Live Updates: ఈరోజు (30 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (30 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 30 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి సా.4-54 తదుపరి పూర్ణిమ | రేవతి నక్షత్రం మ.3-15 తదుపరి అశ్విని | వర్జ్యం లేదు | అమృత ఘడియలు మ.12-36 నుంచి 2-22 వరకు | దుర్ముహూర్తం ఉ.8-18 నుంచి 9-03 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Amaravati Updates: ఆడలేక మద్దెల వోడు అన్నట్లు ఉంది వైసీపీ ప్రభుత్వ తీరు..
    30 Oct 2020 12:54 PM GMT

    Amaravati Updates: ఆడలేక మద్దెల వోడు అన్నట్లు ఉంది వైసీపీ ప్రభుత్వ తీరు..

    అమరావతి..

     బోండా ఉమా

    (టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్)

    - పేదల ఇళ్ళ స్థలాల విషయంలో టీడీపీ ఏ కోర్టు లో కేసు వేసిందో చెప్పాలి

    - స్పీకర్ స్థానంలో వున్న తమ్మినేని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

    - పేదల ఇళ్ళ స్థలాల పేరుతో 4000 కోట్లు వైసీపీ నాయకులు కొట్టేశారు

    - అతి పెద్ద అవినీతి పేదల ఇళ్ళ స్థలాలులో జరిగింది వాస్తవం కాదా?

    - ఇళ్ళస్థలాల అవినీతిపై వైసీపీ ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదు

  • West Godavari Updates: ఏలూరులో ఏఆర్ ఎస్సై పై ఆకతాయిల దాడి..
    30 Oct 2020 12:49 PM GMT

    West Godavari Updates: ఏలూరులో ఏఆర్ ఎస్సై పై ఆకతాయిల దాడి..

    పశ్చిమ గోదావరి..

    - పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో ఘటన

    - యువతిని వేధించిన ఆకతాయిలను ఎస్సై మందలించడంతో ఎదురుదాడి

    - యువతి, ఏఆర్ ఎస్సై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

    - దాడికి పాల్పడ్డవారు స్థానిక రాజకీయ పార్టీ నేత అనుచరులు కావడంతో

    - ఎంతటివారైనా శిక్షించాలని త్రి టౌన్ పీఎస్ కు భారీగా చేరుకున్న ఏఆర్ సిబ్బంది

    - పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు, త్రి టౌన్ వద్ద ఉద్రిక్తత

  • Rajahmundry Updates: పోలవరం అంశంపై రాజమండ్రిలో జనసేన మీడియా సమావేశం...
    30 Oct 2020 12:43 PM GMT

    Rajahmundry Updates: పోలవరం అంశంపై రాజమండ్రిలో జనసేన మీడియా సమావేశం...

    తూర్పుగోదావరి -రాజమండ్రి:

    - జనసేన పార్టీకి బి.జె.పి కేంద్ర నాయకత్వంతో ఉన్న అనుబంధంతో పోలవరంకు నిధుల ప్రతిష్టంభనపై ఒప్పించే ప్రయత్నం చేస్తాం

    - త్వరలో మంగళగిరి జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పోలవరం అంశంపై సమావేశం

    - నాడు టి.డి,పి, నేడు వై.సి.పి ప్రభుత్వాలు రెండూ పోలవరం ఖర్చుపై కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్లే సమస్య వస్తోంది

    - మంత్రి బొత్స చెప్పినట్లు పోలవరం ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వం భరించినా మంచిదే

    - నవరత్నాలకు ఇచ్చిన ప్రాధాన్యం పోలవరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాలి

    ------- కందులదుర్గేష్, జనసేన ముఖ్య అధికార ప్రతినిధి

  • Kakinada updates: నగరంలో జగన్నాయక్ పూర్ పెట్రోలు బంకు వద్ద మహిళల నిరసన..
    30 Oct 2020 12:37 PM GMT

    Kakinada updates: నగరంలో జగన్నాయక్ పూర్ పెట్రోలు బంకు వద్ద మహిళల నిరసన..

    తూర్పుగోదావరి:

    - ప్రేమ పేరుతో తల్లిని చేసి పెళ్లి కి ముఖం చాటేసిన పెట్రోలు బంకు ఓనర్ కర్రి కిరణ్ పాల్ రెడ్డి.

    - 2018 లో ఫేస్ బుక్ లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు కు చెందిన బలే శ్రీదేవి అనే యువతిని పరిచయం చేసుకున్న కిరణ్ పాల్ రెడ్డి.

    - ప్రేమ పేరుతో శ్రీదేవిని గర్భవతిని చేసిన కిరణ్ పాల్ రెడ్డి.

