Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 23 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి మ.12-01 వరకు తదుపరి అష్టమి | పూర్వాషాఢ నక్షత్రం ఉ.06-46 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: మ.02-43 నుంచి 04-18 వరకు | అమృత ఘడియలు రా.12-15 నుంచి 03-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 23 Oct 2020 4:28 PM GMT

    East godavari updates: కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్ధికసాయం..

    తూర్పు గోదావరి :

    -- ఏపియుడబ్ల్యూజె కృషితో కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్ధికసాయం

    -- మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. ఏపీలో కరోనాతో మృతి చెందిన 45 మందికి పైగా జర్నలిస్టులు..

    -- సిఎం జగన్ కు కృతజ్నతలు తెలిపిన     ఏపియుడబ్ల్యూజె తూర్పు గోదావరి జిల్లా కమిటీ..

  • Amaravati updates: నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష...
    23 Oct 2020 4:12 PM GMT

    Amaravati updates: నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష...

      అమరావతి..

    -వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించిన చంద్రబాబు

    -పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, మండల టిడిపి బాధ్యులు

    -ఎప్పుడూ చూడని ఉన్మాద పాలన రాష్ట్రంలో చూస్తున్నాం

    -ఎప్పుడెలా ప్రవర్తిస్తారో, ఎవరినేం చేస్తారో, ఏ విధ్వంసం సృష్టిస్తారో అర్ధంగాని పరిస్థితి ఉంది.

    -ఉన్మాది పాలనలో ఊరికో ఉన్మాది’’ తయారు అవుతున్నాడు.

    -బీసి,ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలపై దాడులు..

    -ఆడబిడ్డలపై అత్యాచారాలు.. దేవాలయాలకే రక్షణ లేకుండా పోయింది.

    -జగన్ రెడ్డి నోరుతెరిస్తే అబద్దాలు..చేసేదంతా అరాచకం.

    -ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలు.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు..భయోత్పాత హింసాత్మక చర్యలు..

    -జగన్ రెడ్డి ప్రచారం పిచ్చ పరాకాష్టకు చేరింది.

    -సర్వేరాళ్లపై కూడా జగన్ రెడ్డి బొమ్మలు.. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు..

    -పాత స్కీములకే కొత్తపేర్లు పెట్టి, వాటిపై యాడ్స్ కు కోట్లాది రూపాయల వ్యయం..

    -గ్రానైట్ సర్వే రాళ్లు వేయడం, వాటిపై జగన్ రెడ్డి బొమ్మలు వేయడం మరో తుగ్లక్ చర్య..

    -రాజధాని 3ముక్కలు చేయడం, పాత స్కీమ్ లకే కొత్త పేర్లు పెట్టడం, తుగ్లక్ పాలనతో రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చారు.

    -బీమా పథకం’’ ఏడాదిన్నరగా ఎందుకు ఆపేశారు..?

    -పేరుమార్చి ఇప్పుడు చేసిందేమిటి..? ఇన్ని ఆంక్షల బీమా వల్ల ఎవరికేం లాభం..?

    -దీనికోసం ఏడాదిన్నరగా బీమా పథకం లబ్ది పేదలకు ఎందుకు దూరం చేశారు

    -ఆ కుటుంబాలకు జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు..?

    -బెంజ్ మినిస్టర్ ఒకరు, హవాలా మినిస్టర్ మరొకరు, బూతుల మంత్రి ఇంకొకరు..

    -బెట్టింగ్ మంత్రి ఒకరైతే, పేకాట మంత్రి ఇంకొకరు..

    -ఎ1, ఎ2 నుంచి ఎ7, ఎ8 దాకా ప్రభుత్వ పదవుల్లోకి చేరారు.

    -ముద్దాయిల పాలనలో రాష్ట్రం ముద్దాయిల ఇష్టారాజ్యంగా మారింది.

    -శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ, మీడియా...4 మూల స్థంభాలను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

    -రాజ్యాంగంపై గౌరవం లేదు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు.

    -ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాళ్లు గడ్డాలు పట్టుకుని తీసుకుని ఇదే ఆఖరి ఛాన్స్ చేసుకున్నారు.

    -కరోనా పరిస్థితులను సరిగ్గా ఎదుర్కొంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు వచ్చేవిగావు

    -సమస్యను అంచనా వేయడంలో వైఫల్యం,

    -సమస్యను సమర్ధంగా ఎదుర్కోవడంలో వైఫల్యం, బాధితుల్లో భరోసా పెంచడంలో నిర్లక్ష్యం...

    -ప్రజల ప్రాణాలంటే జగన్ రెడ్డికి లెక్కలేదు. ప్రజారోగ్యం పట్ల శ్రద్దలేదు.

  • Amaravati updates: సోమవారం మహిళా ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు..
    23 Oct 2020 4:08 PM GMT

    Amaravati updates: సోమవారం మహిళా ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు..

