Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Vijayawada updates: దుర్గ గుడి ఘాట్ రోడ్ వద్ద జనసేన పార్టీ నేత పోతిన మహేష్ ఆధ్వర్యంలో అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి నిరసన..
    17 Sep 2020 7:42 AM GMT

    Vijayawada updates: దుర్గ గుడి ఘాట్ రోడ్ వద్ద జనసేన పార్టీ నేత పోతిన మహేష్ ఆధ్వర్యంలో అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి నిరసన..

    విజయవాడ..

    పోతిన మహేష్ జనసేన లీడర్..

    -దుర్గ గుడి ఘాట్ రోడ్ వద్ద జనసేన పార్టీ నేత పోతిన మహేష్ ఆధ్వర్యంలో దుర్గమ్మ నీ ఆస్తులు నువ్వే కాపాడుకోవాలని అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి నిరసన..

    -ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ వీర మహిళలు, నేతలు..

    -దుర్గమ్మ దేవస్థానం లో వెండి సింహాలు మాయం ఘటన లో తక్షణం ఈవో ని సస్పెండ్ చేయాలి...

    -రేపు సాయంత్రం లోపు విచారణ పూర్తి చేసి ఘటన బాద్యులుపై చర్యలు తీసుకోకపోతే శనివారం వెల్లంపల్లి ఇంటిని ముట్టడి చేస్తాం..

    -దుర్గమ్మ దేవస్థానంలో మూడు సింహాలు మాయం అయిన ఘటన లో విచారణ పారదర్శకంగా జరగటం లేదు..

    -దేవస్థానంలో ఈవో గా ఐఏఎస్ అధికారిని నియమించాలి..

    -రాష్ట్రంలో దేవాలయల మీద దాడులు కి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలి...

  • Srikakulam updates: జిల్లా అటవీశాఖ కార్యాలయం ఎదుట నర్సరీ కార్మికుల ఆందోళన..
    17 Sep 2020 7:35 AM GMT

    Srikakulam updates: జిల్లా అటవీశాఖ కార్యాలయం ఎదుట నర్సరీ కార్మికుల ఆందోళన..

    శ్రీకాకుళం జిల్లా..

    -బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా..

    -కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగిన కార్మికులు..

    -9 నెలలుగా జీతాలు చెల్లోంచడం లేదంటూ ఆందోళన..

  • Visakha updates: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో రక్తదానం శిబిరం..
    17 Sep 2020 7:32 AM GMT

    Visakha updates: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో రక్తదానం శిబిరం..

    విశాఖ

    -వికలాంగులకు ట్రై సైకిల్స్, కృత్రిమ అవయవాలు పంపిణీ.

    -హాజరైన మాజీ ఎంపీ హరిబాబు, నగర బిజెపి నేతలు, కార్యకర్తలు.

    -మాజీ ఎంపీ హరిబాబు కామెంట్స్

    -నాయకుల జన్మదినాన్ని ఉత్సవాలుగా జరిపే పద్దతి బిజెపిలో లేదు

    -మోదీ జన్మదిన సందర్భంగా ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.

    -కోవిడ్ నేపథ్యంలో రక్తం అవసరం ఉంటుంది కాబట్టి రక్త దాన శిబిరం నిర్వహించాం.

    -మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం.

    -పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టం.

    -విశ్వ కర్మ జయంతి సందర్భాగా చేతి వృత్తి కళాకారులను సన్మానించిన మాజీ ఎంపీ హరిబాబు.

  • Guntur updates: అహల్య ఆసుపత్రిలో ప్రధాని మోదీ 70వ జన్మ దిన వేడుకలు..
    17 Sep 2020 7:27 AM GMT

    Guntur updates: అహల్య ఆసుపత్రిలో ప్రధాని మోదీ 70వ జన్మ దిన వేడుకలు..

    గుంటూరు...

    -వేడుకల్లో పాల్గొని పేద కళాకారులకు నిత్యవసర వస్తువుల పంపిణీ చేసిన కన్నా, మాజీ మంత్రి శనక్కాల అరుణ, ఉమా శంకర్.

    కన్నా కామెంట్స్.

    -పేద కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగారు...

    -దేశ సౌరభౌమత్వానికి ఇబ్బంది కల్గించాలని చూసిన వారికి మోదీ సింహస్వప్నంలా నిలిచారు.

    -సమర్థవంతంగా మోదీ పరిపాలన చేస్తున్నారు.

    -గతంలో కాంగ్రెస్ ఇతర దేశాల పట్ల మెతకవైఖరీ అవలంభించింది.

    -ప్రపంచ మొత్తం భారత దేశంవైపు చూసేలా పాలన సాగిస్తున్నారు...

  • Amaravati upates: తమ అవినీతి నుంచి ప్రజలదృష్టి మరల్చడం తప్ప 15 నెలల్లో వైసీపీ ప్రజలకు చేసిందేంటి?కిమిడి కళా వెంకట్రావు..
    17 Sep 2020 7:00 AM GMT

    Amaravati upates: తమ అవినీతి నుంచి ప్రజలదృష్టి మరల్చడం తప్ప 15 నెలల్లో వైసీపీ ప్రజలకు చేసిందేంటి?కిమిడి కళా వెంకట్రావు..

    అమరావతి..

    కిమిడి కళా వెంకట్రావు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు

    -తాడేపల్లిలో ఉన్నది వైసీపీ కేంద్ర కార్యాలయం కాదు, కుట్రలకు కేంద్రాలయం

    -వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ చేయించే దమ్ము ప్రభుత్వానికి ఉందా?

  • Vijayasai Reddy: ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉంది. ఈ ధోరణి వెంటనే మానుకోవాలి: విజయసాయి రెడ్డి
    17 Sep 2020 6:56 AM GMT

    Vijayasai Reddy: ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉంది. ఈ ధోరణి వెంటనే మానుకోవాలి: విజయసాయి రెడ్డి

    జాతీయం..

    ఢిల్లీ..

    -విజయసాయి రెడ్డి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ

    -న్యాయ వ్యవస్థ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది

    -ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపరమైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి

    -హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోంది

    -మీడియా పైన, సోషల్ మీడియా పైనా ఏపీ హైకోర్టు నిషేధం విధించింది

    -మాజీ అడ్వకేట్ జనరల్ నమోదైన ఎఫ్ఐఆర్ను రిపోర్ట్ చేయవద్దని నిషేధం విధించింది

    -ఈ చర్యలను సమర్ధించుకునే ఏ ఆధారమూ లేదు

    -ఈ రకమైన సెన్సార్షిప్ అసాధారణమైనది బ్రిటిష్ తరహాలో వ్యవహరిస్తున్నారు

    -దీనికి సంబంధించిన మరో కేసు పైన స్టే విధించారు

    -గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నారు

    -మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటినీ లేకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు

    -జుడిషియల్ నుంచి తీవ్రమైన న ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో కరోనా నిరోధంలో రాష్ట్రం ముందు ఉంది

  • 17 Sep 2020 6:42 AM GMT

    Andrapradesh Latest news: హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపండి: విజయసాయి రెడ్డి విజ్ఞప్తి..

    జాతీయం

    -రైల్వే మంత్రికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి

    -రాజ్యసభలో స్పెషల్ మెన్షనింగ్ ద్వారా కోరిన ఎంపీ

    -ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు

    -వలస కార్మికులు, ప్రయాణికులకు ఉన్న రైళ్లు సరిపోవడం లేదు

    -కొత్తగా 80 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా, అందులో హైదరాబాద్-విశాఖ, హైదరాబాద్-తిరుపతి మధ్య ఒక్క రైలు కూడా లేదు

    -ఏపీ, తెలంగాణ మధ్య అత్యధికంగా రాకపోకలు సాగించే మార్గాలివి

    -ప్రత్యేక రైళ్లను వెంటనే ప్రవేశపెట్టి సహకరించండి

  • 17 Sep 2020 5:34 AM GMT

    Amaravati updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ...

    అమరావతి..

    -కేంద్ర విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయండి.

    -డిస్కంల నిర్వహణ, సబ్సిడీలు, ఈ ఆర్ సి వంటివి కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయి, రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుంది.

    -విద్యుత్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపితే రైతులకిచ్చే ఉచిత విద్యుత్కు మీటర్లు బిగించడం తప్పనిసరి.

    -తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రాక్షస బిల్లుగా పరిగణించి, బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది.

    -కానీ ఏపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలకు పచ్చజెండా ఊపి ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ అంటున్నది.

    -కేవలం రుణ పరిమితి పెంచుకొని, అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతి కోసం కేంద్ర నిర్ణయాలకు సై అనటం సరికాదు.

  • 17 Sep 2020 5:29 AM GMT

    Vijayawada updates: ఇంద్రకీలాద్రి పై వెండి రథం సింహాల మాయం పై నేడు రెండో రోజు కొనసాగనున్న విచారణ....

    విజయవాడ..

    -మొదటి రోజు రికార్డ్ లు పరిశీలించిన విచారణ అధికారి మూర్తి...

    -నేడు కూడా రికార్డ్ లు పరిశీలించనున్న మూర్తి..

    -1999 లో తయారైన రథం

    -రథం పై రెండు సింహాలు ఉన్నాయా...? నాలుగు సింహాలు ఉన్నాయా..? అని కొనసాగుతున్న సందిగ్దత...

    -మధ్యాహ్నం వెండి రథాన్ని పరిశీలించనున్న విచారణ అధికారి మూర్తి

    -ఈవో సురేష్ బాబు తో సమాన హోదా కలిగిన వ్యక్తి ని విచారణ అధికారిగా నియామకం చేయటం పట్ల పలు విమర్శలు...

  • 17 Sep 2020 5:24 AM GMT

    East Godavari updates: అంతర్వేది రధం దగ్ధం ఘటనకు నిరసనగా బిజెపి, ధార్మిక సంఘాలు నిర్వహించిన ఆందోళన లో పోలీసులు అరెస్టు చేసిన 37 మంది జైలు నుంచి విడుదల..

    తూర్పుగోదావరి :

    -కాకినాడ సబ్ జైలు నుంచి విడుదల అయిన కార్యకర్తలకు ఘన స్వాగతం పలికిన బిజెపి, జనసేన ధార్మిక సంఘాలు నాయకులు..

    -అరెస్టు చేసిన వారిని బెయిల్ పై విడుదల చేయడంతో కాకినాడ సబ్ జైలు నుంచి బిజెపి, హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ..

    -హాజరైన ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పాయింట్స్..

    -యువకుల పై కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారు, షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం దారుణం..

    -కేసులు ఎత్తేసే వరకు వారికి అండగా ఉంటాం.. రాష్ట్రం లో హిందు దేవాలయాలపై దాడులు జరగడం అమానుషం..

    -దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోంది..

    -అంతర్వేది ఘటనలో ఎటువంటి విచారణ చేపట్టని ప్రభుత్వం ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేసింది..

    -రేపు అమలాపురం లో మహా ధర్నా నిర్వహిస్తాము..

Print Article
Next Story
More Stories