Live Updates:ఈరోజు (ఆగస్ట్-22) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 22 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్ల పక్షం శు.తదియ రా.2.21 వరకు, తదుపరి చవితి నక్షత్రం ఉత్తర రా.1.30 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ఉ.9.41 నుంచి 11.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.05 వరకు తదుపరి ప.12.27 నుంచి 1.19 వరకు, అమృతఘడియలు... సా.6.42 నుంచి 7.42 వరకు. సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-19

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు జేజేలు!

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 22 Aug 2020 4:33 AM GMT

    తూర్పుగోదావరి :

    - ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వస్తున్న వరద నీటితో కోనసీమ లో ఉధృతంగా ప్రవహిస్తున్న గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి ఉప నదులు..

    - కోనసీమ వ్యాప్తంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న సుమారు 30 లంక గ్రామాలు..

    - వారం రోజులుగా అంధకారంలో మగ్గుతున్న లంక గ్రామాలు.

    - తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న లంక గ్రామాల ప్రజలు..

    - పునరావాస కేంద్రం లో తప్ప లంక గ్రామాలకు అందని వరద సహాయం..

    - నిత్యావసర వస్తువుల కోసం ప్రమాదకర పరిస్థితి లో నాటు పడవలపై ప్రయాణం సాగిస్తున్న లంక గ్రామాల ప్రజలు..

    - పూర్తిగా నీట మునిగిన ఎదురుబిడియం, అప్పన్నపల్లి, కనకాయలంక కాజ్ వే లు.

    - జలదిగ్బంధంలో అయినవిల్లి మం. వీరవల్లిపాలెం,

    - అద్దంకివారి లంక, అయినవిల్లి లంక,.

    - పి.గన్నవరం మం. గంటి పెదపూడి, బూరుగులంక, అరిగెలవారి పేట, ఊడిముడిలంక, లంకలగన్నవరం, నడిగాడి, శివాయలంక, కాట్రగడ్డ, నాగుల్లంక, కనకాయలంక

    - మామిడికుదురు మం. అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, పెదపట్నం,

    - మానేపల్లి, పాశర్లపూడి బాడవ..

    - ముమ్మిడివరం మం. అయినాపురం బాడవ, కర్రవానిరేవు, చింతవానిరేవు, లంక ఆఫ్ ఠాణేలంక, కూనాలంక, గురజాపులంక, కమిని, వలసలతిప్ప, సలాదివారిపాలెం, పొట్టి తిప్ప, గేదెల్లంక..

    - ఐ.పొలవరం మం. పశువుల్లంక, కొమరగిరి, గోగుల్లంక..

    - కె.గంగవరం మం. శేరిలంక, కోటిపల్లి మత్సకారుల కాలనీ.

    - అల్లవరం మం. బోడసకుర్రు, పల్లిపాలెం, గోపాలలంక.

    - సఖినేటిపల్లి మం. సఖినేటిపల్లి, పల్లిపాలెం, అప్పనరాముని లంక..

    - రాజోలు మం. రాజోలు ,పల్లిపాలెం, సోంపల్లి..

    - కొత్తపేట మం. నారాయణ లంక.. ఆలమూరు మం. బడుగువాని లంక,.

    - రావులపాలెం మం. తోకాలంక.. ఆత్రేయపురం మం. పిచ్చుక లంక..

  • 22 Aug 2020 4:31 AM GMT

    తిరుమల

    - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.కె.మహేశ్వరి

  • 22 Aug 2020 4:30 AM GMT

    AP Government: వైఎస్సార్ చేయూత అమలుకు కమిటీలు ఏర్పాటు చేసిన సర్కార్

    అమరావతి

    - వైఎస్సార్ చేయూత అమలుకు కమిటీలు ఏర్పాటు చేసిన సర్కార్

    - వైఎస్సార్ చేయూత లబ్దిదారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక

    - రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు జిల్లా, మునిసిపాలిటీ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు

    - ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్

    - పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చైర్మన్ గా మరో 13 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ

    - కమిటీలో ఏడుగురు మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులకు చోటి

    - కలెక్టర్ చైర్ పర్సన్ గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు

    - మునిస్పల్ కమిషనర్ ఛైర్పర్సన్ గా మరో ఇద్దరు సభులతో మున్సిపాలిటీ స్థాయి కమిటీ ఏర్పాటు

    - ఎంపీడీఓ అధ్యక్షతన మరో నలుగురు సభ్యులతో మండల స్థాయి కమిటీ

    - ప్రతి కమిటీలో ప్రభుత్వం ఏంఓయు చేసుకున్న కంపెనీ ప్రతినిధులకు చోటు

    - వారానికి ఒక సారి సమావేశం అవ్వాలని కమిటీలకు ఆదేశం

    - 15 రోజులకు ఒకసారి భేటీ కానున్న రాష్ట్ర స్థాయి కమిటీ

    - సెప్టెంబర్ 21 లోగా లబ్దిదారులకు ఆర్థిక సహకారం అందించాలని ఆదేశించిన సర్కార్

    - వివిధ డిపార్ట్మెంట్ లను నోడల్ ఏజెన్సీ లుగా పేర్కొన్న ప్రభుత్వం

  • 22 Aug 2020 4:29 AM GMT

    చిత్తూరు

    - చిత్తూరు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం

    - వినాయక చవితి సందర్భంగా కాణిపాకం సర్వాంగ సుందరంగా వరసిద్దుడి ఆలయం

    - స్వామివారి మూల విరాట్ కు వివిధ రకాల అభిషేకాలు నిర్వహించి చందనాలంకరణ చేసి ప్రత్యక పూజల అనంతరం స్వామివారి దర్శనం ప్రారంభం

  • 22 Aug 2020 4:28 AM GMT

    Visakhapatnam: నగరంలో కానరాని వినాయకచవితి సందడి

    విశాఖ

    - నగరంలో కానరాని వినాయకచవితి సందడి

    - ఇళ్ళకే పరిమితమైన పండుగ

    - వినాయక చవితిని పురస్కరించుకుని సంపత్ వినాయక ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు

    - ఉదయాన్నే భక్తులకు అనుమతి లేకుండా లక్ష్మీగణపతి హోమాన్ని చేపట్టిన నిర్వాహకులు

    - సంపత్ వినాయకుడ్ని దర్శించుకుంటున్న వివిధ రంగాల ప్రముఖులు, నగరవాసులు

  • 22 Aug 2020 4:27 AM GMT

    YS Jagan: మరో సంక్షేమ పథకం కు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్

    అమరావతి:

    - మరో సంక్షేమ పథకం కు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్

    - ఎన్నికల హామీలో బాగంగా డ్వాక్రా మహిళల రుణ మాఫీ కి వైఎస్సార్ ఆసరా పథకం

    - వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

    - ఎన్నికల సమయానికి ఉన్న బ్యాంక్ లోన్ లు పూర్తిగా తిరిగి చెల్లించనున్న జగన్ సర్కార్

    - నాలుగు దఫాలుగా పథకం అమలు చేయనున్న ప్రభుత్వం

    - గత సమావేశంలో వైఎస్సార్ ఆసరా పథకంకు ఆమోద ముద్ర వేసిన రాష్ట్ర మంత్రి మండలి

  • 22 Aug 2020 4:26 AM GMT

    Thungabadhra Dam: తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ప్రవహం..

    కర్ణాటక: 

    - డ్యాం ఇన్ ఫ్లో: 38,924 క్యూసెక్కులు.

    - డ్యాం ఔట్ ఫ్లో: 33156 క్యూసెక్కులు.

    - డ్యామ్ లో నీటి మట్టం: 1632.63 ఆడుగులు.

    - పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు.

    - డ్యామ్ లో నీటి నిల్వ: 99.432 టీఎంసీలు.

    - పూర్తి సామర్థ్యం: 100.855 టీఎంసీలు.

  • 22 Aug 2020 4:25 AM GMT

    Prakasam Barrage: ఇన్ ఫ్లో ఆధారంగా ఔట్ ఫ్లో మేనేజ్మెంట్ చేస్తున్న అధికారులు

    విజయవాడ:

    - ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో ఆధారంగా ఔట్ ఫ్లో మేనేజ్మెంట్ చేస్తున్న అధికారులు

    - ప్రస్తుతం 1,25,550 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల

  • 22 Aug 2020 4:24 AM GMT

    Vijayawada: పులిచింతల వద్ద నీటి లెవెల్స్ పెరుగుతున్నాయి

    విజయవాడ:

    - పులిచింతల వద్ద నీటి లెవెల్స్ పెరుగుతున్నాయి

    - నీటి లెవెల్ +50.90M (166.993ft)/ FRL 53.34 M (175.000 ft )

    - పులిచింతల ప్రాజెక్టు కెపాసిటీ 34.2400/45.77 TMC

    - 2 మీటర్ల ఎత్తుకు 6 స్పిల్ వే గేట్లను ఎత్తిన అధికారులు

    - 99402 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల

    - విద్యుత్ తయారీకి 15వేల క్యూసెక్కుల నీటి విడుదల

    - మొత్తం ఔట్ ఫ్లో 114402 క్యూసెక్కులు

    - మొత్తం ఇన్ ఫ్లో 290060 క్యూసెక్కులు

  • 22 Aug 2020 4:23 AM GMT

    Amaravati: ఈనెల 25 న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ వాయిదా

    అమరావతి:

    - ఈనెల 25 న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ వాయిదా పడటం హర్షణీయమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

    - గోదావరి, కృష్ణా నదుల వరద నీరు వృథాగా సముద్రం పాలవుతున్నది.

    - ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల జల వివాదాల వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతోంది.

    - పుష్కలంగా ఉన్న నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి.

    - ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నీటి తగాదాలకు తావిస్తూ అపెక్స్ కౌన్సిల్ కు వెళ్లడం సరికాదు.

    - తమకు భేషిజాలు లేవన్న కేసీఆర్, జగన్ లు నీటి వివాదాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి.

    - పలు విషయాల్లో పరస్పరం సహకరించుకునే కెసిఆర్, జగన్ లు ప్రజా సమస్యల పట్ల కూడా చిత్తశుద్ధి చూపాలి.

    👆రామకృష్ణ.

Print Article
Next Story
More Stories