Live Updates: ఈరోజు (30 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 30 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి సా.4-54 తదుపరి పూర్ణిమ | రేవతి నక్షత్రం మ.3-15 తదుపరి అశ్విని | వర్జ్యం లేదు | అమృత ఘడియలు మ.12-36 నుంచి 2-22 వరకు | దుర్ముహూర్తం ఉ.8-18 నుంచి 9-03 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 30 Oct 2020 10:29 AM GMT
Krishna District Updates: నారా లోకేష్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు...
కృష్ణాజిల్లా
-లోకేష్ లాంటి వెస్ట్ మనిషిని మేము ఎక్కడ చూడలేదు
-వరి చేనుకి చెపల చెరువు కు తేడ తెలియని వ్యక్తి లోకేష్
-లోకేష్ అనే వ్యక్తి ఎక్కడ తిరిగినా , ఉపయోగం లేదు
-దేశంలో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రధానమంత్రి తో పాటు ముఖ్యమంత్రులు ఏరియల్ సర్వే ద్వారా తీవ్రత ను తెలుసుకుంటారు
-చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఎక్కడ తిరిగాడు
-చంద్రబాబు నాయుడు కరోనా భయం తో ఇంట్లో కూర్చుని , చెపల చెరువు కు , వరిచేనుకు తేడా తేలియని సన్నాసిని ,దద్దమ్మని పంపించాడని, వాళ్ళు పార్టీ నాయకులే చెబుతున్నారు
-కనీసం ఇంగితజ్జానం లేని వ్యక్తి నారా లోకేష్
-కనీసం శాసన సభ్యులు గా కూడా గెలవలేని పరమ వెస్ట్, లూచ్చాగాడు లోకేష్
-లోకేష్, సీఎం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ది చెబుతాం
-లోకేష్ కు ఇప్పటికే కొవ్వు కరిగింది ఇంకా కళ్ళు నెత్తిమీద ఉన్నాయి, అవి కూడా కిందకు దించుతాం
-చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంటు చార్జీలు తగ్గించమంటే బషీర్ బాగ్ దగ్గర రైతులపై పోలీసులతో కాల్పులు జరిపాడు
-రైతులకు సంకెళ్లు వేశారని, నువ్వు వేసుకోవడం కాదు దేవినేని ఉమ.... చంద్రబాబు రైతుల పై కాల్పులు జరిపాడు కాబట్టి, గన్ తో కాల్చుచుకుని బషీర్ బాగ్ ఘటన ప్రజలకు చెపితే బాగుంటుంది
-గుంటూరు లో జరిగిన ఘటన లో రైతులు పోలీస్ సిబ్బంది మీద తిరగబడితే సంకెళ్లు వేశామని చెప్పారు
-వారి మీద ప్రభుత్వం ఇప్పటి కే చర్యలు తీసుకుంది
-ఈ రాష్ట్రంలో అమరావతి లోనే రైతులు, ఇతర ప్రాంతాలలో రైతులు కాదన్నట్లు చంద్రబాబు వ్యహరిస్తున్నాడు
-అమరావతిలో చంద్రబాబు, రైతులను అడ్డంపెట్టుకుని గోతికాడ నక్కల లాగా బతకాలని చూస్తున్నాడు
- 30 Oct 2020 10:25 AM GMT
Krishna District Updates: వినూత్నంగా మద్యం అక్రమ రవాణా....
కృష్ణాజిల్లా
-తెలంగాణ నుంచి పరుపుల్లో మద్యం బాటిల్స్
-టాటా ఏసీ వాహనంలో తెనాలికి తరలిస్తున్న అక్రమ మద్యం
-గరికపాడు చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
-జగ్గయ్యపేట మండలం లో మూడు కేసుల్లో 1000 అక్రమ మద్యం బాటిల్స్ పట్టివేత
-ఆరు లక్షల నగదు, నాలుగు వెహికల్స్, ఏడుగురిని అదుపులోకి తీసుకున్న కృష్ణాజిల్లా అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్
- 30 Oct 2020 10:23 AM GMT
Dharmana Krishna Das: వ్యవసాయం, విద్యా, వైద్యం మనిషికి ప్రధాన అవసరాలు అని నెహ్రూ గారి సమయంలొనే చెప్పారు..
శ్రీకాకుళం జిల్లా..
- ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..
- - గత ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబు వీటన్నింటిని ఎందుకు పట్టించుకోలేదు ?
- ఈరోజు రాష్ట్రం అధోగతిపాలు అయిపోయిందని చంద్రబాబు అంటున్నారు..
- రైతులకు రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యా దీవెని ఇస్తుంటే అధోగతిపాలైనట్లా చంద్రబాబు చెప్పాలి..
- వైసిపి ప్రభుత్వం ఏమి జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేయలేదు..
- ప్రాంతాలు, పార్టీలు, వర్గాలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం..
- టిడిపి వాళ్ళకి కూడా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తూ పారదర్శకంగా పరిపాలన సాగిస్తున్నాం..
- 30 Oct 2020 10:19 AM GMT
Srisailam Project Updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద...
కర్నూలు జిల్లా....
- 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
- ఇన్ ఫ్లో : 84,063 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 1,04,100 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
- ప్రస్తుతం : 884.90 అడుగులు
- పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
- ప్రస్తుతం: 215.3263 టీఎంసీలు
- కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 30 Oct 2020 10:15 AM GMT
Srikakulam Updates: స్వగ్రామం చేరుకున్న లిబియా బాధితులు..
శ్రీకాకుళం జిల్లా..
- గత నెల లిబియా నుంచి స్వగ్రామానికి తిరుగు ప్రయాణం సమయంలో అపహరణకు గురైన ముగ్గురు శ్రీకాకుళం యువకులు..
