Live Updates: ఈరోజు (30 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 30 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి సా.4-54 తదుపరి పూర్ణిమ | రేవతి నక్షత్రం మ.3-15 తదుపరి అశ్విని | వర్జ్యం లేదు | అమృత ఘడియలు మ.12-36 నుంచి 2-22 వరకు | దుర్ముహూర్తం ఉ.8-18 నుంచి 9-03 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 30 Oct 2020 3:59 PM IST
Krishna District Updates: నారా లోకేష్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు...
కృష్ణాజిల్లా
-లోకేష్ లాంటి వెస్ట్ మనిషిని మేము ఎక్కడ చూడలేదు
-వరి చేనుకి చెపల చెరువు కు తేడ తెలియని వ్యక్తి లోకేష్
-లోకేష్ అనే వ్యక్తి ఎక్కడ తిరిగినా , ఉపయోగం లేదు
-దేశంలో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రధానమంత్రి తో పాటు ముఖ్యమంత్రులు ఏరియల్ సర్వే ద్వారా తీవ్రత ను తెలుసుకుంటారు
-చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఎక్కడ తిరిగాడు
-చంద్రబాబు నాయుడు కరోనా భయం తో ఇంట్లో కూర్చుని , చెపల చెరువు కు , వరిచేనుకు తేడా తేలియని సన్నాసిని ,దద్దమ్మని పంపించాడని, వాళ్ళు పార్టీ నాయకులే చెబుతున్నారు
-కనీసం ఇంగితజ్జానం లేని వ్యక్తి నారా లోకేష్
-కనీసం శాసన సభ్యులు గా కూడా గెలవలేని పరమ వెస్ట్, లూచ్చాగాడు లోకేష్
-లోకేష్, సీఎం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ది చెబుతాం
-లోకేష్ కు ఇప్పటికే కొవ్వు కరిగింది ఇంకా కళ్ళు నెత్తిమీద ఉన్నాయి, అవి కూడా కిందకు దించుతాం
-చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంటు చార్జీలు తగ్గించమంటే బషీర్ బాగ్ దగ్గర రైతులపై పోలీసులతో కాల్పులు జరిపాడు
-రైతులకు సంకెళ్లు వేశారని, నువ్వు వేసుకోవడం కాదు దేవినేని ఉమ.... చంద్రబాబు రైతుల పై కాల్పులు జరిపాడు కాబట్టి, గన్ తో కాల్చుచుకుని బషీర్ బాగ్ ఘటన ప్రజలకు చెపితే బాగుంటుంది
-గుంటూరు లో జరిగిన ఘటన లో రైతులు పోలీస్ సిబ్బంది మీద తిరగబడితే సంకెళ్లు వేశామని చెప్పారు
-వారి మీద ప్రభుత్వం ఇప్పటి కే చర్యలు తీసుకుంది
-ఈ రాష్ట్రంలో అమరావతి లోనే రైతులు, ఇతర ప్రాంతాలలో రైతులు కాదన్నట్లు చంద్రబాబు వ్యహరిస్తున్నాడు
-అమరావతిలో చంద్రబాబు, రైతులను అడ్డంపెట్టుకుని గోతికాడ నక్కల లాగా బతకాలని చూస్తున్నాడు
- 30 Oct 2020 3:55 PM IST
Krishna District Updates: వినూత్నంగా మద్యం అక్రమ రవాణా....
కృష్ణాజిల్లా
-తెలంగాణ నుంచి పరుపుల్లో మద్యం బాటిల్స్
-టాటా ఏసీ వాహనంలో తెనాలికి తరలిస్తున్న అక్రమ మద్యం
-గరికపాడు చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
-జగ్గయ్యపేట మండలం లో మూడు కేసుల్లో 1000 అక్రమ మద్యం బాటిల్స్ పట్టివేత
-ఆరు లక్షల నగదు, నాలుగు వెహికల్స్, ఏడుగురిని అదుపులోకి తీసుకున్న కృష్ణాజిల్లా అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్
- 30 Oct 2020 3:53 PM IST
Dharmana Krishna Das: వ్యవసాయం, విద్యా, వైద్యం మనిషికి ప్రధాన అవసరాలు అని నెహ్రూ గారి సమయంలొనే చెప్పారు..
శ్రీకాకుళం జిల్లా..
- ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..
- - గత ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబు వీటన్నింటిని ఎందుకు పట్టించుకోలేదు ?
- ఈరోజు రాష్ట్రం అధోగతిపాలు అయిపోయిందని చంద్రబాబు అంటున్నారు..
- రైతులకు రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యా దీవెని ఇస్తుంటే అధోగతిపాలైనట్లా చంద్రబాబు చెప్పాలి..
- వైసిపి ప్రభుత్వం ఏమి జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేయలేదు..
- ప్రాంతాలు, పార్టీలు, వర్గాలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం..
- టిడిపి వాళ్ళకి కూడా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తూ పారదర్శకంగా పరిపాలన సాగిస్తున్నాం..
- 30 Oct 2020 3:49 PM IST
Srisailam Project Updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద...
కర్నూలు జిల్లా....
- 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
- ఇన్ ఫ్లో : 84,063 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 1,04,100 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
- ప్రస్తుతం : 884.90 అడుగులు
- పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
- ప్రస్తుతం: 215.3263 టీఎంసీలు
- కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 30 Oct 2020 3:45 PM IST
Srikakulam Updates: స్వగ్రామం చేరుకున్న లిబియా బాధితులు..
శ్రీకాకుళం జిల్లా..
- గత నెల లిబియా నుంచి స్వగ్రామానికి తిరుగు ప్రయాణం సమయంలో అపహరణకు గురైన ముగ్గురు శ్రీకాకుళం యువకులు..
