Live Updates: ఈరోజు (సెప్టెంబర్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 18 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి మ.2-55 వరకు తదుపరి విదియ | ఉత్తర నక్షత్రం ఉ.9-35 తదుపరి హస్త | వర్జ్యం: సా.5-25 నుంచి 6-55 వరకు | అమృత ఘడియలు: రా.2-23 నుంచి 3-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-05 వరకు, తిరిగి మ.12-19 నుంచి 1-08 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-59

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • West Godavari updates: చేపట్టిన ఛలో అమలాపురం కి ఎలాంటి అనుమతులు లేవు.. ఏలూరు రేంజ్ డిఐజి మోహనరావు..
    18 Sep 2020 11:50 AM GMT

    West Godavari updates: చేపట్టిన ఛలో అమలాపురం కి ఎలాంటి అనుమతులు లేవు.. ఏలూరు రేంజ్ డిఐజి మోహనరావు..

    పశ్చిమ గోదావరి జిల్లా..

    డిఐజి మోహనరావు కామెంట్స్..

    -ఎవరు కూడా అమలాపురాని కి రావద్దు..

    -కోనసీమలో సెక్షన్ 144, 30 అమలులో ఉంది..

    -ఎవరైనా విధ్వంసాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం..

  • East  Godavari-Prathipadu: తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యముగా వైసిపి పని చేస్తోంది..చినరాజప్ప..
    18 Sep 2020 11:45 AM GMT

    East Godavari-Prathipadu: తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యముగా వైసిపి పని చేస్తోంది..చినరాజప్ప..

    తూర్పుగోదావరి : ప్రత్తిపాడు....

    -ప్రత్తిపాడులో వరుపుల రాజా నివాసం వద్ద టిడిపి నేతల సమావేశం.

    -హాజరైన నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, యనమల కృష్ణుడు, జ్యోతుల నవీన్..

    చినరాజప్ప పాయింట్స్..

    -వరుపుల రాజా పై లంపకలోవ సొసైటీలో పెట్టిన కేసు రాజకీయ కక్షసాధింపులో భాగమే..

    -రాష్ట్రములో దేవాలయాలపై జరుగుతున్న దాడులు కేవలం ప్రభుత్వ వైఫల్యం..

    -పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణిలో 20శాతం మాత్రమే కోర్టు కేసులు ఉన్నాయి..

    -మిగతావి ప్రజలకు పంచకపోవడం పై వైసీపీ ఆంతర్యం ఏంటో స్పష్టం చేయాలి..

    -హిందూ దేవాలయాల పై జరిగిన దాడుల పై నిరసన తెలపడానికి వెళ్లే వారిని అడ్డుకోవడం దురదృష్టకరం..

  • Vijayawada-Durgamma updates: వచ్చే నెల 17 నుండి 25 వరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం.. దుర్గగుడి ఈవో సురేష్ బాబు..
    18 Sep 2020 11:34 AM GMT

    Vijayawada-Durgamma updates: వచ్చే నెల 17 నుండి 25 వరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం.. దుర్గగుడి ఈవో సురేష్ బాబు..

    విజయవాడ..

    దుర్గగుడి ఈవో సురేష్ బాబు..

    - ఈ రోజు నుండి ఆన్లైన్ లో దర్శన టికెట్ లు అందుబాటులో ఉన్నాయి

    - కొండపైకి రవాణా సౌకర్యం లేదు

    - నది స్నానానికి అనుమతి లేదు

    - తలనీలాలు రద్దు చేసాం

    - భవాని భక్తులైన, సాధారణ భక్తులు అయిన ఆన్లైన్ లొనే టికెట్ తీసుకోవాలి

    - మొదటి రోజు ఉదయం 9 గంటలు నుండి రాత్రి 8 గంటలు వరకు మిగిలిన రోజులు ఉదయం 5 నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది

  • Vijayawada-Durgamma updates: దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి రోజుకి 10 వేల మందికి మాత్రమే అనుమతి.. పైలా సోమినాయుడు, దుర్గగుడి చైర్మన్..
    18 Sep 2020 11:28 AM GMT

    Vijayawada-Durgamma updates: దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి రోజుకి 10 వేల మందికి మాత్రమే అనుమతి.. పైలా సోమినాయుడు, దుర్గగుడి చైర్మన్..

    విజయవాడ..

    పైలా సోమినాయుడు, దుర్గగుడి చైర్మన్..

    -ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం

    -మూల నక్షత్రం రోజు తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి

    -4వేల టికెట్ లు ఉచిత దర్శనానికి కేటాయించాము, 3 వేల టికెట్ లు 100 రూపాయలు, 3వేల టికెట్ లు 300 రూపాయలకు కేటాయించాము

    -టైం స్లాట్ ప్రకారం భక్తులు దర్శనానికి రావాలి

    -5 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు దర్శనానికి అనుమతి లేదు

    -కోవిడ్ నేపద్యంలో తలనీలాలు సమర్పణ రద్దు చేసాం

    -వినాయక టెంపుల్ నుండి ఘాట్ రోడ్ మీదుగా క్యూ లైన్ ద్వారా భక్తులు రావాలి

    -ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి దర్శనానికి రావాలి

  • Andhra Pradesh High Court: కోర్టు రాజకీయ వేదిక కాదు... ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు..
    18 Sep 2020 11:23 AM GMT

    Andhra Pradesh High Court: కోర్టు రాజకీయ వేదిక కాదు... ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు..

    అమరావతి..

    - ప్రభుత్వ భూముల వేలానికి సంబంధించి మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.

    - పూర్తిస్థాయి విచారణకు అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.

    - ప్రభుత్వం చేసే ప్రతి పనికి పిటిషనర్లు అడ్డుపడుతున్నారని వ్యాఖ్యలు చేసిన అదనపు అడ్వకేట్ జనరల్.

    - ఈ వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు

    - కోర్టు రాజకీయ వేదిక కాదని స్పష్టం చేసిన ధర్మాసనం

    - అక్టోబర్ 6వ తేదీలోపు ప్రభుత్వాన్ని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశo.

    - మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ

    - ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు... పూర్తిస్థాయి విచారణకు అక్టోబర్ 16వ తేదీకి వాయిదా

    - గుంటూరు, విశాఖ జిల్లాల్లో ప్రభుత్వ భూములు, ఆస్తుల విక్రయాన్ని సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన తోట సురేశ్ బాబు దాఖలు చేసిన ప్రజాహిత     వ్యాజ్యంతో  పాటు పలు పిటిషన్లపైనా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ

    - ఈ వ్యాజ్యాలతో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ కార్యదర్శులు... అక్టోబర్ 6వ తేదీలోగా కౌంటర్ల దాఖలు చేయాలని, పిటిషనర్లు అక్టోబర్ 9వ తేదీలోగా రిప్లే     కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ

    - మిషన్ బిల్డ్ ఏపీ ద్వారా భూముల వేలాన్ని నిలిపివేయాలని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

  • 18 Sep 2020 8:48 AM GMT

    Amaravati updates: ఫైబర్ నెట్టుని అడ్డం పెట్టుకుని వేమూరి హరి ప్రసాద్ భారీ ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు..గౌరీ శంకర్...

    అమరావతి..

    గౌరీ శంకర్...

    -ఫైబర్ నెట్ స్కామ్ విషయంలో హరి ప్రసాద్ చేసిన అక్రమాలపై నా దగ్గర సాక్ష్యాలున్నాయి.

    -ఏపీ ఎస్ఎఫ్ఎల్ సంస్థని తన సొంత ప్రైవేట్ కంపెనీగా నడిపించారు.

    -ఏపీ ఫైబర్ నెట్టులో ఇంకా హరి ప్రసాద్ మనుషులే ఉన్నారు.

    -ఫైబర్ నెట్ బిల్లింగ్ సాఫ్ట్ వేరులో అవకతవకల కారణంగా కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది.

    -బిల్లింగులో అవకతవకలు అరికట్టేందుకు కొత్త బిల్లింగ్ సాఫ్ట్ వేర్ రూపొందించాలని అనుకున్నాం.

    -కొత్త సాఫ్ట్ వేర్ పని చేయకుండా ఉండేలా నెట్ వర్క్ డౌన్ చేశారు.

    -నెట్ వర్క్ డౌన్ చేసినందుకు టెరా సాఫ్ట్ కంపెనీపై వైజాగులో కేసు పెట్టాం.

    -ఫైబర్ నెట్ బిల్లింగ్ సాఫ్ట్ వేర్ లోపాలను కనిపెట్టినందుకే నాపై కుట్ర పన్నారు.

  • Guntur updates: ప్రభుత్వ ఆస్తుల విక్రయం (మిషన్ బిల్డ్ ఏ పి) పై నేడు హైకోర్టులో విచారణ....
    18 Sep 2020 8:43 AM GMT

    Guntur updates: ప్రభుత్వ ఆస్తుల విక్రయం (మిషన్ బిల్డ్ ఏ పి) పై నేడు హైకోర్టులో విచారణ....

    గుంటూరు...

    -ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని ఆపివేయాలని హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన గుంటూరు కు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు....

    -పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్..

    -ప్రతిపనికి అడ్డం తగులుతున్నారు

    -పరిపాలన వారినే చేసుకోమనండి ఏజీ వ్యాఖ్యలు, మీరు ఎవరినీ ఉద్దేశించి మాట్లాడారు , హై కోర్టు నా! పిటిషనర్ లనా! అని న్యాయ మూర్తి వ్యాఖ్యలు....

    -విషయాలన్నింటిని కూలంకషంగా పూర్తి స్థాయి విచారణ చేసి తీర్పు ను అక్టోబర్16 కు వాయిదా.

    -ప్రతివాదులుగా ఉన్న అన్నీ విభాగాల ప్రభుత్వ కార్యదర్శులకు అన్నీ కేసుల్లో కౌంటర్ దాఖాలు చేయలన్న ధర్మాసనం.

  • Polavaram Project updates: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై దాఖలైన పిటిషన్లపై జాతీయ హరిత ట్రైబ్యూనల్ లో విచారణ..
    18 Sep 2020 8:41 AM GMT

    Polavaram Project updates: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై దాఖలైన పిటిషన్లపై జాతీయ హరిత ట్రైబ్యూనల్ లో విచారణ..

    జాతీయం..

    -ముంపు ప్రభావంపై ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ నివేదికను ఆమోదించిన ఎన్జీటీ

    -కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న కమిటీ ప్రతిపాదనను వ్యతిరేకించిన ఎన్జీటీ

    -రెండు నెలల్లో పోలవరం ప్రాజెక్టు ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గఢ్ లతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశం

    -ఏపీలో పోలవరం ముంపు బాధితులకు ఆరు నెలల్లో పునరావసం, పరిహారం చెల్లించాలని ఎన్జీటీ ఆదేశం

  • Sucharitha Comments: జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైన పాదయాత్ర లో మహిళల కష్టాలు స్వయంగా విని చలించిపోయారు..మేకతోటి సుచరిత..
    18 Sep 2020 8:38 AM GMT

    Sucharitha Comments: జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైన పాదయాత్ర లో మహిళల కష్టాలు స్వయంగా విని చలించిపోయారు..మేకతోటి సుచరిత..

    గుంటూరు:

    మేకతోటి సుచరిత - హోంమంత్రి వర్యులు...

    -ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో జరిగిన వై.యస్.ఆర్ ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో పాల్గోన్న హోంమంత్రి మేకతోటి సుచరిత.....

    -ప్రత్తిపాడు నియోజకవర్గం లో కూడా చాలా మంది మహిళలు కష్టాలు చెప్పుకున్నారు.

    -మహిళల కష్టాలు చూసి చలించిన జగన్మోహన్ గారు అనేక పథకాలను ప్రవేశపెట్టారు.

    -దేశంలో ఎక్కడా లేని విధంగా 65 వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేయడం జరిగింది.

    -వై.యస్.ఆర్ చేయూత, ఆసరా, పావలా వడ్డీ, ఇలా అనేక పథకాలు మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టారు.

    -మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలనే తపనతో సీఎం పథకాలను ప్రవేశపెట్టారు.

    -ఆనాడు వై.యస్.ఆర్ మహిళలను లక్షాధికారిగా చూడాలని కలగన్నారు. నేడు సీఎం జగన్ చేసి చూపించారు..

    -మహిళల పేరు మీద ఇళ్ల పట్టాల కూడా త్వరలోనే ఇవ్వనున్నారు. ఇంటి నిర్మాణం కోసం రుణం కూడా ఇస్తోంది ఈ ప్రభుత్వం.

    -అమ్మవడి, విద్యా దీవెన, వసతి దీవెన ఇలా ప్రతి పథకం లోనూ సీఎం మహిళలను భాగస్వామ్యం చేసారు.

    -సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలా పక్షపాతి అనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు.

  • 18 Sep 2020 8:32 AM GMT

    Amaravati updates: కోవిడ్‌ –19 నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష..

    అమరావతి..

    సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

    -కోవిడ్‌ –19 నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

    -హాజరైన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, వైద్య,ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు.

Print Article
Next Story
More Stories