Live Updates: ఈరోజు (సెప్టెంబర్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 18 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి మ.2-55 వరకు తదుపరి విదియ | ఉత్తర నక్షత్రం ఉ.9-35 తదుపరి హస్త | వర్జ్యం: సా.5-25 నుంచి 6-55 వరకు | అమృత ఘడియలు: రా.2-23 నుంచి 3-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-05 వరకు, తిరిగి మ.12-19 నుంచి 1-08 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-59

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 18 Sep 2020 12:39 PM GMT

    Tirumal-Tirupati updates: దేవుడ్ని అడ్డుపెట్టి రాజకీయాలు చేసే వాళ్ళు దరిద్రులు....చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి...ప్రభుత్వ విప్..

    తిరుపతి ...

    చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి...ప్రభుత్వ విప్

    -దేవుడ్ని అడ్డుపెట్టి రాజకీయాలు చేసే వాళ్ళు దరిద్రులు....

    -దేవుడే లేదన్న డిఎమ్‌కె పార్టీని...

    -అత్యంత భక్తి గల తమిళలు గెలిపించడం లేదా....

    -శ్రీవారి దర్శనం తరువాతే పాదయాత్ర ను జగన్ ప్రారంబించారు... పాదయాత్ర ముగింపు తరువాత తిరుమలకు వచ్చారు...

    -మిరాశీ వ్యవస్థను చట్టం చేసిన ఘనత జగన్ ది..

    -జంధ్యం వేసుకోని బ్రహ్మణుడు లాంటి వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి...

    -వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి ఉన్న భక్తిలో పదిశాతం కూడా చంద్రబాబు లేదు...

    -వై వి సుబ్బారెడ్డి పై నిరాధార ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు సవాల్... చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధం...

    -శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారంలో ఎటువంటి పరిస్థితిల్లో ప్రభుత్వం వదిలి పెట్టాదు...

    -తప్పుచేసిన వారిపై చర్యలు ఉంటాయ్

  • Amaravati updates: ముఖ్యమంత్రి జగన్ తో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు భేటీ...
    18 Sep 2020 12:35 PM GMT

    Amaravati updates: ముఖ్యమంత్రి జగన్ తో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు భేటీ...

    అమరావతి..

    -భావనపాడు పోర్టు నిర్మాణం, భూ సేకరణ, ఆర్&ఆర్ ప్యాకేజ్, ఇళ్ల స్థలాల పంపిణీ, పరిహారం పెంపు కు సంబంధించి అంశాలపై ప్రధానంగా చర్చ.

    -పశుసంవర్ధక శాఖ కు సంబంధించి సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యలు గురించి, సంస్థాగతంగా అవసరాన్ని బట్టి పశువైద్యుల క్రమబద్దీకరణ వంటి      అంశాలపై సీఎంతో చర్చించిన మంత్రి..

  • 18 Sep 2020 12:31 PM GMT

    Visakhapatnam updates: ఛలో అమలాపురం కార్యక్రమాన్ని అడ్డుకోవడం పై బిజేపి శాంతియుత నిరసన..విష్ణుకుమార్..

    విశాఖ..

    బిజేపి ఏపి ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్

    -నివాసం వద్ద ప్రభుత్వ తీరుకు ఖండన.

    -బిజేపి ఏపి ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు కామెంట్స్.

    -రాష్ట్రంలో అరచాకపాలన సాగుతోంది.

    -హిందువుల మనోభావాలను జగన్ ప్రభుత్వం దెబ్బతీస్తోంది.

    -దేవాలయ ఆస్ధులు, భూములు కొల్లగొట్టాలని చూస్తే పరాభవం తప్పదు.

    -గృహనిర్భంధాలు చేసినంత మాత్రాన తమ పోరాటం ఆగదు.

    -జగన్ ప్రభుత్వం మూడున్నరేళ్లు కొనసాగుతుందన్న గ్యారంటీ లేదు.

    -ప్రశ్నిస్తే గొంతునొక్కే దోరణి ఆట్టేకాలం సాగదు.

  • Amaravati updates: ప్ర‌జాస్వామ్య దేశంలో ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం విజ‌య‌వంతంగా ప‌రిపాల‌న సాగుతోంది.. అంబటి రాంబాబు...
    18 Sep 2020 12:28 PM GMT

    Amaravati updates: ప్ర‌జాస్వామ్య దేశంలో ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం విజ‌య‌వంతంగా ప‌రిపాల‌న సాగుతోంది.. అంబటి రాంబాబు...

    అమరావతి...

    అంబటి రాంబాబు...వైసీపీ ఎమ్మెల్యే

    -ప్ర‌జాస్వామ్యానికి నాలుగు స్తంభాలైన లేజిస్లేచ‌ర్, ఎగ్జిక్యూటివ్, జ్యూడిషీయ‌ర్, మీడియా త‌మ త‌మ విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డం వ‌ల‌నే ప్ర‌జాస్వామ్యం   విజ‌యం సాధించింది.

    -రాజ్యాంగాన్ని ప‌రిశీలిస్తే ఎవ‌రికి ఏ హ‌క్కులు ఉన్నాయో తెలుస్తుంది.

    -న్యాయ‌వ్య‌వస్థ‌కు రాజ్యాంగ ప‌రిధిలోనే పూర్తి అధికారాలు ఇవ్వ‌బ‌డ్డాయి.

    -రాజ్యాంగానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌బ‌బు కాదు.

    -చంద్ర‌బాబు అక్ర‌మాస్తుల కేసు పెండింగ్ లో ఉంది

    -సుమారుగా 15 సంవ‌త్స‌రాల పాటు స్టేలో ఉండిపోయింది, విచార‌ణ‌కు రావ‌ట్లేదు

    -చంద్ర‌బాబుపై అనేక కే‌సులు ఉన్నాయి, ఆ స్టే లు అన్ని పోయి విచార‌ణ జ‌ర‌గాలి

    -ఓటుకు కోట్లు కేసులో చంద్ర‌బాబు అడ్డంగా బుక్క‌య్యారు

    -ఈ కేసును కూడా త్వ‌రిత‌గ‌తిన విచార‌ణ జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఉంది

    -మ‌న‌వాళ్లు బ్రీఫ్ డ్ మీ అని డ‌బ్బులిస్తూ దొరికిపోయిన వ్య‌క్తి భార‌త‌దేశ చరిత్ర‌లో ఎక్క‌డా లేదు

    -అమ‌రావ‌తి కుంభ‌కోణం చాలా పెద్ద‌ది.

    -చంద్ర‌బాబు కుమారుడు లోకేష్ కు ఇందులో ప్ర‌మేయం ఉంది‌

    -దీనిమీద స‌త్వ‌ర‌మే విచార‌ణ జ‌రిపి నిగ్గుతేల్చాలి

    -భార‌త‌దేశంలో అతి ప‌విత్ర‌మైన‌ది న్యాయ‌వ్య‌వ‌స్థ..న్యాయ‌వ్య‌వ‌స్థపై మాకు అపార‌మైన విశ్వాసం ఉంది

  • 18 Sep 2020 12:21 PM GMT

    K.Kannababu Comments: కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక..కె.కన్నబాబు..

    అమరావతి..

    - కె.కన్నబాబు, విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్..

    కృష్ణా జిల్లా..

    -నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు,మైలవరం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.

    తూర్పుగోదావరి జిల్లా..

    -రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం

    -మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.

    -పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలిలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.

    సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.

  • Amaravati updates: కోవిడ్–19 నివారణ చర్యలు, ఆరోగ్యశ్రీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష సమావేశం..
    18 Sep 2020 12:15 PM GMT

    Amaravati updates: కోవిడ్–19 నివారణ చర్యలు, ఆరోగ్యశ్రీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష సమావేశం..

    అమరావతి..

    - ఐవీఆర్‌ఎస్‌ ప్రశ్నల్లో మరింత స్పష్టత రావాలి

    - వైద్య సేవలు, శానిటేషన్‌పై ప్రశ్నలు మారాలి

    - హోం ఐసొలేషన్‌లో ఉన్న వారందరికీ కిట్లు అందాలి

    - కోవిడ్‌–19, ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి సమీక్ష

    - అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి అనుమతి

    - ఆరోగ్య ఆసరాలో ఆర్థిక సహాయం పెంపు

    - సాధారణ కాన్పుకు రూ.5 వేలు. సిజేరియన్‌కు రూ.3 వేలు

    - అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో తప్పనిసరిగా హెల్ప్‌డెస్క్‌లు

    - ఆరోగ్యమిత్రలు ఆరు రకాల బాధ్యతలు నిర్వర్తించాలి

    - ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో పూర్తి సదుపాయాలు ఉండాలి

    - జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం సమన్వయ బాధ్యతలు జేసీకి

    - మరింత సమగ్ర సమాచారంతో ఆరోగ్యశ్రీ క్యూఆర్‌ కోడ్‌ కార్డులు

  • 18 Sep 2020 12:09 PM GMT

    Vishnuvardhan Reddy Comments: తూర్పు గోదావరి జిల్లా ఎస్పి, అమలాపురం డిఎస్పీ లను ప్రభుత్వం సస్పెండ్ చేయాలి..విష్ణు వర్ధన్ రెడ్డి..

    కృష్ణా జిల్లా..

    గుడివాడలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి..

    *వైసిపి ప్రభుత్వం,బిజెపి తో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటం ఆడి నట్లే

    *రాష్ట్రంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి,జగన్ ప్రభుత్వం పోలీస్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది

    *అడగకుండానే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కు ఆదేశించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు అన్నింటిపై       సీబీఐ విచారణ జరపాలి

    *నన్ను అరెస్ట్ చేసి నా వ్యక్తి గత స్వేచ్ఛను హరించిన పోలీసులపై,భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను

  • Tirumala-Tirupati updates: టిటిడిలో ఎక్కడ అన్యమత ప్రచారం జరగలేదు..వైవీ సుబ్బారెడ్డి..
    18 Sep 2020 12:05 PM GMT

    Tirumala-Tirupati updates: టిటిడిలో ఎక్కడ అన్యమత ప్రచారం జరగలేదు..వైవీ సుబ్బారెడ్డి..

    తిరుమల :

    -వైవీ సుబ్బారెడ్డి, టిటిడి చైర్మన్:

    -టిటిడిలో ఉన్న దళారి వ్యవస్ధను, అవినీతిని పూర్తిగా నిర్మూలించాం..

    -స్వామివారి డబ్బు దుర్వినియోగం కాకుండా చూస్తున్నాం..

    -గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు చరిత్రలో ఎన్నడూ జరగలేదు..

    -మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేదు..

  • Tirumala-Tirupati updates: కరోనా ప్రభావంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం.. వేణుగోపాల్ దీక్షితులు..
    18 Sep 2020 12:02 PM GMT

    Tirumala-Tirupati updates: కరోనా ప్రభావంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం.. వేణుగోపాల్ దీక్షితులు..

    తిరుమల :

    -వేణుగోపాల్ దీక్షితులు.., ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహా దారులు

    -ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కళ్యాణ మండపం బ్రహ్మోత్సవ వేదిక..

    -స్వర్ణ రధం, స్వర్ణ రధం బదులుగా ఏకాంతంగా సర్వ భూపాలవాహనం స్వామి వారిని కొలువు దీరుస్తాం..

    -ప్రతి ఏడాది తిరువీధి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది..

    -కరోనా ప్రభావంతో ఈ ఏడాది బలి పీఠం వద్ద అష్టదిక్కపాలకులను ఆహ్వానిస్తాం..

  • Tirumala-Tirupati updates: సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం..వైవీ సుబ్బారెడ్డి..
    18 Sep 2020 11:55 AM GMT

    Tirumala-Tirupati updates: సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం..వైవీ సుబ్బారెడ్డి..

    తిరుమల :

    -వైవీ సుబ్బారెడ్డి.., టీటీడీ పాలకమండలి చైర్మన్

    -19 నుండి 27 వరకూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం..

    -ఇవాళ శ్రీవారి బ్రహ్మోత్సవాల కు అంకురార్పణ..

    -రేపు ధ్వజారోహణ కార్యక్రమం తో బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

    -రాష్ట్ర ప్రభుత్వం తరపున 23 వ తారీఖున సీఎం పట్టువస్త్రాలు..

    -ఈ ఏడాది కరోనా కు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నాం..

    -ఏకాంతంగా ఆలయంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం..

    -మహారధం,స్వర్ణ రధం బదులుగా సర్వభూపాల వాహనం పై స్వామివారికి వాహన సేవ నిర్వహిస్తాం..

    -24వ తేదీ శ్రీవారిని దర్శించుకొని నాద నీరాజనం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు..

    -కర్ణాటక సత్రం శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గోని తిరుగు ప్రయాణం అవుతారు..

    -రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలతోనే స్వామి వారి దర్శనం‌ కల్పిస్తున్నాం

Print Article
Next Story
More Stories