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఉగ్రవాదుల చెర నుంచి బయటపడి యువకులు..
- స్వగ్రామం సీతానగరం చేరుకున్న యువకులు..
- ఉగ్రవాదుల చెర నుంచి బయటపడి స్వగ్రామానికి చేరుకున్న యువకులకు ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు, కుటుంబ సభ్యులు..
- జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ను కలిసిన యువకులు..
- 30 Oct 2020 10:06 AM GMT
Guntur District updates: తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో బీజేపీ ఆందోళన...
గుంటూరు జిల్లా, తెనాలి
- గ్రామంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న బిజెపి జెండా దిమ్మను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
- నిరసనగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన
- ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు
- ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించి నిరసన చేపట్టిన పార్టీ శ్రేణులు
- జెండా దిమ్మ ధ్వంసం చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్
- సంఘటనా స్థలానికి చేరుకున్న తాలూకా సిఐ అశోక్ కుమార్
- దుండగులను అరెస్టు చేస్తామన్న సిఐ హామీతో ఆందోళన విరమించిన పార్టీ నాయకులు
- 30 Oct 2020 10:03 AM GMT
Nandigam Suresh: రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడుతున్నారు...
అమరావతి.....
- నందిగం సురేష్, ఎంపీ, బాపట్ల
- మూడు రాజధానులకు మద్దతుగా వచ్చిన వారిని అడ్డుకుని దాడికి దిగారు
- తప్పు ఎక్కడ జరిగినా తప్పేకానీ వాళ్ళని అమరావతి రైతులని నా నా యాగీ చేస్తున్నారు
- దళితులు అంటూ గొడవ చేస్తున్నారు
- ఆనాడు అసైన్మెంట్ ల్యాండ్ రైతులపై చంద్రబాబు చేసిన దుర్మార్గాలను ఎప్పుడైనా ప్రశ్నించారా
- ఇప్పుడు కూడా ఒక దళిత ఎంపీ పై రాడ్లతో దాడికి దిగితే మీరెందుకు మాట్లాడలేదు
- దళితులను అడ్డుపెట్టి కుట్రలు చేస్తున్నది చంద్రబాబు కాదా
- బేడీలు వేశారని తెలిసింది...అన్యాయం అనిపించింది...వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశారు
- బషీర్ బాగ్ కాల్పుల్లో ఎంతమందినో పొట్టన పెట్టుకున్న ఘనత చంద్రబాబుది
- ఇళ్ల స్థలాల ఆందోళన వాళ్ళది...మీ ఆందోళన మీది...మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు..?
- వాళ్ళిద్దరిని ఎప్పుడో నడిరోడ్డుపై నిలబెట్టారు..ముందు ఆ విషయం తెలుసుకుని లోకేష్ మాట్లాడితే మంచిది
- 30 Oct 2020 9:39 AM GMT
Kurnool District updates: TTC విద్యార్థులకు పరీక్షలకు అనుమతించాలని కోరుతూ టిటిసి మేనేజ్మెంట్ ..
కర్నూలు జిల్లా...
- నంద్యాల TTC మేనేజ్మెంట్ విద్యార్థులకు పరీక్షలకు అనుమతించాలని కోరుతూ టిటిసి మేనేజ్మెంట్ ..
- డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున మున్సిపల్ ఆఫీస్ వద్ద నుంచి MLA ఇంటి వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థి సంఘాలు
- అనంతరం MLA ఇంటి వద్ద ధర్నా నిర్వహించి ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందచేశారు.
- 30 Oct 2020 9:35 AM GMT
Nellore District Updates: స్థానిక సంస్థలు ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం కుదరదు.....
నెల్లూరు :--
-స్థానిక ఎన్నికల పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్
-కోవిడ్ దృష్టి లో పెట్టుకొని ఎన్నికలు సాద్యం కాదు...
-చంద్రబాబు చెప్పినట్టు ఇక్కడ జరగవు..
-ఎన్నికల కమిషన్, ప్రభుత్వం కలిసి సమన్వయం తో ముందుకెళ్లాలి...
-ఏకపక్ష నిర్ణయాలు కుదరదు....
- 30 Oct 2020 9:29 AM GMT
Ananthapur District Updates: తాడిపత్రి మండలం బొందలదిన్నె వంగానూరు గ్రామ రైతుల విషయంలో మానవత్వం తో పరిశీలించండి...
అనంతపురం: జేసీ ప్రభాకర్ రెడ్డి పీసీ:
-తాడిపత్రి మండలం బొందలదిన్నె వంగానూరు గ్రామ రైతుల విషయంలో మానవత్వం తో పరిశీలించండి.
-అప్పట్లో ఫ్యాక్టరీ కోసం భూములు రైతులతో ఓ కంపెనీ తీసుకుంది. పలు కారణాలతో వెనక్కి వెళ్ళింది.
-కొన్న వారికి రూ.20 వేలు లాభాలతో రైతులకు ఇవ్వండి.
-ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలి. ఎమ్మెల్యే ఏ బాష లో చెప్పిన అర్థం కాదు.
-జగన్ లాగా సలహాదారు లను పెట్టుకో.. చేతనైతే రైతులకు సాయం చెయ్యి.
-నేను కోర్టుకు వెళితే కొన్నోడు స్పాయిల్ అవుతాడు.
-నేను అలా చేయదలుచుకోలేదు.
-విజ్ఞప్తి చేస్తున్నా రైతులకు సాయం చేయండి.
-నా కేసులపై కర్ణాటక లో లోకాయుక్తా లో కేసులు వేశారు.
-ఇక్కడ రాత్రికి వచ్చి ఎత్తుకెళ్ళి జైల్లో వేశారు.
-ఇక్కడ న్యాయం లేదు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire