Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 23 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి మ.12-01 వరకు తదుపరి అష్టమి | పూర్వాషాఢ నక్షత్రం ఉ.06-46 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: మ.02-43 నుంచి 04-18 వరకు | అమృత ఘడియలు రా.12-15 నుంచి 03-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Amaravati updates: రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు విడుదల...
    23 Oct 2020 2:58 PM GMT

    Amaravati updates: రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు విడుదల...

    అమరావతి:

    *ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుతో రాయల సీమ స్టీల్స్ లిమిటెడ్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు.

    *ఆర్ఎస్ సిఎల్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ

    *ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ పర్యవేక్షణలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం

    *గత కొద్ది కాలంగా ఎటువంటి కార్యకలాపాలను నిర్వహించని ఆర్ఎస్ సిఎల్

  • Nellore updates: బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ సెబ్ అధికారుల మెరుపు దాడులు...
    23 Oct 2020 12:14 PM GMT

    Nellore updates: బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ సెబ్ అధికారుల మెరుపు దాడులు...

      నెల్లూరు :--

    -- పొదలకూరు (మం) బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ సెబ్ అధికారుల మెరుపు దాడులు..

    -- సుమారు 1,600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసిన సబ్ అధికారులు.. నిందితులు పరార్

    --సెప్టెంబర్ నెలలో 51 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ పొదలకూరు సీఐ గంగాధర్ రావు

    --సెబ్ అధికారులు ఎప్పుడు దాడి చేసిన నిందితులు తప్పించుకోవడం పై అనుమానాలు

  • Vijayawada updates: అమరావతి శంఖుస్థాపన జరిగి 5 సం లు పూర్తి..
    23 Oct 2020 12:11 PM GMT

    Vijayawada updates: అమరావతి శంఖుస్థాపన జరిగి 5 సం లు పూర్తి..

      విజయవాడ

    *జెఏసీ కన్వీనర్ శివారెడ్డి కామెంట్స్

    *నిన్న అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఒకే రాజధానిగా అమరావతిని సూచించారు

    *310 రోజులుగా అమరావతి ఉద్యమం జరుగుతున్నా నిన్న అపశృతి చోటుచేసుకుంది

    *ప్రభుత్వం కుట్రపూరితంగా ఉద్యమాన్ని అణచాలని చూస్తోంది

    *దళిత పెయిడ్ ఆర్టిస్ట్ లతో మూడు రాజధానులకు మద్దతుగా పోలీసు కవాతు చేయడం దూరదృష్టకరం

    *సీఎం జగన్ మా సహనాన్ని పరీక్షించవద్దు

    *వైసీపీ ప్రభుత్వం గద్దె దిగేవరకు పోరాటం చేస్తాం

    *మంత్రులు జగన్ మెప్పుకోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు

    *మాలో మాకు వైషమ్యాలు సృష్టిస్తే సహించేది లేదు

    *ప్రభుత్వ దృశ్చర్యలను ముక్త కంఠంతో ఖండించాలి

  • Y.S.Jagan:  సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కామెంట్స్....
    23 Oct 2020 11:43 AM GMT

    Y.S.Jagan: సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కామెంట్స్....

    సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కామెంట్స్

    వ్యవసాయానికి ప్రాధాన్యం:

    – కోవిడ్‌ సమయంలో నిధులకు కొరత లేకుండా చూసినందుకు ధన్యవాదాలు

    – ఆర్థిక రంగానికి వ్యవసాయ రంగం ఒక వెన్నుముక, రాష్ట్రంలో దాదాపు 62 శాతం ఆ రంగంపైనే ఆధారపడ్డారు.

    – అందుకే ఆ రంగం ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం, ఆ దిశలో పలు చర్యలు తీసుకుంది.

      వైయస్సార్‌ రైతుభరోసా, పీఎం–కిసాన్‌:

    – రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏటా రూ.13,500 చెల్లింపు.

    – ఖరీఫ్‌ ప్రారంభంలో (జూన్‌లో) రూ.7500, ఆ తర్వాత రబీ ప్రారంభం (అక్టోబరులో) రూ. 4 వేలు, ఆ తర్వాత పంట చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండగ సమయంలో మరో రూ.2 వేలు ఇస్తున్నాము.

     రైతు భరోసా కేంద్రాలు:

    – ప్రతి గ్రామంలో ఆర్బీకేల ఏర్పాటు, 10,600కు పైగా కేంద్రాలు ఏర్పాటు.

    – పరీక్షించిన, నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా, ఆర్డర్‌ చేసిన 48 గంటల్లో డోర్‌ డెలివరీ.

    – ఈ–క్రాపింగ్‌.

    _ గ్రామాల్లో వ్యవసాయ సహాయకుడు, రెవెన్యూ కార్యదర్శి, సర్వేయర్లు, వారంతా కలిసి ఈ–క్రాపింగ్‌ చేస్తున్నారు.

      ఖరీఫ్‌లో వ్యవసాయ రుణాలు:

    – 2020–21 ఖరీఫ్‌లో రుణాలు రూ.75,237 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.62,650 పంపిణీ చేశారు.

    – ఇది టార్గెట్‌లో 83.27 శాతం కాగా, గత ఏడాది కంటే ఇది రూ.3 వేల కోట్లు తక్కువ.

    – గ్రామంలో ఈ–క్రాపింగ్‌లో నమోదైన ప్రతి రైతుకు రుణాలు అందుతున్నాయా? లేదా అన్నది చూడాలి.

    – బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆ రైతు ఈ–క్రాపింగ్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉన్నాడా? అన్నది చూడాలి.

    – పంటల బీమా, సున్నా వడ్డీ రుణాల కోసం ఈ–క్రాపింగ్‌ తప్పనిసరి.

      అదే విధంగా ఎక్కడా అవినీతికి తావు ఉండదు.

      ధరల స్థిరీకరణ నిధి:

    – గత ఏడాది ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3200 కోట్లతో పంటలు కొన్నాము.

    – ఈసారి దాదాపు రూ.3500 కోట్లతో ఆ నిధి ఏర్పాటు చేశాము.

    – సచివాలయంలో ఉండే వ్యవసాయ సహాయకుడు ప్రతి రోజూ పంటల ధరలు, వాటి డిమాండ్‌ను ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో అప్‌డేట్‌ చేస్తారు.

       ఇంకా..

    – ప్రతి గ్రామంలో గోదాములు. మండల కేంద్రాల్లో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయబోతున్నాము.

    – అదే విధంగా ప్రతి గ్రామంలో జనతా బజార్ల ఏర్పాటు. తద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ ఏర్పడుతుంది.

    – వీటన్నింటికీ బ్యాంకర్ల నుంచి సపోర్టు కావాలి.

      నాడు–నేడు:

    – ఇంకా స్కూళ్లు, ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన కోసం నాడు–నేడు చేపట్టాము. దానికి కూడా బ్యాంకర్ల సహాయం కావాలి.

    – ప్రతి స్కూల్‌లో 10 రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము, మంచినీరు, టాయిలెట్లు, ప్రహరీలు, లైట్లు, కిచెన్, ఇంగ్లిష్‌ ల్యాబ్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు     చేస్తున్నాము.

    – తొలి దశలో 15,715 స్కూళ్లులో మార్పులు. డిసెంబరులో రెండోదశ పనులు చేపట్టబోతున్నాము.

    – స్కూళ్లలో నాడు–నేడు కోసం తొలి దశలో రూ.4000 కోట్లు, రెండో దశలో రూ.4500 కోట్లు, మూడో దశలో దాదాపు రూ.3500 కోట్లు ఖర్చు చేయబోతున్నాము.

      విలేజ్‌ క్లినిక్‌లు:

    – ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు చేస్తున్నాము. వాటిలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారు.

    – ఇంకా 51కి పైగా మందులు కూడా ఆ క్లినిక్‌లో ఉంటాయి.

      ఆస్పత్రులు, నాడు–నేడు, టీచింగ్‌ ఆస్పత్రులు:

    – ఆస్పత్రుల్లో కూడా నాడు–నేడుతో పూర్తిగా మార్పులు చేయబోతున్నాము.

    – కొత్తగా 16 టీచింగ్‌ ఆస్పత్రుల ఏర్పాటు.

    – ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక టీచింగ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయబోతున్నాము.

    – దీనిపై కోవిడ్‌ వీడియో కాన్ఫరెన్సులో ప్రధానమంత్రికి కూడా నివేదించాము.

    – వచ్చే 3 ఏళ్లలో దాదాపు రూ.13 వేల కోట్లు, 16 టీచింగ్‌ ఆస్పత్రులకు ఖర్చు చేయబోతున్నాము.

      సంక్షేమ పథకాలు:

    – వచ్చే నెలలో జగనన్న తోడు పథకం అమలు చేయబోతున్నాము.

    – ఇక వైయస్సార్‌ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మహిళలకు ప్రయోజనం కలుగుతోంది.

    – వారికి ఉపాధి కల్పన దిశలో అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, రిలయెన్స్, అల్లానా గ్రూప్‌లతో అవగాహన చేసుకున్నాము.

    – ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మహిళలకు మొత్తం రూ.75 వేల సహాయం చేస్తాము.

    – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల్లో 45–60 ఏళ్ల వారికి సహాయం.

      ఎంఎస్‌ఎంఈలు:

    – ఎంఎస్‌ఎంఈ రంగానికి అర్థికంగా అండ. కోవిడ్‌ సమయంలోనూ పారిశ్రామిక రాయితీ (పెండింగ్‌లో ఉంటే) పూర్తిగా రూ.1100 కోట్లు ఇచ్చాం.

    – ఆ మొత్తం ఎంఎస్‌ఎంఈ రంగానికి ఎంతో అండగా నిల్చింది. కోవిడ్‌ సమయంలో వారికి పెట్టుబడిగా ఉపయోగపడింది.

     స్వయం సహాయక బృందాలు:

    – వైయస్సార్‌ ఆసరా పథకం ద్వారా ఆ మహిళలకు సహాయం. వారి రుణాలు నాలుగేళ్లలో పూర్తిగా చెల్లింపు.

    – వీటన్నింటి కోసం బ్యాంకర్ల మద్దతు ఉండాలని, సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను.

  • Mekapati Goutham Reddy: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం లేదు..
    23 Oct 2020 10:12 AM GMT

    Mekapati Goutham Reddy: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం లేదు..

      అమరావతి

    *మంత్రి గౌతమ్ రెడ్డి...

    *నవంబర్, డిసెంబర్ నెలలో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి..

    *దసరా తరువాత సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెపుతున్నారు..

    *బీహార్ ఎన్నికలు ఖచ్చితంగా జరగాల్సిన రాష్ట్ర ఎన్నికలు కావున నిర్వహిస్తున్నారు..

    *రాష్ట్ర ఎన్నికలు రాజ్యాంగ ప్రకారం జరిగి తీరాల్సిందే..

    *వాటితో.. స్థానిక సంస్థలను పోల్చకూడదు..

  • 23 Oct 2020 10:06 AM GMT

    Andhra Pradesh updates: ఏపీ బీజేపీ నేతల వీడియో కాన్ఫరెన్స్...

    * కేంద్ర పంచాయితీ రాజ్,వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపలాతో ఏపీ బీజేపీ నేతల వీడియో కాన్ఫరెన్స్

    * వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు,పురందరేశ్వరి,విష్ణు వర్ధన్ రెడ్డి, బిజెపి ఎంపీలు సీఎం రమేష్,సుజనాచౌదరి, టిజి వెంకటేష్    నేతలు

    * ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎంపీ జీవిఎల్,ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శశిభూషన్ రెడ్డి

    * ఇటివల కురిసిన వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంట నష్టం వివరాలను కేంద్రమంత్రికి వివరించిన బిజెపి నేతలు

  • G. V. L. Narasimha Rao: అకాలవర్షాల వల్ల జరిగిన తీవ్రపంట నష్టాన్ని వివరించాము...
    23 Oct 2020 9:54 AM GMT

    G. V. L. Narasimha Rao: అకాలవర్షాల వల్ల జరిగిన తీవ్రపంట నష్టాన్ని వివరించాము...

    *జీవీఎల్ నరసింహారావు, బిజెపి రాజ్యసభ సభ్యులు

    *కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి తో వీడియోకాన్ఫరెన్స్ లో రాష్ట్రంలో జరిగిన అకాలవర్షాల వల్ల జరిగిన తీవ్రపంట నష్టాన్ని వివరించాము.

    *రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఆశాజనకంగా లేవని వివరించాము.

    *కేంద్ర బృందాన్ని వెంటనే పంపించి పంటనష్టాన్ని అంచనావేయడం తో పాటు రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరాము. మంత్రి సానుకూలంగా   స్పందించారు.

  • Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై కొండచరియలు పరిశీలన చేశాము..
    23 Oct 2020 9:45 AM GMT

    Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై కొండచరియలు పరిశీలన చేశాము..

      విజయవాడ

    -Hmtv తో జియో ఎక్సపర్ట్ కమిటీ సభ్యులు త్రిమూతి రాజు

    -ఓంకారం మలుపు, మౌన ముని గుడి వద్ద కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది.

    -ఇంద్రకీలాద్రిపై కొండలు మట్టి, రాళ్లు కలిసి ఉన్నాయి..

    -వర్షాలు ప్రభావంతో జారీ పడుతున్నాయి

    -కొండచరియలు పడే ముందు అలారం ఏర్పాటు, ఐరెన్ మెష్ పటిష్టం, లూజ్ గా ఉన్న కొండ చరియలు తొలగింపు చేయాలి

    -మరో 10 నుంచి 15 రోజుల్లో నివేదిక ఇష్టము

  • Amaravati updates: జీవో 111 అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టాలి..
    23 Oct 2020 9:41 AM GMT

    Amaravati updates: జీవో 111 అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టాలి..

    అమరావతి...

    జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్

    • ఎఫ్.టి.ఎల్. నిబంధనను పట్టించుకోకుండా నిర్మాణాలు చేస్తున్నారు

    • నాలాలు, చెరువులు ఆక్రమించి నిర్మించడం... ఆపై క్రమబద్ధీకరణ చేయడం ఓ ధోరణిగా మారింది

    • అర్బన్ ప్లానింగ్ లో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను చక్కదిద్దాల్సిన బాధ్యత టి.ఆర్.ఎస్.పై ఉంది

  • Kurnool district updates: దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె...
    23 Oct 2020 9:36 AM GMT

    Kurnool district updates: దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె...

    కర్నూలు...

    *గఫుర్, సీపీఎం పార్టీ

    *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను పట్ల అశ్రద్ధ చూపిస్తున్నారని వారిని అడ్డుకోవడంతో విఫలమయ్యారని సీపీఎం పార్టీ గఫుర్..

    *ప్రభుత్వాలకు వైఖరికి నిరసనగా నవంబర్ 26వ తేదీన దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె...


Print Article
Next Story
More Stories