    అమరావతి

    -దసరా రోజున ఆదివారం కావడంతో సోమవారం కు ఆ శలవును మార్చవలసిందిగా కోరిన మహిళా ఉద్యోగులు

    -మహిళా ఉద్యోగుల అభ్యర్థన పై సానుకూలంగా స్పందించిన సర్కార్

    -ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ నీలం సాహ్ని

  • Ananthapu updates: నారా లోకేష్ పై మంత్రి శంకర్ నారాయణ ఫైర్..
    23 Oct 2020 4:01 PM GMT

    Ananthapu updates: నారా లోకేష్ పై మంత్రి శంకర్ నారాయణ ఫైర్..

      అనంతపురం:

    //టీడీపీ పరిపాలనలో రైతులను పట్టించుకోని తెలుగుదేశం నేడు రైతుల పై కపట చూపిస్తుంది.

    //అసలు రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఉన్నారు... ఆ లెక్కలు తెలియని లోకేష్ రైతుల గురించి ఏం మాట్లాడుతారు..

    //వేరుశనగ, మొక్కజొన్న, కంది పంటలు అంటే తెలియని నారా లోకేష్ ముందుగా తెలుగు మాట్లాడడం నేర్చుకోవాలి.

    //మీ పార్టీ నాయకులను, క్యాడర్ ను కాపాడుకునేందుకే జిల్లా పర్యటనలు చేస్తున్నారు తప్ప రైతుల మీద ప్రేమతో కాదు.

    //ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించే స్థాయి నారా లోకేష్ కు లేదు.

  • Tirumala updates: తిరుమలలో ఏకాంతంగా ఎనిమిదోవ రోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు...
    23 Oct 2020 3:42 PM GMT

    Tirumala updates: తిరుమలలో ఏకాంతంగా ఎనిమిదోవ రోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు...

    తిరుమల

    -8వ రోజు రాత్రి అశ్వ వాహనాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి

    -కోవిడ్-19 ప్రభావంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేసిన టీటీడీ

    -రేపు ఉద‌యం 6 నుండి 9 గంట‌ల మధ్య (అద్దాల మ‌హ‌ల్‌లో)

    -స్న‌ప‌న‌ తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్న ఆలయ అర్చకులు.

    -రేపటితో ముగియనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

  • Muralidhar Reddy: కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి లేదా జరిమానా తప్పదు..
    23 Oct 2020 3:35 PM GMT

    Muralidhar Reddy: కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి లేదా జరిమానా తప్పదు..

     తూర్పుగోదావరి :

    -జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పిసి కామెంట్స్..

    -మాస్క్, సామాజిక దూరం, శానిటేజర్ ల ద్వారా కరోనాను నియంత్రణ చేయవచ్చు..

    -జిల్లాలో నవంబర్ పదిహేను నుంచి పాఠశాలల ప్రారంభం దృష్యా ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం..

    -కేరళ లో ఓనం పండుగ తర్వాత కరోనా కేసులు పెరిగాయి.. దసరా పండగ రోజుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి..

    -ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలకు వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది..

    -వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇప్పటి వరకు 86 శాతం రేషన్ పంపిణీ చేశాము..

    -ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో జరిగిన నష్టం పై అంచనా రూపొందించి ప్రభుత్వానికి పంపించాము..

    -అక్టోబర్ లో జరిగిన నష్టం పై అంచనాలు ఈ నెల ఆఖరి కల్లా పూర్తి చేస్తాము..

  • National updates: చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల రాష్ట్రానికి అన్యాయం
    23 Oct 2020 3:14 PM GMT

    National updates: చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల రాష్ట్రానికి అన్యాయం

    జాతీయం

    -బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ ఆర్థిక మంత్రి

    -పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల రాష్ట్రానికి అన్యాయం

    -2016లో స్పెషల్ ప్యాకేజీ పేరుతో 2014 నాటికి ఖర్చులకు చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ఒప్పందం చేసుకుంది

    -ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నారు

    -సెప్టెంబరులో మిడ్నైట్ డీల్ కుదుర్చుకున్నారు

    -ఆ గొప్ప ప్యాకేజీలో భాగంగా 2014 నాటి ఖర్చు ఇస్తే చాలు అని టిడిపి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది

    -పునరావాసం, భూసేకరణ ఖర్చు , ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు పెరిగే అవకాశం ఉందన్న క్యాబినెట్ తీర్మానం పక్కన పెట్టారు

    -ఈ అంశాన్ని గతంలోనే జగన్ ప్రతిపక్ష నేతగా ప్రశ్నించారు

    -నాడు పట్టిసీమ పేరుతో పోలవరం ప్రాజెక్టు ఏడాదిన్నర ఆలస్యం చేశారు

    -కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేపడితే కాంట్రాక్టులు దక్కవని చంద్రబాబు ప్రభుత్వం ఇలా ప్రవర్తించింది

    -రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును సిడబ్ల్యుసి ద్వారా కన్ఫర్మ్ చేయాలని చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు

    -బాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు

    -అంచనాలు రివైజ్డ్ చేస్తున్న సమయంలో టిడిపి ప్రభుత్వ బండారం బయటపడింది

    -రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కండిషన్స్ లేకుండా రియంబర్స్ చేయాలి

    -సొంత కాంట్రాక్టుల కోసం సంవత్సరన్నర పాటు పోలవరం పట్టించుకోలేదు

    -టిడిపి పాలన వల్ల రాష్ట్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది

    -2016వ సంవత్సరంలో 2014 ఖర్చుకు పరిమితం కావాలని ఒప్పుకోవడమే తప్పు

    -ప్రాజెక్టు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది

  • Amaravati updates: ఏపీ లో భారీ వర్షాలు, వరదలు, పంట నష్టం పై కేంద్రానికి‌ వివరించిన‌ బీజెపి నేతలు..
    23 Oct 2020 3:06 PM GMT

    Amaravati updates: ఏపీ లో భారీ వర్షాలు, వరదలు, పంట నష్టం పై కేంద్రానికి‌ వివరించిన‌ బీజెపి నేతలు..

      అమరావతి

    -కేంద్ర వ్యవసాయ మంత్రి పురుషోత్తం తో వర్చ్యువల్ సమావేశం లో పాల్గొన్న సోము వీర్రాజు

      సోము వీర్రాజు

    -భారీ వర్షాలతో కృష్ణ, గోదావరి నదులతో పాటు, అనేక ఉపనదులు, ప్రవాహాలు, కాలువలు మరియు చెరువులు పొంగి పొంగి గ్రామాలను నింపాయి.

    -పొలంలో వరి, పత్తి, మిల్లెట్, వేరుశనగ, అరటి, ఉల్లిపాయ వంటి ఉద్యాన పంటలు వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

    -పార్టీకి చెందిన నాలుగు బృందాలు వరద పీడిత ప్రాంతాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేశాయి.

    -జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు రాష్ట్రంలో వరద పరిస్థితులు, రైతులకు జరిగిన నష్టాన్ని వివరించారు

    -రాష్ట్ర రైతులకు.. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయం, సహకారం అందించాలని కోరుతున్నాం

    -నివేదికలను ఇప్పటికే వ్యవసాయ మంత్రిత్వ శాఖకు పంపారు,

    -వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం

    -వరద నివారణ సమస్యలు, నష్టాలను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది

    -కనీసం తక్షణ పరిహారం కూడా ఇవ్వలేదు

    -ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా.. పిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రితో వరదలు గురించి మాట్లాడారు,

    -ముఖ్యమంత్రి తగినంతగా స్పందించలేదు.

    -నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే బృందాలను పంపాలి.

  • Amaravati updates: సిఎం జగన్ తో ఏపిఎన్జీఓ నేతలు భేటీ..
    23 Oct 2020 3:03 PM GMT

    Amaravati updates: సిఎం జగన్ తో ఏపిఎన్జీఓ నేతలు భేటీ..

      అమరావతి..

    -- చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ ఎన్ జిఓ అధ్యక్షుడు

    -- రెండు నెలల 50శాతం జీతం ఇవ్వాలని కోరాం

    -- పెన్షనర్ల ఒక నెల 50శాతం పెండింగ్ జీతం ఇవ్వాలని కోరాం

    -- నవంబర్ నెలలో పెండింగ్ జీతం సీఎం చెల్లిస్తామన్నారు

    -- 11వ పీఆర్ సి ని వెంటనే అమలు చేయమని కోరాం

    -- సీపీఎస్ రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని కోరాం

    -- కాంట్రాక్ట్ ఉద్యొగులను రెగ్యులర్ చేయాలని కోరాం

    -- ప్రతి ఉద్యోగికి రిటైర్డ్ అయ్యాలోపు ఇంటి సౌకర్యం కల్పించాలని కోరాం

    -- మహిళ టీచర్స్ తరహాలో మహిళ ఉద్యోగులకు 5 స్పెషల్ క్యాజువల్ లెవ్ ఇవ్వాలి

    -- కోవిడ్ సోకిన ఉద్యోగులకు 30రోజులు సెలవు ఇవ్వాలి

    -- రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగులు మరింత సహకరించాలని సిఎం జగన్ కోరారు

    -- ఉద్యోగులంతా మరింత చొరవతో పనిచేసేందుకు రెడీగా ఉన్నాం

    -- సీఎం జగన్ మా డిమాండ్స్ పట్ల సానుకూలంగా స్పందించారు

  • Vijayawada Durgamma updates: బెజవాడ దుర్గమ్మకి అన్నవరం సత్యదేవుడి ఆలయం నుంచి పట్టువస్త్రాలు..
    23 Oct 2020 3:00 PM GMT

    Vijayawada Durgamma updates: బెజవాడ దుర్గమ్మకి అన్నవరం సత్యదేవుడి ఆలయం నుంచి పట్టువస్త్రాలు..

      విజయవాడ

    //మోకా సూరిబాబు, అన్నవరం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడు

    //అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వార్ల దేవస్థానం నుంచి ఏటా దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాం

    //ఏటా దసరా ఉత్సవాల్లో దుర్గమ్మకు దేవస్థానం తరపున సారె తీసుకురావడం ఆనవాయితీ

    //ఈవో త్రినాథరావు సహా ట్రస్టు బోర్డు సభ్యులంతా కలసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాం

    //ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నాం

    //దుర్గమ్మ ఆలయంలో ఏర్పాట్లు బాగున్నాయి

Print Article
Next Story
More Stories