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఉగ్రవాదుల చెర నుంచి బయటపడి యువకులు..
- స్వగ్రామం సీతానగరం చేరుకున్న యువకులు..
- ఉగ్రవాదుల చెర నుంచి బయటపడి స్వగ్రామానికి చేరుకున్న యువకులకు ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు, కుటుంబ సభ్యులు..
- జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ను కలిసిన యువకులు..
- 30 Oct 2020 3:36 PM IST
Guntur District updates: తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో బీజేపీ ఆందోళన...
గుంటూరు జిల్లా, తెనాలి
- గ్రామంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న బిజెపి జెండా దిమ్మను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
- నిరసనగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన
- ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు
- ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించి నిరసన చేపట్టిన పార్టీ శ్రేణులు
- జెండా దిమ్మ ధ్వంసం చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్
- సంఘటనా స్థలానికి చేరుకున్న తాలూకా సిఐ అశోక్ కుమార్
- దుండగులను అరెస్టు చేస్తామన్న సిఐ హామీతో ఆందోళన విరమించిన పార్టీ నాయకులు
- 30 Oct 2020 3:33 PM IST
Nandigam Suresh: రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడుతున్నారు...
అమరావతి.....
- నందిగం సురేష్, ఎంపీ, బాపట్ల
- మూడు రాజధానులకు మద్దతుగా వచ్చిన వారిని అడ్డుకుని దాడికి దిగారు
- తప్పు ఎక్కడ జరిగినా తప్పేకానీ వాళ్ళని అమరావతి రైతులని నా నా యాగీ చేస్తున్నారు
- దళితులు అంటూ గొడవ చేస్తున్నారు
- ఆనాడు అసైన్మెంట్ ల్యాండ్ రైతులపై చంద్రబాబు చేసిన దుర్మార్గాలను ఎప్పుడైనా ప్రశ్నించారా
- ఇప్పుడు కూడా ఒక దళిత ఎంపీ పై రాడ్లతో దాడికి దిగితే మీరెందుకు మాట్లాడలేదు
- దళితులను అడ్డుపెట్టి కుట్రలు చేస్తున్నది చంద్రబాబు కాదా
- బేడీలు వేశారని తెలిసింది...అన్యాయం అనిపించింది...వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశారు
- బషీర్ బాగ్ కాల్పుల్లో ఎంతమందినో పొట్టన పెట్టుకున్న ఘనత చంద్రబాబుది
- ఇళ్ల స్థలాల ఆందోళన వాళ్ళది...మీ ఆందోళన మీది...మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు..?
- వాళ్ళిద్దరిని ఎప్పుడో నడిరోడ్డుపై నిలబెట్టారు..ముందు ఆ విషయం తెలుసుకుని లోకేష్ మాట్లాడితే మంచిది
- 30 Oct 2020 3:09 PM IST
Kurnool District updates: TTC విద్యార్థులకు పరీక్షలకు అనుమతించాలని కోరుతూ టిటిసి మేనేజ్మెంట్ ..
కర్నూలు జిల్లా...
- నంద్యాల TTC మేనేజ్మెంట్ విద్యార్థులకు పరీక్షలకు అనుమతించాలని కోరుతూ టిటిసి మేనేజ్మెంట్ ..
- డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున మున్సిపల్ ఆఫీస్ వద్ద నుంచి MLA ఇంటి వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థి సంఘాలు
- అనంతరం MLA ఇంటి వద్ద ధర్నా నిర్వహించి ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందచేశారు.
- 30 Oct 2020 3:05 PM IST
Nellore District Updates: స్థానిక సంస్థలు ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం కుదరదు.....
నెల్లూరు :--
-స్థానిక ఎన్నికల పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్
-కోవిడ్ దృష్టి లో పెట్టుకొని ఎన్నికలు సాద్యం కాదు...
-చంద్రబాబు చెప్పినట్టు ఇక్కడ జరగవు..
-ఎన్నికల కమిషన్, ప్రభుత్వం కలిసి సమన్వయం తో ముందుకెళ్లాలి...
-ఏకపక్ష నిర్ణయాలు కుదరదు....
- 30 Oct 2020 2:59 PM IST
Ananthapur District Updates: తాడిపత్రి మండలం బొందలదిన్నె వంగానూరు గ్రామ రైతుల విషయంలో మానవత్వం తో పరిశీలించండి...
అనంతపురం: జేసీ ప్రభాకర్ రెడ్డి పీసీ:
-తాడిపత్రి మండలం బొందలదిన్నె వంగానూరు గ్రామ రైతుల విషయంలో మానవత్వం తో పరిశీలించండి.
-అప్పట్లో ఫ్యాక్టరీ కోసం భూములు రైతులతో ఓ కంపెనీ తీసుకుంది. పలు కారణాలతో వెనక్కి వెళ్ళింది.
-కొన్న వారికి రూ.20 వేలు లాభాలతో రైతులకు ఇవ్వండి.
-ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలి. ఎమ్మెల్యే ఏ బాష లో చెప్పిన అర్థం కాదు.
-జగన్ లాగా సలహాదారు లను పెట్టుకో.. చేతనైతే రైతులకు సాయం చెయ్యి.
-నేను కోర్టుకు వెళితే కొన్నోడు స్పాయిల్ అవుతాడు.
-నేను అలా చేయదలుచుకోలేదు.
-విజ్ఞప్తి చేస్తున్నా రైతులకు సాయం చేయండి.
-నా కేసులపై కర్ణాటక లో లోకాయుక్తా లో కేసులు వేశారు.
-ఇక్కడ రాత్రికి వచ్చి ఎత్తుకెళ్ళి జైల్లో వేశారు.
-ఇక్కడ న్యాయం లేదు













