పుగోదావరి..

    -రాజమండ్రి లో పోలీసుల పేరుతో కొందరు దుండగుల మోసాలు

    -జాతీయ రహదారిపై పోలీసులమని చెప్పి ఇద్దరి నుంచి రూ.2వేలు లాక్కొని పరారైన ఘటన

    -బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన-రంగపేట మండలం ముకుందవరం గ్రామానికి చెందిన బి.సురేష్‌

    -ఆటోనగర్‌ సమీపాన్న వర్షం వర్షం వస్తుందని రోడ్డు పక్కన ఓ చెట్టు వద్ద నిలబడ్డ సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రెండువేలు లాక్కుల్లారు

    -తాము బొమ్మూరు పోలీసు స్టేషన్‌ కానిస్టేబుళ్లమని చెప్పారని ఫిర్యాదు లో పేర్కొన్న సురేష్

    -కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం

    -ఎస్ఐ జగన్‌మోహన్‌రావు

  • Amaravati updates: ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...
    31 Aug 2020 5:08 AM GMT

    Amaravati updates: ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...

    అమరావతి..

    -ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...

    -మలయాళీల ఘనమైన సంస్కృతీ వారసత్వానికి ప్రతీక ఓనం పండుగ.

    -ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న మలయాళీ సోదరులందరికీ శుభాకాంక్షలు.

    -మీ ఇంట ఈ ఆనంద సిరులు శాశ్వతంగా ఉండిపోవాలని మనసారా కోరుకుంటున్నాను.

Print Article
Next Story
More Stories