    - పెళ్ళి చేసుకుంటానని చెప్పి ముఖం చాటేసిన కిరణ్ పాల్ రెడ్డి.

    - తనకు జరిగిన అన్యాయం పై పాలకోడేరు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.

    - పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీదేవి ని బెదిరింపులకు గురి చేసిన కిరణ్ పాల్ రెడ్డి.

    - తన బిడ్డ తో కలిసి పెట్రోలు బంకు వద్ద ఆందోళన కు దిగిన బాధితురాలు.

  • Nellore Updates: టీడీపీ నేత లోకేష్ పై విరుచుకుపడిన మంత్రి అనిల్ ...
    30 Oct 2020 12:33 PM GMT

    Nellore Updates: టీడీపీ నేత లోకేష్ పై విరుచుకుపడిన మంత్రి అనిల్ ...

    నెల్లూరు..

    ఏపి జలవనరుల శాఖామంత్రి మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ,కామెంట్స్

    -పప్పు మహరాజ్ ..జాగ్రత్తగా మాట్లాడు... అంటూ లోకేష్ పై ఫైర్.

    -నోరు వుందని వాగితే.. రోడ్డు మీద నిలబెడతాం

    -రైతుల కోసం కష్టపడుతన్నా దేశంలోనే గొప్ప నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

    -రైతులను హింసించిన చరిత్ర మీ బాబుది

    -నిన్ను నీ పార్టీ వారే నమ్మడం లేదు లోకేష్

    -నువ్వు ఒకడివే అమెరికలో చదివినట్టు బిల్డప్ ...అయినా సత్యం కంప్యూటర్స్ వాళ్ళు నిన్ను చదివించినంత కాకపోయినా ..మేము కూడా చదువుకున్నాం

    -పొలవరం మేము పూర్తి చేస్తామని తెలుసుకునే ముందే నువ్వు మీసాల తీసేసావు.

    -పోలవరానికి రూ 50 వేల కోట్ల లో రూ.18 వేల కోట్లే ఖర్చు అయింది...

    -టిడిపి వల్లనే పోలవరానికి ఈ సమస్య వచ్చింది.. పోలవరంపై ఆ రోజు కేబినెట్ లో పెట్టిన నోట్ తెచ్చి చదవండి మీ బాగోతం తెలుస్తుంది.

    -లాలూచీ పడే నైజం మీది...దమ్ము ధైర్యం తో పని చేసేది జగన్

    -జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే ...రాష్ట్ర శుభిక్షము గా ఉంది...

    -జగన్మోహన్ రెడ్డి దయ వల్ల మంత్రి ని అయ్యా....ఆయన చేసుకున్న పుణ్యం వల్ల వర్షాలు రాష్ట్రంలో పడుతున్నాయి..రైతులు సంతోషం గా వున్నారు..

    -మంగళ గిరి లో నీ గోచి ఊడగొట్టారు తెలియదా..లోకేష్

    -మీ నాన్న ఘనకార్యం వల్లే పోలవరానికి ఈ గతి ...

    -2021 డిసెంబర్ నాటికి పొలవరం పూర్తి చేస్తాం అన్న మాటకు మేము కట్టుబడి ఉన్నాం..

  • Nandyala Updates: నంద్యాల అభివృద్ది కేవలం భూమా నాగిరెడ్డి మాత్రమే చేశారు...
    30 Oct 2020 12:25 PM GMT

    Nandyala Updates: నంద్యాల అభివృద్ది కేవలం భూమా నాగిరెడ్డి మాత్రమే చేశారు...

    నంద్యాల...

    * ఆల్లగడ్డ సంస్కృతి అంటూ ఆల్లగడ్డ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నా రు ...

    * ఆధారాలతో, వాస్తవాలతో ఆరోపణలు చేయండి...అనవవసర ఆరోపణలతో

    * ఒత్తిడి తో కేసులు పెట్టించి జైల్ కి మాత్రమే పంపుతారు...బైటి కి వచ్చిన తరువాత మాకు ఒకసారి అవకాశం వస్తుంది..

    * శిల్పా మోహన్ రెడ్డి వ్యాపారాలు చేస్తున్నపుడు....నాగిరెడ్డి నాన్న బాలిరెడ్డి రాజకీయాల్లో వున్నారు

    * రాజకీయాల గురించి భూమా కుటుంబం శిల్పా వారితో నేర్పించు కునే స్థితిలో లేదు

  • Kurnool District Updates: శిల్పా కుటుంబం పై మాజీ మంత్రి అఖిల ప్రియ ఫైర్...
    30 Oct 2020 12:17 PM GMT

    Kurnool District Updates: శిల్పా కుటుంబం పై మాజీ మంత్రి అఖిల ప్రియ ఫైర్...

     కర్నూల్....

    * భూమా కుటుంబం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు శిల్పా కుటుంబం

    * అల్లగడ్డ గురించి మాట్లాడే హక్కు శిల్పా కుటుంభానికి లేదు...

    * ఫ్యాక్షన్ వున్న ప్రాంతం లో శిల్పా కుటుంబం వ్యాపారం ఎలా చేస్తోంది

    * దమ్ము దైర్యం వుంటే వారం రోజుల్లో నిజం నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వితంగా వైదొలగుతా...

    * లేకపోతే మీడియా ముఖంగా మాకు క్షమాపణ చెప్పాలి

    * పోలీసుల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు..

    * తప్పుడు కేసులు మా మీద పెట్టే ప్రయత్నం చేస్తే మేమే మీ వెంట పడత

  • Kurnool Updates: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి టిడిపి నాయకుల పై ఆగ్రహం....
    30 Oct 2020 11:08 AM GMT

    Kurnool Updates: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి టిడిపి నాయకుల పై ఆగ్రహం....

    కర్నూలు జిల్లా

    -దళిత న్యాయవాది వైఎస్ఆర్సిపి నాయకుడైన సుబ్బరాయుడు ని దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ టీడీపీ నాయకుల తీరును తప్పుబట్టిన   నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి....

    -దళిత న్యాయవాది సుబ్బరాయుడిని టిడిపి నాయకులు హత్య చేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ లు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఎమ్మెల్యే శిల్పా....

    -దళితులపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు దళిత న్యాయవాది టిడిపి నాయకుల చేతుల్లో హత్యకు   గురైతే చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడని ప్రశ్నించిన ఎమ్మెల్యే శిల్పా....

    -ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ రాజకీయాలు నంద్యాల లో చేస్తే సహించేది లేదన్నారు ఎమ్మెల్యే శిల్పా...

    -ప్రశాంతంగా ఉన్న నంద్యాల ప్రాంతాన్ని భూమా కుటుంబం వారి రాజకీయ లబ్ధి కోసం అరాచకాలు హత్యా రాజకీయాలు చేస్తే సహించబోమన్న ఎమ్మెల్యే     శిల్పా....

    -సుబ్బారాయుడి హత్య కేసుకు సంబంధించి మరింత సమగ్ర దర్యాప్తు జరిపి ఈ హత్యకు కుట్ర వెనక ఉన్న నిందితులను చట్టపరమైన చర్యలు తీసుకొని   శిక్షించాలని పోలీసులను కోరిన ఎమ్మెల్యే శిల్పా...

  • Dharmana Krishna Das: చంద్రబాబు ఆలోచనలు ఏమిటో అర్థం కావడం లేదు..
    30 Oct 2020 10:50 AM GMT

    Dharmana Krishna Das: చంద్రబాబు ఆలోచనలు ఏమిటో అర్థం కావడం లేదు..

      శ్రీకాకుళం జిల్లా..

    * ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..

    * ఇప్పటికే విభజనతో మనం తీవ్రంగా నష్టపోయాము..

    * 2050 నాటికి ప్రపంచం గర్వించే రాజధాని కడతాను అంటున్నారు..

    * ముందు మన స్థితిగతులు ఏమిటనే ఆలోచన లేకుండా రాజధాని కడితే ఏమిటి ప్రయోజనం ?

    * మనది 63 శాతానికి పైబడి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం..

    * పొలాలు తీసేసి విమానాశ్రయం కడతే ఎవరికి లాభం ?

    * వాస్తవాలు మాట్లాడితే విమర్శిస్తున్నాం అంటున్నారు..

  • Srikakulam District Updates: విమానంలో ప్రాణాలొదిలిన వలస కూలీ..
    30 Oct 2020 10:31 AM GMT

    Srikakulam District Updates: విమానంలో ప్రాణాలొదిలిన వలస కూలీ..

     శ్రీకాకుళం జిల్లా..

    -మృతుడు సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామానికి చెందిన గోవింద వల్లభరావు(44) గా గుర్తింపు..

    -అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతకు గురై బెంగుళూరు సమీపంలో విమానంలో మృతి..

    -గుజరాత్ లోని కాండ్లలో వలస కూలీగా ఉంటున్న వల్లభరవు..

    -తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థలానికి విమానంలో బయల్దేరి మార్గ మధ్యలో మృతి.

Print Article
Next Story
More Stories